2016 లో కాశ్మీర్ లోని ఒక గ్రామంలో జరిగిన ఒక దాడి From Wikipedia, the free encyclopedia
2016 యూరీ ఉగ్రవాద దాడులు అన్నది 2016 సెప్టెంబరు 18 న భారీగా సాయుధులైన నలుగురు ఉగ్రవాదులు జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలోని యూరీ పట్టణంపై చేసిన దాడి. కాశ్మీర్ లో భద్రతా దళాలపై 2 దశాబ్దాల కాలంలో జరిగిన అత్యంత దారుణమైన దాడిగా దీన్ని పేర్కొన్నారు.[9] ఏ ఉగ్రవాద సమూహమూ ఈ దాడికి బాధ్యత స్వీకరిస్తూ ప్రకటించలేదు,[10] కానీ ఈ దాడిని ప్రణాళిక వేసి, నిర్వహించింది తీవ్రవాద సంస్థ జైష్-ఎ-మహమ్మద్ అని అనుమానిస్తున్నారు.[6] ఈ దాడి జరిగే నాటికి కాశ్మీరులో అలజడి, అశాంతి చోటుచేసుకుంది.[11][12]
2016 యూరీ ఉగ్రవాద దాడులు | |
---|---|
Part of the జమ్మూ కాశ్మీర్లో తిరుగుబాటు | |
ప్రదేశం | జమ్మూ కాశ్మీరు లోని బారాముల్లా జిల్లా, యూరి వద్ద |
తేదీ | 2016 సెప్టెంబరు 18 ఉదయం 5.30 (భారత కాలమానం) |
దాడి రకం | ఉగ్రవాదం, మూకుమ్మడి కాల్పులు |
మరణాలు | 23 (19 సైనికులు, 4 ఉగ్రవాదులు)[1][2] |
ప్రాణాపాయ గాయాలు | 19–30[3][4][5] |
Suspected perpetrators | జైషె మొహమ్మద్ (అనుమానితులు) [6] లష్కరె తాయిబా (ప్రకటించుకుంది). దాడి జరిగినపుడు కాశ్మీర్ లోయ ప్రాంతం అలజడులప్రాంతంగా వుంది. [7][8] |
2015 నుంచీ ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడులు (ఫిదాయీన్ గా ప్రసిద్ధి) భారతీయ రక్షణ దళాలకు వ్యతిరేకంగా సాగించడం పెరుగుతోంది. జూలై 2015లో ముగ్గురు సాయుధులు గురుదాస్ పూర్ లో ఒక బస్సుపై, పోలీస్ ఠాణాపై దాడి చేశారు.
2016లో 4-6 మంది సాయుధులు పఠాన్ కోట్ వైమానిక దళ స్థావరంపై దాడిచేశారు, ఈ దాడి జైష్-ఎ-మొహమ్మద్ చేసిందని భారతీయ అధికార వర్గాలు అంచనా వేశాయి.[13]
2016 జూలై 8 న ఉగ్రవాద నాయకుడు బుర్హాన్ వాణి పోలీసుల ఎదురుకాల్పుల్లో మరణించడంతో జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలో ఆందోళనలు, అశాంతి ఎడతెగకుండా సాగాయి.[14][15][16][17] ఈ మరణంతో లోయలో భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని వర్గాలు ఆందోళనలు చేసాయి.[10][18][16][19][20]
సెప్టెంబరు 18 తెల్లవారుజామున 5.30 గంటలకు నలుగురు సాయుధులైన ఉగ్రవాదులు నియంత్రణ రేఖకు సమీపంలోని యూరీ పట్టణంలోని భారత సైనిక బ్రిగేడ్ హెడ్ క్వార్టర్స్ పై మెరుపుదాడి చేశారు. మూడు నిమిషాల్లో 17 గ్రెనేడ్లు విసిరారు. అడ్మినిస్ట్రేటివ్ బేస్ కాంపులో మంటలు వ్యాపించడంతో అప్పటికప్పుడు 17 మంది సైనికులు, సైనికాధికారులు మరణించారు, ఆపైన మరో 19-30 మంది సైనికులు ఈ దాడిలో గాయపడ్డారు.[3][5][21][22][23] బతికి ఉన్నారని భావించిన ఉగ్రవాదులను ఏరివేసేందుకు ఆపరేషన్లు ప్రారంభించారు.[9] చనిపోయిన సైనికుల్లో అత్యధికులు 10 డోగ్రా, 6 బీహార్ రెజిమెంట్లకు చెందినవారు.[23] గాయపడిన సైనికుల్లో ఒకరు ఆర్&ఆర్ ఆసుపత్రిలో 19 సెప్టెంబరున మరణించగా, మరొకరు 24 సెప్టెంబరులో చనిపోయారు, దాంతో మృతుల సంఖ్య 19కి చేరింది.[1][2][24][25]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.