గుప్త సామ్రాజ్యం
పురాతన భారతదేశపు సామ్రాజ్యం / From Wikipedia, the free encyclopedia
గుప్త సామ్రాజ్యము భారతదేశంలోని ఒక హిందూ సామ్రాజ్యం (సంస్కృతం:samskrutam: गुप्त राजवंश, గుప్త రాజవంశం) గుప్త వంశపు రాజులచే సుమారు సా.శ.280 నుండి సా.శ.550 వరకు పాలించబడింది. ఈ సామ్రాజ్యం ఉత్తర భారతదేశంలో గుజరాత్,రాజస్థాన్ లోని కొంతభాగం, పశ్చిమ భారతదేశం బంగ్లాదేశ్ ప్రాంతాలకు విస్తరించింది. పాటలీపుత్ర (ప్రస్తుత బీహారు రాజధాని పాట్నా) వీరి రాజధానిగా ఉంది. శాంతి, అభివృద్ధి ధ్యేయంగా సాగిన వీరి పరిపాలన శాస్త్రీయ, కళారంగాలలో విస్తృత అభివృద్ధిని సాధించింది. చరిత్రకారులు గుప్తుల కాలాన్ని హాను సామ్రాజ్యం, టాంగు సామ్రాజ్యం, రోమను సామ్రాజ్యంతో సమానంగా పోలుస్తారు. గుప్తుల కాలాన్ని "భారతదేశపు స్వర్ణయుగం" అని పిలుస్తారు. ఈ కాలంలో భారతదేశపు శాస్త్ర పరిజ్ఞానం, గణితం, ఖగోళశాస్త్రం, తత్వశాస్త్రం బాగా ప్రాచుర్యం పొందాయి.
గుప్త సామ్రాజ్యము | |||||||||
---|---|---|---|---|---|---|---|---|---|
సా.శ. 280–సా.శ. 550 | |||||||||
రెండవ చంద్రగుప్తుడు (375-415) కాలంలో సామ్రాజ్యం | |||||||||
రాజధాని | పాటలీపుత్రము | ||||||||
సామాన్య భాషలు | సంస్కృతం | ||||||||
మతం | హిందూ మతం బౌద్ధ మతం | ||||||||
ప్రభుత్వం | సార్వభౌమ(ఏకవ్యక్తి) పాలన | ||||||||
మహారాజాధిరాజ | |||||||||
• 240-280 | శ్రీ గుప్తుడు | ||||||||
• 319-335 | చంద్ర గుప్తుడు | ||||||||
• 540-550 | విష్ణు గుప్తుడు | ||||||||
చారిత్రిక కాలం | పురాతన కాలం | ||||||||
• స్థాపన | సా.శ. 280 | ||||||||
• పతనం | సా.శ. 550 | ||||||||
|
గుప్తా సామ్రాజ్యం సా.శ. 3 వ శతాబ్దం మధ్య నుండి సా.శ. 543 చివరి వరకు ఉన్న ఒక పురాతన భారతీయ సామ్రాజ్యం. సుమారు 319 నుండి 543 వరకు ఇది శిఖరాగ్రస్థాయిలో ఉంది. ఇది భారత ఉపఖండంలో ఎక్కువ భాగాన్ని పాలించింది.[1] ఈ కాలాన్ని భారతదేశ స్వర్ణయుగంగా కొందరు చరిత్రకారులు భావిస్తారు.[2][note 1] ఈ పాలక రాజవంశం శ్రీ గుప్తా రాజు స్థాపించాడు; ఈ రాజవంశం అత్యంత ముఖ్యమైన పాలకులు మొదటి చంద్రగుప్తుడు, సముద్రగుప్తుడు, రెండవ చంద్రగుప్తా (విక్రమాదిత్య). సా.శ. 5 వ శతాబ్దపు సంస్కృత కవి కాళిదాసు భారతదేశంలో, వెలుపల ఇరవై ఒక్క రాజ్యాలను స్వాధీనం చేసుకున్నారని గుప్తాల ఘనతను వర్ణించాడు. వీటిలో పరాసికా రాజ్యాలు, హునాలు, కంబోజాలు, పశ్చిమ - తూర్పు ఆక్ససు లోయలలో ఉన్న గిరిజనులు, కిన్నారాలు, కిరాతులు, ఇతర రాజ్యాలు ఉన్నాయి. [4]మూస:Npsn
సముద్రగుప్తుడు రెండవ చంద్రగుప్తుడు, మొదటి కుమారగుప్తుడు పాలనలో జరిగిన గొప్ప సాంస్కృతిక పరిణామాలు ఈ కాలంలోని గొప్ప అంశాలుగా ఉన్నాయి. ఈ కాలంలో మహాభారతం, రామాయణం వంటి అనేక సాహిత్య వనరులు కాననైజు చేయబడ్డాయి.[5] గుప్తా కాలం కాళిదాసు వంటి గొప్ప కవులను ఉత్పత్తి చేసింది.[6] ఆర్యభట్ట, వరాహమిహిరా, వాత్సాయయన వంటి పండితులు అనేక విద్యా రంగాలలో గొప్ప పురోగతి సాధించింది. [7][8][9] గుప్తా కాలంలో సైన్సు, రాజకీయ పరిపాలన కొత్త శిఖరాలకు చేరుకున్నాయి.[8] ఈ కాలం వాస్తుశిల్పం, శిల్పం, చిత్రలేఖనం విజయాలకు దారితీసింది. ఇది "రూపం, అభిరుచి ప్రమాణాలను నిర్దేశిస్తుంది. ఇది భారతదేశంలోనే కాకుండా దేశ సరిహద్దులను దాటి కళా ప్రశంశలను అందుకుంది".[10] బలమైన వాణిజ్య సంబంధాలు కూడా ఈ ప్రాంతాన్ని ఒక ముఖ్యమైన సాంస్కృతిక కేంద్రంగా మార్చాయి. బర్మా, శ్రీలంక, ఆగ్నేయాసియాలోని సమీప రాజ్యాలు, ప్రాంతాలను ప్రభావితం చేసే ఒక వాణిజ్య స్థావరంగా ఈ ప్రాంతాన్ని స్థాపించాయి.[11][నమ్మదగని మూలం?] పురాణాలు, వివిధ విషయాల మీద అంతకుముందు సుదీర్ఘమైన కవితలు కూడా ఈ కాలంలో వ్రాతపూర్వక గ్రంథాల రచనరూపంలో ఉన్నాయని భావిస్తున్నారు.[12]
సామ్రాజ్యం చివరికి భూభాగం కోల్పోవడం, వారి స్వంత భూస్వామ్య అధిపతుల అధికారం, అలాగే మధ్య ఆసియా నుండి హునా ప్రజలు (కిడారిట్సు, ఆల్కాను హన్సు) దాడి చేయడం వంటి అనేక కారణాలతో పతనం అయింది.[13][14] 6 వ శతాబ్దంలో గుప్తసామ్రాజ్యం పతనం తరువాత భారతదేశం మళ్లీ అనేక ప్రాంతీయ రాజ్యాలచే పరిపాలించబడింది.