ఆంగ్లో-బర్మా యుద్ధం ముగిసింది. యాండబో ఒప్పందం కుదిరింది.
యాండబో ఒప్పందం పర్యవసానంగా అస్సాం, మణిపూర్లను బ్రిటిషు వారు తమ అధీనం లోకి తెచ్చుకున్నారు.
మార్చి 1: భారత్ నుండి లండన్ తీసుకువెళ్ళిన చునీ అనే ఏనుగు హింసాత్మకంగా మారి, మావటీలకు అలిమి కాకపోవడంతో, దాన్ని కత్తితో చంపేసారు. అంతకుముందు దాన్ని ఆర్సెనిక్ విషం, తుపాకీ కాల్పుల ద్వారా చంపేందుకు విఫలయత్నం చేసారు[1]
జూన్: జోసెఫ్ నిసెఫోర్ నీప్సే ప్యారిస్లో మొట్టమొదటి శాశ్వత ఫోటోగ్రాఫ్ని సృష్టించాడు
జూలై 4: అమెరికా స్వాతంత్ర్య 50 వ వార్షికోత్సవం. ఈ రోజే దాని పూర్వ అధ్యక్షులు జాన్ ఆడమ్స్, థామస్ జెఫర్సన్ ఇద్దరూ మరణించారు.
డిసెంబరు: ముస్లిము నాయకుడు సయ్యద్ అహ్మద్, తన అనుచరులతో కలిసి అకోరా ఖటక్ వద్ద సిక్ఖు దళాలతో పోరుకు తలపడ్డాడు.
తేదీ తెలియదు: అహ్మదాబాదులో మొట్టమొదటి గుజరాతీ పాఠశాల తెరిచారు
తేదీ తెలియదు: కాకినాడ, రాజమండ్రి, నరసాపురం లలో ఒకొక్క టి చొప్పున మూడు ఇంగ్లీషు పాఠశాలలను స్ధాపించమని కలెక్టరు బాయార్డ్కు మద్రాసు గవర్నరు థామస్ మన్రో ఆదేశాలిచ్చాడు.