సుధేష్ణ
From Wikipedia, the free encyclopedia
సుధేష్ణ మహాభారతం ఇతిహాసంలోని నాలుగవ భాగము విరాట పర్వము ప్రథమాశ్వాసము లోని పాత్ర, విరాటరాజు భార్య. పాండవులు తమ అజ్ఞాతవాస సమయంలో ఒక సంవత్సరం విరాటుని రాజ్యంలో గడిపారు. ఈమె ఉత్తర కుమారుడు, ఉత్తర, శ్వేత, శంఖాలకు తల్లి. ఈమెకు కీచకుడు[1] అనే తమ్ముడు, సహతానికా అనే మరదలు ఉన్నారు.[2]
త్వరిత వాస్తవాలు సుధేష్ణ, సమాచారం ...
సుధేష్ణ | |
---|---|
సమాచారం | |
దాంపత్యభాగస్వామి | విరాటరాజు |
పిల్లలు | ఉత్తర కుమారుడు, ఉత్తర, శ్వేత, శంఖా |
మూసివేయి
సుధేష్ణకు సంబంధించిన మూలం రాజ్యం గురించి మహాభారతంలో పేర్కొనబడలేదు. ఈమె తమ్ముడు కీచకుడు మత్స్యరాజ్య సైన్యాధిపతి. కాబట్టి బహుశా సుధేష్ణ మత్స్య మూలానికి చెందినది. ఆధునిక పరిభాషలో సుధేష్ణ అంటే మంచిగా పుట్టినది అర్థం.