![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/te/thumb/2/26/2011_Cricket_World_Cup_Logo.svg/langte-640px-2011_Cricket_World_Cup_Logo.svg.png&w=640&q=50)
2011 క్రికెట్ ప్రపంచ కప్
From Wikipedia, the free encyclopedia
2011 క్రికెట్ ప్రపంచ కప్ క్రికెట్ ప్రపంచ కప్ పోటీల్లో పదవది. దీన్ని మొదటిసారిగా భారతదేశం, శ్రీలంక, బంగ్లాదేశ్ లలో నిర్వహించారు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఫైనల్లో భారత్, శ్రీలంకను 6 వికెట్ల తేడాతో ఓడించి టోర్నమెంట్ను గెలుచుకుంది. తద్వారా సొంత గడ్డపై క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్ను గెలుచుకున్న మొదటి దేశంగా నిలిచింది.[1] [2] మ్యాన్ ఆఫ్ ద టోర్నీగా భారత ఆటగాడు యువరాజ్ సింగ్ ఎంపికయ్యాడు. [3] ప్రపంచకప్ చరిత్రలో రెండు ఆసియా జట్లు ఫైనల్కు చేరడం ఇదే తొలిసారి. 1992 ప్రపంచ కప్ తర్వాత ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా పాల్గొనకపోవడం ఇదే తొలిసారి.
2011 క్రికెట్ ప్రపంచ కప్ | |
---|---|
![]() అధికారిక లోగో | |
తేదీలు | 2011 ఫిబ్రవరి 19 – ఏప్రిల్ 2 |
నిర్వాహకులు | అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ |
క్రికెట్ రకం | వన్ డే ఇంటర్నేషనల్ |
టోర్నమెంటు ఫార్మాట్లు | రౌండ్ రాబిన్, నాకౌట్ |
ఆతిథ్యం ఇచ్చేవారు |
|
ఛాంపియన్లు | ![]() |
పాల్గొన్నవారు | 14 (104 అభ్యర్థుల నుండి) |
ఆడిన మ్యాచ్లు | 49 |
ప్రేక్షకుల సంఖ్య | 12,29,826 (25,098 ఒక్కో మ్యాచ్కు) |
మ్యాన్ ఆఫ్ ది సీరీస్ | ![]() |
అత్యధిక పరుగులు | ![]() |
అత్యధిక వికెట్లు |
|
← 2007 2015 → |
ఈ టోర్నమెంట్లో పద్నాలుగు జాతీయ క్రికెట్ జట్లు పాల్గొన్నాయి. ఇందులో 10 మంది పూర్తిస్థాయి సభ్యులు కాగా, నాలుగు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) లోని అసోసియేట్ సభ్యులు. [4] ప్రారంభ వేడుక 2011 ఫిబ్రవరి 17 న ఢాకా లోని బంగబంధు నేషనల్ స్టేడియంలో జరిగింది.[5] టోర్నమెంటు ఫిబ్రవరి 19, ఏప్రిల్ 2 ల మధ్య జరిగింది. ఢాకాలోని మీర్పూర్లోని షేర్-ఎ-బంగ్లా నేషనల్ స్టేడియంలో భారత్, బంగ్లాదేశ్ ల మధ్య తొలి మ్యాచ్ జరిగింది. [6]
తొలుత పాకిస్తాన్ కూడా సహ-హోస్ట్గా ఉండాలని అనుకున్నారు. అయితే 2009లో లాహోర్లో శ్రీలంక జాతీయ క్రికెట్ జట్టుపై తీవ్రవాద దాడి తర్వాత, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) దానిని రద్దు చేసింది.[7] లాహోర్లో ఉన్న ఆర్గనైజింగ్ కమిటీ ప్రధాన కార్యాలయాన్ని ముంబైకి బదిలీ మార్చింది.[8] పాకిస్థాన్, ఒక సెమీఫైనల్తో సహా 14 మ్యాచ్లు నిర్వహించాల్సి ఉంది. [9] వీటిలో ఎనిమిది గేమ్లను (సెమీ-ఫైనల్తో సహా) భారతదేశానికి, నాలుగు శ్రీలంకకు, రెండు బంగ్లాదేశ్కు మార్చారు.[10]