ఎండ్లూరి సుధాకర్
From Wikipedia, the free encyclopedia
Remove ads
ఆచార్య ఎండ్లూరి సుధాకర్ ( 21-01-1959 జనవరి 21 - 2022 జనవరి 28) (ఆంగ్లం: Yendluri Sudhakar) జనవరి 21, 1959న నిజామాబాద్ లోని పాముల బస్తిలో తన అమ్మమ్మ గారి ఇంట్లో జన్మించాడు. ఇతడు కేంద్ర సాహిత్య అకాడమీ జ్యూరీ సభ్యుడు, తెలుగు సలహా మండలి సభ్యుడు, తెలుగు అకాడమీ సభ్యుడు, తెలుగు విశ్వవిద్యాలయం E.C మెంబర్ సభ్యులు, హిందీ, ఉర్దూ కవితలు, ఉర్దూ పద్యాలు లఘు చిత్రాల అనువాదకుడు. ప్రస్తుతం హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం తెలుగు విభాగంలో సీనియర్ ప్రొఫెసర్ గా పనిచేశారు.
Remove ads
బాల్యం
ఆచార్య ఎండ్లూరి సుధాకర్ జనవరి 21, 1959లో నిజామాబాద్ లోని పాముల బస్తిలో తన అమ్మమ్మ గారి ఇంట్లో జన్మించారు. ఎండ్లూరి దేవయ్య, శాంతాబాయిలకు ప్రథమ సంతానం. వీరికి ఇద్దరు తమ్ముళ్ళు, ఇద్దరు చెల్లెళ్ళు.
విద్యాభ్యాసం
హైదరాబాద్ వీధి బడిలో ప్రారంభమైన చదువు విశ్వవిద్యాలయం వరకు హైదరాబాద్ లోనే సాగింది. నల్లకుంట ప్రాచ్య కళాశాలలో ఓరియంటల్ విద్య, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం.ఏ, ఎం.ఫిల్, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయములో పిహెచ్డి చేసారు.
రచనలు
ఉద్యోగం
జీవిక కోసం రకరకాల వృత్తులు చేసాక, 1985 నుంచి 1990 వరకు సికింద్రాబాద్ లోని వెస్లీ బాయ్స్ ఉన్నత పాఠశాలలో తెలుగు పండితుడిగా ఉద్యోగం చేసారు. 1990 అక్టోబరు 6 వ తేది నుంచి నేటి వరకు [1][2]లో వివిధ పదవుల్ని నిర్వహిస్తున్నారు. 2004 నుంచి 2011 వరకు తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురించే వాఙ్మయి సాహిత్య పత్రికకి సహాయ సంపాదకుడిగా, సంపాదకుడిగా వ్యవహరించారు. అసిస్టెంట్ ప్రొఫెసర్గా, అసోసియేట్ ప్రొఫెసర్గా, ప్రొఫెసర్గా ఆధునిక శాఖాధిపతిగా, (1994 నుంచి 2012 వరకు) పదవుల్ని నిర్వహించారు.
2009, సెప్టెంబరు 5వ తేదీ నుంచి రాజమండ్రి సాహిత్య పీఠానికి ఆచార్యులుగా, డీన్ గా బాధ్యతలు నిర్వహించారు. తెలుగు విభాగంలో సీనియర్ ప్రొఫెసర్ గా హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో పనిచేశారు. వీరి పర్యవేక్షణలో సుమారు ఎనభై మూడు ఎం.ఫిల్, ఇరవై మందికి పైగా పి హెచ్ డి డిగ్రీలు పూర్తి చేశారు. సుమారు ఆరుగురు వీరి పరిశోధన పర్యవేక్షణలో బంగారు పతకాలు సాధించారు.
Remove ads
విదేశాల్లో సమావేశాలు
- అమెరికా తెలుగు అసోసియేషన్లో జరిగిన పలు సాహిత్య సభల్లో ప్రసంగించాడు – 2002 జూలై
- మారిషస్లో ప్రపంచ తెలుగు సదస్సు– 2011, డిసెంబరు 8,9,10
- 2017 మేలో అమెరికాలోని న్యూజెర్సీ సిటీలో సిలికాన్ ఆంధ్రా ద్వారా మనబడి కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్గా పాల్గొన్నాడు.
మరణం
సాహితీ వేత్త ఆచార్య ఎండ్లూరి సుధాకర్ 2022 జనవరి 28న గుండెపోటుతో హైదరాబాదులో తుదిశ్వాస విడిచారు. ఆయన భార్య స్వర్గీయ డా. పుట్ల హేమలత, ఇద్దరు కుమార్తెలు మానస ఎండ్లూరి, మనోఙ్ఞ.[3]
పురస్కారాలు
- లలిత కళా పరిషత్ పురస్కారం, నల్గొండ -1980
- స్లిష్టల వెంకటల్లు దీక్షితులు స్మారక సాంస్కృతిక సాహితీ కళా సమితి, యలమంచిలి- 1990
- ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డు -1992
- ఉదయభారతి జాతీయ అవార్డు, భువనేశ్వర్-1993
- కవికోకిల జోషువ పురస్కారం
- తిలక్ అవార్డు, బెంగళూరు
- గరికపాటి సాహిత్య పురస్కారం. కాకినాడ
- సమతా రచయితల పురస్కారం .అమలాపురం
- రాజమండ్రి ప్రతిభాపురస్కార్, రాజమండ్రి
- జాసిస్ అవార్డు, రాజమండ్రి.
- మ్యాన్ ఆఫ్ ది ఇయర్, రాజమండ్రి 1994-95
- తెలుగు విశ్వవిద్యాలయం ధర్మనిధి పురస్కారం
- బి.ఎస్. రాములు కథా పురస్కారం .జగిత్యాల
- ఎన్.జి.రంగాసెంటరీ అవార్డు
- డెట్రాయిట్ తెలుగు అసోసియేషన్ సిల్వర్ జూబ్లీ అవార్డు-2002
- అమెరికా తెలుగు అసోసియేషన్ATA, డల్లాస్, 2002 జూలై
- సినారె పురస్కారం - కరీంనగర్ 2002
- శ్రీ నెదురుమల్లి జనార్ధన రెడ్డి ట్రస్ట్ ప్రకాశం, నెల్లూరు, 2003
- సహృదయ సాహితీ పురస్కారం, వరంగల్. 2004
- కొండెపూడి శ్రీనివాసరావు కవితాపురస్కారం, గుంటూరు, 2005
- ఆంధ్రప్రదేశ్ అధికారభాషా సంఘ పురస్కారం – 2006
- ఆంధ్రప్రదేశ్ ఉగాది విశిష్ట సాహిత్య పురస్కారం-2007
- గాడేపల్లి కుక్కుటేశ్వరరావు స్మారక పురస్కారం. అద్దంకి. 2009
- తపన ఫౌండేషన్ అవార్డు, 2011, రాజమండ్రి
- ప్రతిభావంతులైన విశ్వవిద్యాలయ ఉపాధ్యాయులకు రాష్ట్ర అవార్డు, సెప్టెంబరు -2012
- కవి జాషువా సాహిత్య AP ప్రభుత్వ అవార్డు, 2012
- రాజహంస కృష్ణ శాస్త్రి కవితా పురస్కారం, 2014 - పిఠాపురం
- ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్ట్ ద్వారా ఎన్టీఆర్ ప్రతిభా పురస్కారం 2014. హైదరాబాద్
- యువకళా వాహిని ద్వారా డాక్టర్ జి ఎన్ రెడ్డి మెమోరియల్ అవార్డు 2020
- అరుణ్ సాగర్ ట్రస్ట్ ద్వారా కవి అరుణ్ సాగర్ మెమోరియల్ అవార్డు 2021.[4]
Remove ads
సూచికలు
ఇవికూడా చూడండి
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.
Remove ads