![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/te/thumb/1/1a/University_of_Calcutta_logo.svg.png/640px-University_of_Calcutta_logo.svg.png&w=640&q=50)
కలకత్తా విశ్వవిద్యాలయం
కోల్ కతాలో నెలకొన్న విశ్వవిద్యాలయం / From Wikipedia, the free encyclopedia
కలకత్తా విశ్వవిద్యాలయం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కోలకతాలో ఉన్న ఒక పబ్లిక్ స్టేట్ విశ్వవిద్యాలయం. ఇది 1857 జనవరి 24 న స్థాపించబడింది.[3] ఇది బహుళ విభాగ, లౌకిక పాశ్చాత్య తరహా విశ్వవిద్యాలయంగా ఏర్పాటు చేయబడిన ఆసియాలోని మొదటి విద్యాసంస్థ. భారతదేశంలోపల ఇది "ఐదు నక్షత్రాల విశ్వవిద్యాలయం"గా, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ చే "సెంటర్ విత్ పొటెన్షియల్ ఫర్ ఎక్స్లెన్స్"గా గుర్తించబడింది.[4][5] ఈ విశ్వవిద్యాలయానికి సంబంధించి నలుగురు నోబెల్ గ్రహీతలు ఉన్నారు, వారు: రోనాల్డ్ రాస్, రవీంద్రనాథ్ టాగూర్, సి.వి.రామన్, అమర్త్య సేన్. ఈ విశ్వవిద్యాలయంలో భారతప్రభుత్వంచే పూర్తి స్కాలర్షిప్ తో పరిశోధన కొనసాగించేందుకు అర్హమగుటకు భారత ప్రభుత్వం యొక్క నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ చే నిర్వహించబడుతున్న నేచురల్ సైన్స్ & ఆర్ట్స్ లో డాక్టోరల్ ప్రవేశ అర్హత పరీక్ష క్లియర్ పొందిన విద్యార్థులు అత్యధిక సంఖ్యలో ఉన్నారు.[6] ఈ విద్యార్థులలో ఒకరు అర్చనా శర్మ.
কলিকাতা বিশ্ববিদ্যালয় | |
![]() కలకత్తా విశ్వవిద్యాలయం యొక్క ముద్ర | |
నినాదం | పాండిత్య పురోగమనం (Advancement of Learning) |
---|---|
రకం | ప్రభుత్వ విశ్వవిద్యాలయం |
స్థాపితం | 1857 (1857) |
ఛాన్సలర్ | Keshari Nath Tripathi, పశ్చిమ బెంగాల్ గవర్నర్ |
వైస్ ఛాన్సలర్ | సుగట మర్జిత్ |
విద్యార్థులు | 22,520[1] |
అండర్ గ్రాడ్యుయేట్లు | 3,715[1] |
పోస్టు గ్రాడ్యుయేట్లు | 15,750[1] |
స్థానం | కోలకతా, పశ్చిమ బెంగాల్, భారతదేశం |
కాంపస్ | పట్టణ ప్రాంతం, 136 అనుబంధ కళాశాలలు[2] |
అనుబంధాలు | యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC), నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (NAAC), అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ (AIU) |
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/2/22/Calcuttamedicalcollege1.jpg/320px-Calcuttamedicalcollege1.jpg)