From Wikipedia, the free encyclopedia
గణపతి దేవుడు కాకతీయ చక్రవర్తులలో అగ్రగణ్యుడు. 6 దశాబ్దాల పాటు కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. తెలుగు నాటిని ఏకం చేసి తెలుగు వారందరినీ ఒక గొడుగు క్రిందకి తెచ్చిన వారిలో కాకతీయ గణపతిదేవుడు ఒకడు (మిగిలిన వారు ముసునూరి ప్రోలయ నాయుడు, ముసునూరి కాపయ నాయుడు, శ్రీకృష్ణదేవరాయలు).
| |||||||||||||||||||||||||||||||||||||||
‡ రాణి
|
దేవగిరి ఏలుతున్న యాదవ రాజు జైత్రపాలుడు 1195 లో కాకతీయ రుద్రదేవుని వధించి గణపతిదేవుని బంధిస్తాడు. రుద్రదేవుని తమ్ముడు మహాదేవుడు ఓరుగల్లు సింహాసనమెక్కి మూడు వర్షములు (1196-1198 CE) పాలిస్తాడు. 1198లో గణపతిని విడిపించుటకు దేవగిరిపై దండెత్తి విజయము సాధిస్తాడు కాని తన ప్రాణాలు కోల్పోతాడు. మహాదేవుని మరణానంతరము రాజ్యములో అరాచకము చెలరేగుతుంది. మహాదేవుని కుమారుడైన గణపతిదేవుడు 1198లో రాజ్యానికి వస్తాడు.[1] సేనాధిపతి రేచెర్ల రుద్రుడు తన శక్తియుక్తులు ధారపోసి రాజ్యము చక్కదిద్దుతాడు. గణపతిదేవుడు పాలించిన 62 సంవత్సరములు తెలుగు దేశ చరిత్రలో కొనియాడదగినవి. ఇతని పాలనలో రాజ్యవిస్తరణకు, వర్తకానికి ప్రాముఖ్యతనిచ్చాడు.[2]
కాకతీయ గణపతిదేవుడు రాజ్యానికి రాకముందు 12 సంవత్సరాలు దేవగిరి యాదవుల వద్ద బందీగా ఉన్నాడు. ఈ కాలంలో సామంతరాజులు ఎన్నో తిరుగుబాట్లు చేశారు. ఈ తిరుగుబాట్లను సేనాని రేచర్ల రుద్రుడు అణచివేశాడు. విడుదలైన పిదప రేచర్ల రుద్రుడు కాకతీయ రాజ్యాన్ని గణపతిదేవుడికి అప్పగించాడు. గణపతిదేవుని పాలనలో వ్యవసాయము, వర్తకాలు బాగా వృద్ధిచెందాయి. గణపతిదేవుడు వర్తకులను ప్రాత్సహించాడు. మోటుపల్లిలో వేయించిన అభయశాసనం దీనికి నిదర్శనం. గణపతిదేవుడు కాకతీయ రాజధానిని హన్మకొండ నుండి ఓరుగల్లుకు మార్చాడు. వ్యవసాయము వృద్ధిచెందడానికి నీటిపారుదల కల్పించుటకు ఇతని సేనాని పాకాల చెరువును కట్టించాడు. మరో సేనాని గౌండ సముద్రాన్ని నిర్మించాడు.
గణపతిదేవుడు రాజ్యవిస్తరణకు ప్రాధాన్యత ఇచ్చాడు. ఇందుకోసం సైనిక బలంపైనే కాకుండా సరిహద్దు రాజ్యాల రాజకుటుంబాలతో సంబంధాలుపెట్టుకున్నాడు. 1201లో జరిగిన మొదటి దండయాత్రలో బెజవాడ స్వాధీనము చేసుకున్నాడు. అటునుండి దివిసీమకు మరలాడు. అచట అయ్య వంశమునకు చెందిన పినచోడి పాలిస్తున్నాడు. తీవ్ర ప్రతిఘటన అనంతరము పినచోడి లొంగిపోయాడు. పినచోడి కూతుళ్ళు నారమ్మ, పేరమ్మలను గణపతి వివాహమాడి, కొడుకు జాయప సేనానిని కాకతీయ గజసైన్యాధికారిగా నియమిస్తాడు. దీనితో వెలనాడు కాకతీయ రాజ్యములో కలిసిపోయింది. 1209 ఇడుపులపాడు (బాపట్ల తాలూకా) శాసనము ప్రకారము కమ్మనాడు, వెలనాడు ఈ దండయాత్రలో జయించబడ్డాయి. 1212లో తూర్పు తీరంపై దండయాత్ర చేసి కృష్ణా, గోదావరి గుంటూరులను స్వాధీనం చేసుకున్నాడు.నిడదవోలును పాలిస్తున్న వేంగీచాళుక్య రాజు వీరభద్రుడికి తన కూతురు రుద్రమదేవినిచ్చి వివాహం చేశాడు. మరో కూతురు గణపాంబను ధరణికోట రాజు బేతరాజుకు ఇచ్చి వివాహం జరిపించాడు. . నెల్లూరును జయించి మనుమసిద్ధికి ఇచ్చాడు. దాదాపు రాయలసీమ మొత్తం గణపతిదేవుని పాలనలోకి వచ్చింది. శాతవాహనుల అనంతరం తెలుగు ప్రాంతాన్నంతటినీ ఏకఛత్రాధిపత్యంలోకి తెచ్చాడు.[3] గణపతి దేవునికి కుమారులు లేనందున ఇతని అనంతరం కూతురు రుద్రమదేవి అధికారంలోకి వచ్చింది.[4]
నెల్లూరు, కడప, చెంగల్ పట్టు ప్రాంతములకు తమ్ముసిధ్ధి రాజు. ఇతడు మనుమసిధ్ధి మూడవ కొడుకు. తన అన్నలు తిక్క, నల్లసిద్ధి లను నిర్వీర్యులను చేసి పాలించుతుండగా తిక్కభూపాలుడు తమ్ముసిద్ధిని గద్దె దించుటకు గణపతిదేవుని ఆశ్రయించుతాడు. గణపతి నెల్లూరు రాజ్యమును జయించి తిక్కభూపాలునకు అప్పగించి వెడలుతాడు. జాయప నాయుడు 1213లో వేయించిన చేబ్రోలు శాసనములో ఈ వివరాలున్నాయి. తదుపరి జరిగిన గణపతిదేవుని యుద్ధములలో తిక్క పలుమార్లు చేయందిస్తాడు. కంచి చోళులను, కడప వద్ద సేవణులను, కళింగులను ఓడించుటలో తిక్క హస్తమున్నది.[5]
ఈ విభాగం ఖాళీగా ఉంది. మీరు ఇది జోడించడం ద్వారా సహాయపడుతుంది. |
ఈ విభాగం ఖాళీగా ఉంది. మీరు ఇది జోడించడం ద్వారా సహాయపడుతుంది. |
ఈ విభాగం ఖాళీగా ఉంది. మీరు ఇది జోడించడం ద్వారా సహాయపడుతుంది. |
ఈ విభాగం ఖాళీగా ఉంది. మీరు ఇది జోడించడం ద్వారా సహాయపడుతుంది. |
ఈ విభాగం ఖాళీగా ఉంది. మీరు ఇది జోడించడం ద్వారా సహాయపడుతుంది. |
ఈ విభాగం ఖాళీగా ఉంది. మీరు ఇది జోడించడం ద్వారా సహాయపడుతుంది. |
ఈ విభాగం ఖాళీగా ఉంది. మీరు ఇది జోడించడం ద్వారా సహాయపడుతుంది. |
1208-09 ప్రాంతములో అద్దంకిని చక్రనారాయణ వంశస్థులైన మహామండలేశ్వరుడు యాదవ మహారాజు పాలిస్తున్నాడు. శాలంకాయన గోత్రీకుడు. దీనిని బట్టి వీరు సా.శ. 4-5 శతాబ్దములలో పాలించిన శాలంకాయనుల శాఖీయులు కావచ్చును. 1239 సంవత్సరపు సారంగధరదేవుని శాసనము ప్రకారము యాదవ మహారాజు గణపతిదేవునికి సామంతునిగా ఉన్నాడు. తరువాత రాజ్యాన్ని యాదవుని కుమారుడు సింహళదేవుడు 1257 వరకు పాలించాడు.
ఈ విభాగం ఖాళీగా ఉంది. మీరు ఇది జోడించడం ద్వారా సహాయపడుతుంది. |
గణపతి దేవుడు కాకతీయ సామ్రాజ్యాన్ని 20 సంవత్సరాలపాటూ సుభిక్షంగా పరిపాలించాడు. రాజ్య వారసుడి కోసం పరితపించిన గణపతిదేవుడికి తన భార్య వల్ల రుద్రమదేవి, గణపాంబ అను ఇద్దరు కుమార్తెలు కలిగారు. ఫలితం లేకపోవడంతో తన సైన్యంలో దూర్జయ వంశానికి చెందిన సైన్యాధ్యక్షుడు జయపసేనాని యొక్క చెల్లెళ్ళు నారమ్మ, పేరమ్మలను వివాహమాడాడు. 1262 లో రాజ్య భారాన్ని రుద్రమదేవికి అప్పగించాడు.
ఈ విభాగం ఖాళీగా ఉంది. మీరు ఇది జోడించడం ద్వారా సహాయపడుతుంది. |
ఈ విభాగం ఖాళీగా ఉంది. మీరు ఇది జోడించడం ద్వారా సహాయపడుతుంది. |
రాజ్యములో వ్యవసాయము ముఖ్య వృత్తి ఐననూ దేశవిదేశములతో వాణిజ్యము ఎన్నోవిధముల అభివృద్ధి చెందింది. మోటుపల్లి, మసులీపట్టణం ముఖ్యమైన ఓడ రేవులు. ఛైనా నుండి పట్టు వస్త్రములు దిగుమతి అయ్యేవి. మోటుపల్లి నుండి వజ్రాలు, దంతము, ముత్యాలు రోం నగరం వరకు ఎగుమతి చేయబడేవి. కాకతీయ సామ్రాజ్యములో వజ్రాలు సేకరించు విధి విధానాలు మార్కో పోలో చాలా వివరముగా వ్రాశాడు.[6] మసులీపట్టణమునుండి విలువైన మస్లిన్ వస్త్రాలు, అద్దకము చేయబడిన వస్త్రాలు, ఓరుగల్లులో నేయబడిన తివాచీలు, ఉన్నిదుస్తులు ఎగుమతి అయ్యేవి. కూనసముద్రము దగ్గరలోని నిర్మల నుండి ఇనుప ఖనిజము, సముద్ర తీర ప్రాంతములో చేయబడిన ఉప్పు కూడా ఎగుమతి అయ్యేవి.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.