తమిళనాడు శాసనసభకు 1977 లో జరిగిన ఎన్నికలు From Wikipedia, the free encyclopedia
తమిళనాడు ఆరవ శాసనసభ ఎన్నికలు 1977 జూన్ 10 న జరిగాయి. ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (AIADMK) తన ప్రత్యర్థి ద్రవిడ మున్నేట్ర కజగం (DMK)ని ఎన్నికల్లో ఓడించింది. ఎఐఎడిఎంకె వ్యవస్థాపకుడు, ప్రముఖ తమిళ సినీ నటుడూ ఐన ఎంజి రామచంద్రన్ (ఎంజిఆర్) మొదటిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. ఈ ఎన్నికల్లో ఎఐఎడిఎంకె, డిఎంకె, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (ఐఎన్సి), జనతా పార్టీల మధ్య చతుర్ముఖ పోటీ జరిగింది. అంతకుముందు 1972లో, ఎంజిఆర్కు, డిఎంకె నాయకుడు ఎం. కరుణానిధికీ మధ్య విభేదాలు తలెత్తడంతో ఎంజిఆర్, డిఎంకె నుండి బహిష్కృతుడై ఎఐఎడిఎంకెను స్థాపించాడు. 1976 జనవరి 31 న MISAకి సహకరించడం లేదంటూ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ, కరుణానిధి ప్రభుత్వాన్ని రద్దు చేసి, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించింది. కరుణానిధి ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఇందిరా గాంధీతో విభేదించి, జయప్రకాష్ నారాయణ్ స్థాపించిన జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు. 1980, 1984 లో జరిగిన రెండు ఎన్నికలలోనూ గెలిచి 1987లో మరణించే వరకు MGR ముఖ్యమంత్రిగా కొనసాగాడు. ఈ ఘనత కారణంగా, ప్రముఖ నటులు రాజకీయాల్లోకి రావడానికి ఎంజీఆర్ ఒక ప్రేరణగా మారాడు. అప్పటి తెలుగు సూపర్ స్టార్ ఎన్టీఆర్ 1983లో ఎంజీఆర్ను అనుసరించి ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ తరువాత, ఎన్నికల రాజకీయాల్లో MGR సాధించిన విజయాలను మరే ఇతర నటుడూ తిరిగి సృష్టించలేకపోయారు.
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మొత్తం 234 స్థానాలన్నింటికీ 118 seats needed for a majority | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
Turnout | 61.58% | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1977 ఫలితాల మ్యాప్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|
MGRతో సహా అనేక మంది ప్రభావవంతమైన నాయకుల నిష్క్రమణ కారణంగా ఏర్పడిన అనేక చీలికల కారణంగా డీఎంకే క్రమంగా బలహీనపడింది. భారత జాతీయ కాంగ్రెస్ (INC)తో సన్నిహిత సంబంధంలో ఉన్న MGR, ఉద్దేశపూర్వకంగా ప్రసారం చేసిన విస్తృతమైన అవినీతి ఆరోపణలతో పార్టీ ప్రజాదరణ మరింత బలహీనపడింది. 1971 ఎన్నికలకు ముందు ద్రవిడ మున్నేట్ర కజగంలో చీలికలు మొదలయ్యాయి. కరుణానిధి నాయకత్వానికి తీవ్రమైన ముప్పుగా భావించిన కేఏ మథియాళగన్ను ఆర్థిక మంత్రి పదవి నుంచి తొలగించారు. సత్యవాణి ముత్తు అనే దళిత నాయకురాలు 1972లో పార్టీలోని దళిత సమస్యలపై శ్రద్ధ చూపడం లేదని పేర్కొంటూ పార్టీని విడిచిపెట్టి, తజ్తపత్తోర్ మున్నేట్ర కజగాన్ని స్థాపించారు. అవినీతి, నియంతృత్వ ప్రవర్తన కారణంగా పార్టీ నాయకత్వంపై ఎమ్జియార్ దాడి చేసినందుకు గాను క్రమశిక్షణా చర్యగా అతన్ని 1972 అక్టోబరు 10 న పార్టీ నుండి బహిష్కరించారు. అతను ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం అనే కొత్త పార్టీని స్థాపించాడు. 1973లో జరిగిన దిండిగల్ ఉప ఎన్నికలో ఏఐఏడీఎంకే విజయం సాధించింది VR నెదుంచెజియన్తో పాటు కొంతమంది సీనియర్ పార్టీ నాయకులు ద్రవిడ మున్నేట్ర కజగం నుండి విడిపోయి, 1977 మార్చిలో మక్కల్ ద్రవిడ మున్నేట్ర కజగంను స్థాపించారు.[1]
1975 జూన్ లో ప్రకటించబడిన ఎమర్జెన్సీకి తమిళనాడులో మిశ్రమ స్పందన లభించింది. అవినీతి ఆరోపణల కారణంగా సొంత ఇబ్బందులను ఎదుర్కొన్న డిఎంకె ప్రభుత్వంతో జయప్రకాష్ నారాయణ్ అనుబంధం ఏర్పరచుకోవడాంతో తమిళనాడులో ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమానికి పెద్దగా మద్దతు లభించలేదు. జయప్రకాష్ నారాయణ్ ఇందిరా గాంధీ చర్యలను తిరస్కరించినప్పటికీ, డిఎంకెతో అనుబంధం కారణంగా కె. కామరాజ్కు మద్దతుగా రాలేదు. జూన్ 27న డిఎంకె ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఎమర్జెన్సీని అనవసరమైనది, అప్రజాస్వామికమైనదిగా పేర్కొంది. అనేక రాష్ట్రవ్యాప్త సమావేశాలలో పార్టీ నాయకులు దాన్ని ఖండించారు. అత్యవసర నిబంధనలు, సెన్సార్షిప్లు ఇతర రాష్ట్రాల మాదిరిగా తమిళనాడులో కచ్చితంగా అమలు కాలేదు. ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఇందిరా గాంధీకి మద్దతునిస్తూనే ఉన్నాయి. MG రామచంద్రన్ ఇందిరా గాంధీకి తన మద్దతునిచ్చేందుకు ఢిల్లీకి కూడా వెళ్లాడు. ఈ పరిస్థితుల్లో 1976 జనవరి 31 న భారత ప్రభుత్వం కరుణానిధి ప్రభుత్వాన్ని రద్దుచేసింది.
భారత జాతీయ కాంగ్రెస్ (సంస్థ) నాయకుడు కామరాజ్ 1975లో మరణించాడు. ఆయన మరణించే వరకు భారత జాతీయ కాంగ్రెస్ (ఇందిర) వర్గం తమిళనాడులో స్థిరపడలేదు. అతని మరణం తరువాత, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (ఆర్గనైజేషన్) ఒక పార్టీగా దాని గుర్తింపును కోల్పోయింది. GK మూపనార్ నేతృత్వంలో పెద్ద సంఖ్యలో సభ్యులు ఇందిరా కాంగ్రెస్లో విలీనం అయ్యారు.[2] మిగిలిన వారు ద్రవిడ మున్నేట్ర కజగంతో చేరకూడదని నిర్ణయించుకుని, జనతా పార్టీలో చేరారు. చాలా వరకు వారు పార్టీ పట్ల నిబద్ధత కనబరచలేదు.[3] 1972లో సి.రాజగోపాలాచారి మరణం తర్వాత స్వతంత్రపార్టీ తన అధికారాన్ని కోల్పోయి ఎన్నికల్లో పోటీ చేయలేదు. అందులో చాలామంది సభ్యులు కొత్తగా ఏర్పడిన జనతా పార్టీలో చేరారు .[4]
ఈ ఎన్నికల్లో చతుర్ముఖ పోటీ నెలకొంది. ఏఐఏడీఎంకే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్)తో పొత్తు పెట్టుకుంది, అయితే INC(I), కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (CPI) లు మిత్రపక్షాలుగా పోటీ చేశాయి. ఈ ఎన్నికల్లో డీఎంకే, జనతా పార్టీ (జేఎన్పీ) ఒంటరిగా పోటీ చేశాయి. ఫార్వర్డ్ బ్లాక్ నాయకుడు పికె మూకియా తేవర్కు మద్దతుగా ఉసిలంపాటి నియోజకవర్గంలో ఎఐఎడిఎంకె ఏ అభ్యర్థిని నిలబెట్టలేదు. అదేవిధంగా వాణియంబాడి నియోజకవర్గంలో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) అభ్యర్థి ఎం. అబ్దుల్ లతీఫ్కు అన్నాడీఎంకే కూడా మద్దతు ఇచ్చింది. ఈ ఎన్నికలకు మూడు నెలల ముందు జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో రెండు ప్రధాన పొత్తులు జరిగాయి – అన్నాడిఎంకె నేతృత్వంలోని ఎఐఎడిఎంకె-ఐఎన్సి-సిపిఐ సంకీర్ణం, డిఎంకె నేతృత్వంలోని డిఎంకె-ఎన్సిఓ-జెఎన్పి-సిపిఎం సంకీర్ణం. అయితే పార్లమెంటు ఎన్నికల తర్వాత నెలరోజుల్లోనే ఈ కూటములు విడిపోయాయి.[5]
నం. | పార్టీ | ఎన్నికల చిహ్నం | నాయకుడు | సీట్లు |
---|---|---|---|---|
1. | ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం | MG రామచంద్రన్ | 200 | |
2. | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) | జి. రామకృష్ణన్ | 20 | |
3. | ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ † | పికె మూకయ్య తేవర్ | 1 | |
నమోదుకాని పార్టీ, దీని అభ్యర్థి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు | ||||
4. | ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ | ఖాదర్ మొహిదీన్ | 1 |
†: ఫార్వర్డ్ బ్లాక్ 6 నియోజకవర్గాల్లో పోటీ చేసింది, అయితే PKM తేవర్ పోటీ చేసిన ఉసిలంపట్టి నియోజకవర్గంలో మాత్రమే అన్నాడీఎంకే మద్దతు ఇచ్చింది.
నం. | పార్టీ | ఎన్నికల చిహ్నం | నాయకుడు | సీట్లు |
---|---|---|---|---|
1. | భారత జాతీయ కాంగ్రెస్ | GK మూపనార్ | 198 | |
2. | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా | తా. పాండియన్ | 32 |
నం. | పార్టీ | ఎన్నికల చిహ్నం | నాయకుడు | సీట్లు |
---|---|---|---|---|
1. | ద్రవిడ మున్నేట్ర కజగం | ఎం. కరుణానిధి | 230 |
నం. | పార్టీ | ఎన్నికల చిహ్నం | నాయకుడు | సీట్లు |
---|---|---|---|---|
1. | జనతా పార్టీ | పి. రామచంద్రన్ | 233 |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.