నిండు దంపతులు
From Wikipedia, the free encyclopedia
Remove ads
నిండు దంపతులు 1971 లో వచ్చిన సినిమా. దీనిని ఎస్.వి.ఎస్ ఫిల్మ్స్ నిర్మాణ సంస్థలో ఎం.జగన్నాథరావు నిర్మించాడు. కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించాడు.ఇందులో ఎన్.టి.రామారావు, సావిత్రి, విజయనిర్మల ప్రధాన పాత్రలలో నటించారు. టి.వి.రాజు & విజయా కృష్ణమూర్తి సంయుక్తంగా సంగీతం సమకూర్చారు.[1] ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు స్వయంకృషి (1987) లో ప్రతిబింబిస్తాయి, దీనికి కూడా కె. విశ్వనాథే దర్శకత్వం వహించాడు.
Remove ads
కథ
ఈ చిత్రం పాన్ షాప్ యజమాని అయిన రాము (ఎన్.టి.రామారావు) పై ప్రారంభమవుతుంది. నిరక్షరాస్యుడైన అతను తెలివైనవాడు. కాలనీలోని ప్రజలు అతన్ని స్థానిక గూండా గంగులు (సత్యనారాయణ) తో పాటు ఆదర్శంగా తీసుకుంటారు. అతని ముందు ఒక అందమైన అమ్మాయి సుబ్బులు నివసిస్తూంటుంది. సమాంతరంగా, రాము తన మరదలు వాణి (లక్ష్మి) ని పెళ్ళి చేసుకోవాలని అనుకుంటాడు. ఆ సంగతి తెలియని వాణి తన క్లాస్మేట్ రవిని (చంద్రమోహన్) - జమీందారు జానకి రామయ్య (మిక్కిలినేని) కుమారుడు - ప్రేమిస్తుంది. జానకి రామయ్యకు ఇద్దరు కుమారులు ఉన్నారు, పెద్దవాడు రఘు (ఎం.బాలయ్య) నిశ్శబ్దంగా ఉంటాడు. అయితే రవి తల్లి కనకదుర్గ (ఛాయాదేవి) గారాబం వలన అల్లరి వాడిగా తయారౌతాడు. రఘు ఆమెకు సవతి కుమారుడు కాబట్టి, ఆమె అతన్ని అపహాస్యం చేస్తుంది. అంతేకాకుండా, మరొక కథ నడుస్తుంది, కొండలరావు (గుమ్మడి) కోర్టు గుమస్తా. తన కుమార్తె శ్రీదేవి (సావిత్రి) ని న్యాయవాదిగా చూడాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. దీని కోసం అతను కృషి చేసి విజయం సాధిస్తాడు. ఇంతలో, రవి పద్ధతి చూసిన జానకి రామయ్య మొత్తం ఆస్తిపై రఘుకే అధికారం ఇస్తాడు. ఇది కనక దుర్గకు నచ్చదు. అదే సమయంలో, సమగ్రతను రఘు ఖండించినప్పుడు, కొండల రావు శ్రీదేవికి, రఘుకూ పెళ్ళి ప్రతిపాదన తెస్తాడు. రఘు దాన్ని తిరస్కరిస్తాడు. ఆ సమయంలో, కోపంతో ఉన్న కొండలరావు రఘుపై తిరుగుబాటు చేస్తాడు. ఈ పరిస్థితిని వాడుకుని కనకదుర్గ, గంగులు ద్వారా రఘును చంపించేస్తుంది. ఆ నేరాన్ని కొండలరావుపై వేస్తారు. శ్రీదేవి అతడి తరపున వాదిస్తుంది. కొండలరావు మనోవేదనతో కన్నుమూస్తాడు. రాము, రవి, వాణి, సుబ్బులు.. వీళ్ళ జీవితాలు ఏ మలుపులు తిరుగుతాయో మిగత సినిమాలో చూడవచ్చు.
Remove ads
తారాగణం
- ఎన్.టి. రామారావు - రాము
- సావిత్రి - శ్రీదేవి
- విజయ నిర్మల - సుబ్బులు
- గుమ్మడి వెంకటేశ్వరరావు - కొండలరావు
- కైకాల సత్యనారాయణ - గంగులు
- చంద్ర మోహన్ - రవి
- అల్లు రామలింగయ్య
- రాజబాబు - చిన్నయ్య
- ధూళిపాళ
- మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి - జానకిరామయ్య
- ఎం. బాలయ్య - రఘు
- లక్ష్మి - వాణి
- ఛాయాదేవి - కనకదుర్గ
- రుక్మిణి
- లీలారాణి
- విజయభాను
- విజయలక్ష్మి
- కృష్ణవేణి
- వీణావతి
- కూచిభొట్ల శివరామకృష్ణయ్య
- డాక్టర్ రమేష్
- కాశీనాథ్ తాతా
- రాళ్ళబండి
- మద్దాలి
- శ్రీకాంత్
- ఎ.ఎల్.నారాయణ
- తమ్మారెడ్డి చలపతిరావు
- జగ్గారావు
- మాస్టర్ విశ్వేశ్వరరావు
- మాస్టర్ కె.వి.ఎస్.మూర్తి
Remove ads
సాంకేతిక సిబ్బంది
- కళ: తోట
- నృత్యాలు: చిన్ని-సంపత్
- స్టిల్స్: బౌనా
- పోరాటాలు: స్వామినాథన్
- సంభాషణలు: సముద్రాల జూనియర్.
- సాహిత్యం: సి.నారాయణరెడ్డి
- నేపథ్య గానం: ఘంటసాల, పి.సుశీల, ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, ఎల్. ఆర్. ఈశ్వరి, పి.లీల, బి.వసంత
- సంగీతం: టి.వి.రాజు, విజయా కృష్ణమూర్తి
- కూర్పు: బి. గోపాలరావు
- ఛాయాగ్రహణం: ఎస్ఎస్ లాల్
- నిర్మాత: ఎం.జగన్నాథరావు
- కథ - చిత్రానువాదం - దర్శకుడు: కె.విశ్వనాథ్
పాటలు
ఈ చిత్రంలోని పాటలను సి.నారాయణరెడ్డి రచించగా, టి.వి.రాజు, విజయా కృష్ణమూర్తి సంగీతాన్ని అందించారు.[2]
Remove ads
వనరులు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.
Remove ads