షామీర్‌పేట్ మండలం

తెలంగాణ, మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి జిల్లా లోని మండలం From Wikipedia, the free encyclopedia

షామీర్‌పేట్ మండలం
Remove ads

షామీర్‌పేట్‌ మండలం, తెలంగాణ రాష్ట్రం, మేడ్చల్ జిల్లాలోని మండలం.[1]

త్వరిత వాస్తవాలు అక్షాంశరేఖాంశాలు: 17.591667°N 78.58223°E /, రాష్ట్రం ...
Thumb
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త రంగారెడ్డి జిల్లా పటంలో మండల స్థానం

2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం రంగారెడ్డి జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం కీసర రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది మల్కాజ్‌గిరి డివిజనులో ఉండేది.ఇది రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇటీవలి కాలంలో పలు అభివృద్ధి పనుల వలన మంచి పురోభివృద్ధి సాధించింది.సముద్రమట్టానికి 597 మీ.ఎత్తులో ఉంది.[3] ఈ మండలంలో  15  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు

Remove ads

గణాంక వివరాలు

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 237 చ.కి.మీ. కాగా, జనాభా 52,679. జనాభాలో పురుషులు 27,800 కాగా, స్త్రీల సంఖ్య 24,879. మండలంలో 11,981 గృహాలున్నాయి.[4]

మండలంలోని పట్టణాలు

సమీప మండలాలు

మేడ్చల్, కీసర, కుత్బుల్లాపూర్, ములుగు

మండలంలో పర్యాటక ప్రదేశాలు

పెద్ద చెరువు

Thumb
షామీర్‌పేట్‌ చెరువు

శామీర్‌పేట సమీపంలోని చెరువు పెద్ద చెరువుగా పేరుగాంచింది. షామీర్‌పేట్‌ చెరువు అని పిలుస్తారు. దీనిని ఇది ఒక విహారస్థలంగా కూడా అభివృద్ధి చెందినది. సెలవు దినాలలో పరిసర ప్రాంతవాసులచే ఈ చెరువు పర్యాటక ప్రాంతంగా కనిపిస్తుంది. రాజీవ్ రహదారి ఈ చెరువు కట్టపై నుంచే వెళుతుంది. అంతేకాకుండా ఈ చెరువు పరిసరాలలో జవహర్ దుప్పుల పార్కు, నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం కూడా ఉన్నాయి.

రత్నాలయ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం

శామీర్‌పేటలో రాజీవ్ రహదారి ప్రక్కనే రత్నాలయం పేరుతో శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయాన్ని నిర్మించారు. హైదరాబాదు, రంగారెడ్డి, నల్గొండ, మెదక్ జిల్లాల నుండి భక్తులు ఈ దేవాలయాన్ని దర్శించుకుంటారు. శనివారం రోజులలో భక్తులతో ఈ దేవాలయం కిటకిటలాడుతుంది.

Remove ads

మండలంలోని రెవెన్యూ గ్రామాలు

మూలాలు

వెలుపలి లింకులు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.

Remove ads