కారుమంచి రామమూర్తి
From Wikipedia, the free encyclopedia
కారుమంచి రామమూర్తి ఏలూరుకు చెందిన ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు. 1921న గాంధీజీ ఏలూరులో సభ నిర్వహించినప్పుడు తన తల్లిదండ్రులతో సభలో పాల్గొని అప్పట్నుంచీ జాతీయోధ్యమంలో చేరారు రామమూర్తి. సహాయ నిరాకరణోద్యమంలో చురుగ్గా పాల్గొన్న ఆయన, మద్యపాన నిషేధానికి ప్రయత్నిస్తూ తాగుబోతుల చేతిలో దెబ్బలు కూడా తిన్నారు. అయినా ఆయన తన సంకల్పాన్ని మార్చుకోక పట్టుదలతో ముందుకెళ్ళడం విశేషం.[1]