ఆర్. విద్యాసాగర్రావు
From Wikipedia, the free encyclopedia
ఆర్ విద్యాసాగర్రావు (14 నవంబరు 1939 – 29 ఏప్రిల్ 2017)[1] తెలంగాణ రాష్ట్రానికి నీటిపారుదల రంగ నిపుణుడు, రిటైర్డ్ చీఫ్ ఇంజినీరు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వానికి నీటిపారుదల సలహాదారుగా నియమితులయ్యారు.[2] విద్యాసాగర్రావు చాలా నిరాడంబరమైన జీవితాన్ని గడిపారు. నీరు-నిజాలు ఆయన ఇంటిపేరుగా మారింది. నిర్మొహమాటం ఉండే ఆయన వ్యక్తిత్వం. వృత్తిరీత్యా ఇంజనీరు ఐన కొలువులో ఉన్నన్నాళ్లూ మంచి రచయితగా, నటుడిగా పేరొందారు.
త్వరిత వాస్తవాలు ఆర్ విద్యాసాగర్రావు, జననం ...
ఆర్ విద్యాసాగర్రావు | |
---|---|
జననం | (1939-11-14)1939 నవంబరు 14 |
మరణం | 2017 ఏప్రిల్ 29(2017-04-29) (వయసు 77) |
జాతీయత | భారతీయుడు |
విద్యాసంస్థ | ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్ |
వృత్తి |
|
మూసివేయి
తెలంగాణలో నీటిపారుదలకి ఆయన చేసిన అపారమైన కృషికి గౌరవంగా డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కు ఆర్. విద్యాసాగర్ రావు డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్గాపేరు పెట్టారు.[3] ఫ్లోరైడ్ పీడిత నల్గొండ జిల్లాకు సురక్షిత మంచినీరు, తెలంగాణ ప్రాంతంలోని ఎండిపోయిన భూములకు నీరు అందించాలని పోరాడారు.