![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/2/2e/Assam_Legislative_Assembly_2023.svg/langte-640px-Assam_Legislative_Assembly_2023.svg.png&w=640&q=50)
అసోం శాసనసభ
అస్సాం రాష్ట్రానికి చెందిన ఏకసభ్య శాసనసభ. / From Wikipedia, the free encyclopedia
అసోం శాసనసభ, అనేది భారతదేశంలోని అస్సాం రాష్ట్రానికి చెందిన ఏకసభ్య శాసనసభ. ఇది భౌగోళికంగా ప్రస్తుత పశ్చిమ అసోం ప్రాంతంలో ఉన్న అస్సాం రాజధాని నగరం డిస్పూర్లో ఉంది.అసోం శాసనసభ 126 మంది శాసనసభ సభ్యులుతో కలిగిఉంది.వారందరూ ఒకే స్థానం నియోజకవర్గాల నుండి నేరుగా ఎన్నికయ్యారు. వారి పదవీకాలం ముందుగా శాసనసభ ఏదేని పరిస్థితులలో త్వరగా రద్దు చేయకపోతే ఐదేళ్లు ఉంటుంది.
అసోం శాసనసభ | |
---|---|
15వ అసోం శాసనసభ | |
రకం | |
రకం | అసోం శాసనసభ ఏకసభ |
కాల పరిమితులు | 5 సంవత్సరాలు |
చరిత్ర | |
స్థాపితం | 7 ఏప్రిల్ 1937 (87 సంవత్సరాల క్రితం) (1937-04-07)[1] |
నాయకత్వం | |
అస్సాం గవర్నర్ | గులాబ్ చంద్ కటారియా 2023 ఫిబ్రవరి 15 నుండి |
సభ స్పీకర్ | |
సభ డిప్యూటీ స్పీకర్ | |
సభా నాయకుడు ముఖ్యమంత్రి | |
ప్రతిపక్ష నాయకుడు | |
ప్రతిపక్ష ఉప నాయకుడు | |
నిర్మాణం | |
సీట్లు | 126 |
![]() | |
రాజకీయ వర్గాలు | Government (79) NDA (79) Official Opposition (27) Other opposition (20) |
ఎన్నికలు | |
ఓటింగ్ విధానం | ఫస్ట్ పాస్ట్ ది పోస్ట్ |
మొదటి ఎన్నికలు | మొదటి ఎన్నికలు |
చివరి ఎన్నికలు | 2021 మే 21 |
తదుపరి ఎన్నికలు | తదుపరి ఎన్నికలు 2026 |
సమావేశ స్థలం | |
![]() | |
అస్సాం లెజిస్లేటివ్ అసెంబ్లీ కాంప్లెక్స్, దిస్పూర్, గౌహతి, అసోం, భారతదేశం - 781006. | |
వెబ్సైటు | |
www.assambidhansabha.org |
భారత ప్రభుత్వ చట్టం 1935 నిబంధనల ప్రకారం, అస్సాం ప్రావిన్స్లో ద్విసభ్య శాసనసభ 1937లో ఉనికిలోకి వచ్చింది. భారత ప్రభుత్వ చట్టం 1935 ఆమోదించబడిన తర్వాత, ఇది అసోం శాసనసభ ఏర్పాటుకు మార్గం సుగమం చేసింది.అది ద్విసభ శాసనసభగా మారింది.అప్పటి సభ స్థానాల సంఖ్య 108, ఆ స్థానాలకు సభ్యులందరూ ఎన్నికయ్యారు. శాసనమండలి లెజిస్లేటివ్ కౌన్సిల్ లేదా ఎగువ సభ సభ్యులు 21 కంటే తక్కువ మంది సభ్యులు కాకుండా, 22 మంది సభ్యుల కంటే ఎక్కువ కాకుండా కలిగిఉంది.
దాని దిగువ సభ, అస్సాం లెజిస్లేటివ్ అసెంబ్లీ లేదా శాసనసభ మొదటి సమావేశం 1937 ఏప్రిల్ 7న షిల్లాంగ్లోని శాసనసభ హాల్ జరిగింది. షిల్లాంగ్ అస్సాం మిశ్రమ రాష్ట్రానికి రాజధాని.
అయితే, భారతదేశ విభజన తర్వాత శాసనసభ స్థానాల బలం 71కి తగ్గింది. 1947లో భారత స్వాతంత్ర్యం తర్వాత, అసోం శాసనమండలి రద్దు చేయబడింది. అప్పటినుండి అసోం శాసనసభ ఏకసభగా రూపాంతరం చెందింది.
ఆ తర్వాత సంవత్సరాల్లో, అసోం విభజించుటద్వారా అనేక చిన్న రాష్ట్రాల ఏర్పాడ్డాయి. సంవత్సరాలుగా, మారుతున్న భౌగోళిక సరిహద్దులు, జనాభా పెరుగుదలతో, శాసనసభ సభ్యుల బలం 1952-57లో 108 ఉండగా, 1967-72లో 114కి మారింది (మూడవ శాసనసభ). 1972-78 నాటికి (ఐదవ శాసనసభ) 126 మంది సభ్యులకు చేరుకుంది.[6]