20 వ శతాబ్దం
శతాబ్దం / From Wikipedia, the free encyclopedia
20వ శతాబ్దం 1901 జనవరి 1 న (MCMI) ప్రారంభమై, 2000 డిసెంబరు 31 న (MM) న ముగిసింది. [1] ఆధునిక యుగాన్ని నిర్వచించిన ముఖ్యమైన సంఘటనలు 20వ శతాబ్దంలో జరిగాయి. వాటిలో కొన్ని: స్పానిష్ ఫ్లూ మహమ్మారి, మొదటి ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధం, అణ్వాయుధాలు, అణుశక్తి, అంతరిక్ష పరిశోధనలు, జాతీయవాదం, డీకోలనైజేషన్, సాంకేతిక పురోగతి, ప్రచ్ఛన్న యుద్ధం, ప్రచ్ఛన్నయుద్ధానంతర సంఘర్షణలు. ఇవి భూగోళపు రాజకీయ, సామాజిక నిర్మాణాన్ని పునర్నిర్మించాయి.
20వ శతాబ్దంలో ప్రకృతితో మానవుడి సంబంధంలో భారీ మార్పు వచ్చింది. ప్రపంచ జనాభా, సముద్ర మట్టం పెరుగుదల, పర్యావరణ పతనాలు పెరిగాయి. అయితే భూమి కోసం, క్షీణిస్తున్న వనరుల కోసం పోటీ, అటవీ నిర్మూలన, నీటి క్షీణత, ప్రపంచంలోని అనేక జాతుల సామూహిక వినాశనం, ఇతర జీవుల జనాభాలో క్షీణతను వేగవంతం చేసింది. గ్లోబల్ హీటింగ్ తీవ్రమైన వాతావరణ పరిస్థితుల ప్రమాదాన్ని పెంచింది.