From Wikipedia, the free encyclopedia
తమిళనాడు ఎనిమిదవ శాసనసభ ఎన్నికలు 1984 డిసెంబరు 24 న జరిగాయి. ఈ ఎన్నికలలో ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (AIADMK) విజయం సాధించి, MG రామచంద్రన్ (MGR) మూడవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. ఇందిరాగాంధీ హత్య, ఎంజీఆర్ అనారోగ్యం, రాజీవ్గాంధీ జనాదరణ కారణంగా ఏర్పడిన సానుభూతి తరంగానికి ఎన్నికల విజయం ప్రధానంగా కారణమైంది. 1987లో పదవిలో ఉండగానే మరణించిన ఎంజీఆర్ పోటీ చేసిన చివరి ఎన్నికలు ఇదే. 1957 నుండి మరణించే వరకూ M. కరుణానిధి పోటీ చేయని ఏకైక ఎన్నికలు కూడా ఇదే. 2023 నాటికి, అధికార పార్టీ అధిక సీట్లు పొందిన చివరి ఎన్నికలు కూడా ఇవే.
| ||||||||||||||||||||||||||||||||||
మొత్తం 234 స్థానాలన్నింటికీ 118 seats needed for a majority | ||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
Turnout | 73.47% | |||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||
1984 ఎన్నికల ఫలితాలు | ||||||||||||||||||||||||||||||||||
|
1984 అక్టోబర్ 31న ఇందిరా గాంధీ హత్యకు గురైంది. అదే సమయంలో, MG రామచంద్రన్ మూత్రపిండ వైఫల్యంతో బాధపడుతూ న్యూయార్క్ నగరంలో ఆసుపత్రిలో చేరాడు. ఇందిత హత్య వెంటనే రాజీవ్ గాంధీ ప్రధాని పదవీ బాధ్యతలు స్వీకరించాడు. రాజీవ్ గాంధీ తన ప్రభుత్వానికి ప్రజల నుండి తాజా ఎన్నిక అవసరమని భావించి, సార్వత్రిక ఎన్నికల కోసం లోక్సభ పదవీకాలం ముగియడానికి ఒక సంవత్సరం ముందే సభను రద్దు చేశాడు. అదే సమయంలో, తమిళనాడు ముఖ్యమంత్రి, MGR, కాంగ్రెస్ సానుభూతి తరంగాన్ని ఉపయోగించుకోవడానికీ, తన ప్రజాదరణను కూడా పరీక్షించుకోడానికీ, పదవీకాలం ముగియడానికి ఒక సంవత్సరం ముందుగానే తమిళనాడు రాష్ట్ర శాసనసభను రద్దు చేయాలని సిఫార్సు చేశారు. భారత జాతీయ కాంగ్రెస్ (ఇందిర), ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం లు కూటమిగా ఏర్పడి ఈ రెండు ఎన్నికల్లో పోటీ చేశాయి. [1] [2]
"MGR ఫార్ములా" అనే పేరున్న సీట్ల కేటాయింపు పద్ధతిలో, ప్రాంతీయ పార్టీ 70% శాసనసభ స్థానాల్లో పోటీ చేయగా, జాతీయ పార్టీ 70% లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తుంది. MGR ముఖ్యమంత్రిగా ఉండగా మరణించడంతో అతను పోటీ చేసిన చివరి ఎన్నికలు ఇవే అయ్యాయి.
ఎంజీ రామచంద్రన్ ఆస్పత్రికే పరిమితమయ్యాడు. ఇందిరా గాంధీ హత్యతో పాటు ఆసుపత్రిలో కోలుకుంటున్న ఎంజీఆర్ వీడియో కవరేజీని కలిపిఉ ప్రచారంలో ఉపయోగించుకున్నారు. ఈ వీడియో తమిళనాడు అంతటా ప్రదర్శించారు. రాజీవ్ గాంధీ తమిళనాడులో తుఫాను ప్రభావిత ప్రాంతాలను సందర్శించాడు. ఇందిర హత్య, ఎంజీఆర్ అనారోగ్యం, రాజీవ్గాంధీ చరిష్మా సృష్టించిన సానుభూతితో కూటమి ఎన్నికల్లో విజయం సాధించింది. [1] [2] అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు ఎంజీఆర్ అమెరికాలోని ఆస్పత్రిలో చేరడం, ఇందిరాగాంధీ హత్యకు గురికావడం వంటి కారణాలతో డీఎంకే అధినేత ఎం. కరుణానిధి ఈ ఎన్నికల్లో పోటీ చేయలేదు.[3]
నం. | పార్టీ | ఎన్నికల చిహ్నం | నాయకుడు | సీట్లు |
---|---|---|---|---|
1. | ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం | MG రామచంద్రన్ | 155 | |
2. | భారత జాతీయ కాంగ్రెస్ | ఎం.పళనియాండి | 73 | |
3. | గాంధీ కామరాజ్ జాతీయ కాంగ్రెస్ | కుమారి అనంతన్ | 4 |
నం. | పార్టీ | ఎన్నికల చిహ్నం | నాయకుడు | సీట్లు |
---|---|---|---|---|
1. | ద్రవిడ మున్నేట్ర కజగం | ఎం.కరుణానిధి | 176 | |
2. | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా | పి.మాణికం | 17 | |
3. | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) | ఎ. నల్లశివన్ | 16 | |
4. | జనతా పార్టీ | 16 |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.