ఫిబ్రవరి 5: లండన్లో అర్గిల్ రూమ్స్ అనే సంగీత సభాభవనం కాలిపోయింది. ఆ కాలం లోనే కొత్తగా రంగ ప్రవేశం చేసిన ఆవిరితో నడిచే అగ్ని మాపక యంత్రం మంటలను ఆర్పి, మంటలు వ్యాపించకుండా కాపాడింది.
మే 28: అమెరికా కాంగ్రెసు, నేటివ్ అమెరికనులను తమ స్వస్థలాల నుండి బలవంతాన వెళ్ళగొట్టే ఇండియన్ రిమూవల్ యాక్ట్ను చేసింది. దీనివలన ఉత్తర అమెరికాలో బైసన్ ల సామూహిక నాశనానికి దారితీసింది.[1]
జూన్ 20: ఏనుగుల వీరాస్వామయ్య తన కాశీయాత్రలో భాగంగా కర్నూలు జిల్లా కొత్తపల్లె మండలం సంగమేశ్వరం గ్రామంలో మజిలీ చేశాడు.