జనవరి 19: ఇంగ్లాండ్ పార్లమెంట్ దేశపు సైన్యం పరిమాణాన్ని 7,000 'స్థానికంగా జన్మించిన' పురుషుల వరకే పరిమితం చేసింది; [1] అందువల్ల, కింగ్ విలియం III యొక్క డచ్ బ్లూ గార్డ్స్ ఈ వరుసలో పనిచేయలేరు. ఫిబ్రవరి 1 చట్టం ప్రకారం, ఐర్లాండ్లో విదేశీ దళాలను రద్దు చేయడం కూడా అవసరం. [2]
జనవరి 26: రిపబ్లిక్ ఆఫ్ వెనిస్, పోలిష్-లిథువేనియన్ కామన్వెల్త్, హోలీ రోమన్ సామ్రాజ్యాలు ఒట్టోమన్ సామ్రాజ్యంతో కార్లోవిట్జ్ ఒప్పందంపై సంతకం చేశాయి, ఇది ఒట్టోమన్-హాబ్స్బర్గ్ యుద్ధాల యొక్క ప్రధాన దశకు ముగింపు పలికింది. ఒట్టోమన్ టర్కులు బమేట్ ఆఫ్ తేమేశ్వర్ మినహా ట్రాన్సిల్వేనియా, స్లావోనియా, క్రొయేషియా, హంగేరిల్లోని తమ పూర్వ భూభాగాలన్నింటినీ ఆస్ట్రియాకు ఇచ్చేసారు.. పెలోపొన్నీస్, డాల్మాటియాలను వెనిస్కు అప్పగించారు. ఉక్రెయిన్ లోని పెద్ద ప్రాంతాలను పోలాండుకు ఇచ్చారు. అటు తరువాత ఒట్టోమన్ సామ్రాజ్యం తన విస్తరణ వాదాన్ని విడిచిపెట్టి, రక్షణాత్మక భంగిమను అవలంబించడం మొదలుపెట్టింది. దాంతో ఈ ఒప్పందం ఒక ప్రధాన భౌగోళిక రాజకీయ మార్పుకు దారితీసినట్లైంది.
ఫిబ్రవరి 4: మాస్కోలో 350 మంది తిరుగుబాటు స్ట్రెల్ట్సీలను ఉరితీశారు.