పీలా కాశీ మల్లికార్జునరావు
సినీ నటుడు From Wikipedia, the free encyclopedia
Remove ads
మల్లికార్జునరావు (1950 అక్టోబరు 10 - 2008 జూన్ 24) తెలుగు సినీ, రంగస్థల హాస్య నటులు.[1] అతని పూర్తి పేరు పీలా కాశీ మల్లికార్జునరావు. పాఠశాల దశనుంచే నాటకాల్లో నటించే వారు. 50 నుంచి 60 నాటకాలూ, ఏకపాత్రాభినయం పాత్రలూ అతనికి నటన మీద మంచి పట్టు లభించేదానికి దోహదపడ్డాయి.
Remove ads
తొలి జీవితం
మల్లిఖార్జునరావు , పీలా పోతు నాయుడు, పీలా అచ్చియమ్మ దంపతులకు 1950 అక్టోబరు 10న అనకాపల్లిలోని గవరపాలెంలో జన్మించారు. అతని తండ్రి పీలా పోతు నాయుడు స్వాతంత్ర్య సమరయోధుడు, అనకాపల్లిలో భూస్వామి. మల్లికార్జునరావు గవరపాలెంలో గౌరీ వ్యాయామశాలను ఏర్పాటు చేశారు.అతని మార్గదర్శకత్వంలో మళ్ల వెంకట మాణిక్యాలు 1984 ఒలింపిక్స్లో కూడా పాల్గొన్నారు.[2]
భమిడిపాటి రాధాకృష్ణ రాసిన లెక్కలు తెచ్చిన చిక్కులు అతని తొలి నాటకం. అతనిని రంగస్థలంపై నటుడిగా నిలబెట్టింది పలుకే బంగారమాయె చిత్రం. ఇందులో నిర్మాత వేషం మల్లికార్జునరావుకి ఎంతో గుర్తింపు నిచ్చింది. అనకాపల్లిలోనే ఎ.ఎమ్.వి.ఎమ్. ఆసుపత్రిలో కొన్నాళ్లు ఉద్యోగం చేశారు. అక్కడి ట్రేడ్ యూనియన్కి నాయకత్వం వహించారు. అతనికి, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.
Remove ads
సినీ ప్రస్థానం
దివంగత నటులు రావు గోపాలరావు సహకారంతో చిత్రసీమలోకి ప్రవేశించారు. 1972లో తులసి అనే చిత్రంలో చిన్నవేషం వేశారు. ఆ సమయంలోనే పార్వతీ పరమేశ్వరులు చిత్రానికి సహాయ దర్శకుడిగా పనిచేశారు. తరువాత నాగమల్లి లాంటి కొన్ని చిత్రాల్లో నటించారు. వంశీతో ఏర్పడ్డ పరిచయం అతని సినీజీవితాన్ని మలుపు తిప్పింది.
వంశీ మొదటిచిత్రం మంచు పల్లకీలో చిన్న పాత్ర పోషించారు. అన్వేషణలో పులిరాజుగా మల్లికార్జునరావు నటన చిత్రసీమను ఆకట్టుకొంది. అదే సమయంలో తన తండ్రి అస్వస్థతకు లోనైతే అనకాపల్లి వెళ్లడం వల్ల అవకాశాలు కోల్పోయారు. 'లేడీస్ టైలర్'లో బట్టల సత్యం పాత్ర తరువాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. 350కి పైగా సినిమాల్లో నటించారు. తమ్ముడు సినిమాకు ఉత్తమ సహాయ నటుడిగా రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డును పొందారు. ఏప్రిల్ ఒకటి విడుదల, కనకమాలక్ష్మి రికార్డింగ్ డ్యాన్స్ట్రూపు, హలో బ్రదర్, ఆలీబాబా అరడజను దొంగలు, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, బద్రి, ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు, ఎవడి గోల వాడిది, మా ఆయన సుందరయ్య (2001) లాంటి చిత్రాలు అతనికి ఏంతో పేరు తీసుకొచ్చాయి. మల్లికార్జునరావు నటనలో తనకంటూ ఓ పంథాను ఏర్పరచుకొన్నారు. తొలినాళ్లలో రావుగోపాలరావు ప్రభావం ఉండేది. తన సంభాషణ శైలిలో ఉత్తరాంధ్ర యాసని మేళవించడంతో జనాన్ని సులభంగా ఆకట్టుకోగలిగారు. ఆ యాసనీ, మాండలికాన్నీ సాధికారికంగా మాట్లాడగలిగిన నటుడిగా గుర్తింపు పొందారు. అలాగే గ్రామీణ నేపథ్యం ఉన్న పాత్రలకు జీవంపోసే నటుల్లో అతను ముందుండే వారు. చివరిగా ఆయన నటించిన చిత్రం మహా నగరంలో.
Remove ads
నటించిన చిత్రాలు
- దాసన్నా (2010)
- రెయిన్బో (2008)
- అతడెవరు (2007)
- 143[3][4]
- ప్రేమించుకున్నాం పెళ్ళికి రండి (2004)
- రాఘవ (2002)
- 6 టీన్స్ (2001)
- కలిసి నడుద్దాం (2001)
- ప్రేమసందడి (2001)
- సాంబయ్య (1999)
- పవిత్ర ప్రేమ (1998)
- ఆలీబాబా అరడజను దొంగలు (1994)
- హలోబ్రదర్(1994)
- మల్లెపువ్వు(1978)
పురస్కారాలు
- తమ్ముడు సినిమాకు ఉత్తమ సహాయ నటుడిగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ నంది అవార్డు.[5]
- రఘుపతి వెంకయ్య బంగారు పతకం (ప్రముఖ నటుడు గుమ్మడి స్థాపించారు)
పదవులు
- తెలుగుదేశం పార్టీతో సాంస్కృతిక విభాగానికి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా[1] అతనుకు సన్నిహిత సంబంధాలున్నాయి.
- మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్కు ప్రధాన కార్యదర్శిగా మూడు సార్లు ఎంపికయ్యారు.
మరణం
57 సంవత్సరాల వయస్సులో మంగళవారం 24 జూన్, 2008 ఉదయం 10.30 ని.లకు రక్త కేన్సర్ (లుకేమియా) వ్యాధితో తుదిశ్వాస విడిచారు.[1]
బయటి లింకులు
మూలాలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.
Remove ads