![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/3/3b/Bundesarchiv_Bild_146-1985-130-30%252C_Berlin%252C_Gr%25C3%25BCndung_Zentrale_%2522Freies_Indien%2522.jpg/640px-Bundesarchiv_Bild_146-1985-130-30%252C_Berlin%252C_Gr%25C3%25BCndung_Zentrale_%2522Freies_Indien%2522.jpg&w=640&q=50)
ఆజాద్ హింద్
రెండవ ప్రపంచయుద్ధ సమయంలో సుభాష్ చంద్రబోస్ చే స్థాపించబడిన ప్రభుత్వం / From Wikipedia, the free encyclopedia
ఈ వ్యాసం సింగపూర్ లో రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో ఏర్పడిన సంస్థ గురించి.
ఆజాద్ హింద్ (Ārzī Hukūmat-e-Āzād Hind) రెండవ ప్రపంచ యుద్ధంసమయంలో జపాన్ ఆక్రమిత సింగపూర్ లో స్థాపించబడిన భారత తాత్కాలిక ప్రభుత్వం. ఇది 1943 అక్టోబరులో సింగపూర్ లో స్థాపించబడిన తాత్కాలిక అంతర్జాతీయ ప్రభుత్వం.[1] దీనికి భారత స్వాతంత్ర్య సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ నాయకత్వం వహించారు. రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ సైన్యానికి వ్యతిరేకంగా, ముఖ్యంగా జర్మనీ, ఇటలీలకు వ్యతిరేకంగా దేశాల మద్దతుతో భారత స్వాతంత్ర్యాన్ని సాధించాలనుకున్న సుభాష్ చంద్రబోస్ వారిని సహాయం కోరారు. అయితే జర్మనీ, ఇటలీ నుండి సహాయం పొందకపోవడంతో, అతను యుద్ధ సమయంలో జలాంతర్గామి ద్వారా జపాన్ కు ప్రయాణించి ఆర్మీ జనరల్ టోజోను కలుసుకుని సహాయం కోరాడు.[2] భారతదేశం వెలుపల రెండవ ప్రపంచ యుద్ధ సంవత్సరాలలో ఏర్పడిన భారతీయ జాతీయవాద రాజకీయ ఉద్యమం నుండి ప్రభుత్వం ఎదిగింది, దీని ప్రధాన లక్ష్యం బ్రిటిష్ సామ్రాజ్యం నుండి భారతదేశానికి స్వాతంత్ర్యం సాధించడం.స్వేచ్ఛ కోసం పోరాడటానికి, దేశంలోని యువతకు నాణ్యమైన జీవితాన్ని అందించడానికి ప్రజలను చైతన్యపరిచారు ఇంకా శిక్షణ ఇచ్చారు.[3] 1943 అక్టోబరు 21 న, సింగపూర్లో, బోస్ ఆజాద్ ఇండ్ స్వాతంత్ర్య ప్రకటనను విడుదల చేశారు. డిసెంబరు 29 న, దేశాధినేతగా జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ తాత్కాలిక ప్రభుత్వం బోస్ని జపనీయులతో చర్చించడానికి అనుమతించడమే కాకుండా, తూర్పు ఆసియాలోని భారతీయులను ఐఎన్ఎలో చేరడానికి ఇంకా మద్దతు ఇవ్వడానికి సమీకరించడాన్ని సులభతరం చేసింది. ప్రకటన వెలువడిన వెంటనే, తాత్కాలిక ప్రభుత్వం వివిధ దేశాల నుండి గుర్తింపు పొందింది,.దీనికి జపాన్, ఇటలీ, జర్మనీ, చైనాతో సహా 9 దేశాలు మద్దతు ఇచ్చాయి. జపాన్ స్వాధీనం చేసుకున్న అండమాన్, నికోబార్ దీవులను పరిపాలించడంతో పాటు, ఇంఫాల్ ప్రాంతాన్ని కలిగి ఉంది, ఆజాద్ హింద్ ప్రభుత్వం యొక్క ప్రధాన కార్యాలయం మొదట సింగపూర్ నుండి తరువాత రంగూన్ కు మారింది. ఈ ప్రభుత్వ శాఖలు వివిధ ఆగ్నేయాసియా దేశాలలో ఏర్పాటు చేయబడ్డాయి.నేతాజీ ప్రభుత్వాన్ని జపాన్, ఫిలిప్పీన్స్, జర్మనీ, ఇటలీ, ఐర్లాండ్ గుర్తించాయి. సాయుధ పోరాటం కోసం భారతీయ సంఘాల సమీకరణ వేగవంతమైంది. మలయా, థాయ్లాండ్, బర్మా నుండి చాలా మంది భారతీయ పౌరులు ఉత్సాహంగా స్పందించారు.
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/3/3b/Bundesarchiv_Bild_146-1985-130-30%2C_Berlin%2C_Gr%C3%BCndung_Zentrale_%22Freies_Indien%22.jpg/640px-Bundesarchiv_Bild_146-1985-130-30%2C_Berlin%2C_Gr%C3%BCndung_Zentrale_%22Freies_Indien%22.jpg)