ఖండోబా
శివుని అవతారం / From Wikipedia, the free encyclopedia
ఖండోబా (IAST: Khaṇḍంbā), మార్తాండ భైరవ లేదా మల్హరి, హిందూ దైవం. అతను భారతదేశంలోని దక్కను పీఠభూమి పై శివుని అవతారంగా భావించబడిన దైవం. ముఖ్యంగా మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలలో ఎక్కువగా కొలుస్తుంటారు. మహారాష్ట్రలో అతను ముఖ్యమైన కులదైవం.[1] అతను బ్రాహ్మణులు, క్షత్రియులు, వ్యవసాయదారులు, పశుపోషకులు వంటి కులాలకే కాకుండా అడవుల్లో, కొండ ప్రాంతాల్లోని గిరిజన, వేటాడే తెగలకు కూడా ఆరాధ్య దైవం. ఖండోబా పూజలు హిందూ, జైన మత పద్ధతులలో జరుగుతాయి. ఖండోబా పూజా విధానం కుల భేదం లేకుండా ముస్లింలతో సహా అందరూ అతనికి చేరువకావడానికి వీలుకల్పించింది. ఖండోబా ఆరాధన 2వ శతాబ్ది నుంచి పదో శతాబ్ది వరకు అభివృద్ధి చెందింది. ఈ దేవుని జానపద దైవంగా శివునిగా, భైరవునిగా, సూర్యునిగా, కార్తికేయునిగా కూడా భావిస్తారు. ఖండోబాను లింగరూపంలోనూ, ఎద్దుని కానీ, గుర్రాన్ని కానీ అధిష్టించిన యోధునిగానూ చిత్రీకరించడం ఉంది. మహారాష్ట్రలోని జిజూరి ఖండోబా ఆరాధనకు ముఖ్య కేంద్రంగా ఉంది. ఇతిహాసాలలో ఖండోబా గురించి మల్హరి మహాత్మ్య గ్రంథంలో, జానపద పాటలలో వివరించారు.