జనతాదళ్ (యునైటెడ్)
From Wikipedia, the free encyclopedia
జనతా దళ్ (యునైటెడ్) సంక్షిప్తంగా జెడి (యు) భారతదేశానికి చెందిన ఒక రాజకీయ పార్టీ. ఈ పార్టీ ముఖ్యంగా తూర్పు, ఈశాన్య భారతదేశంలో రాజకీయ ఉనికిని కలిగి ఉంది. జనతా దళ్ (యునైటెడ్) పార్టీలో చీలిక కారణంగా రెండు వర్గాలుగా విడిపోయింది జార్జ్ ఫెర్నాండెజ్ నేతృత్వంలోని జెడి (ఎస్), జనతాదళ్ (యునైటెడ్)గా ఉన్నాయి. ఈ పార్టీ ప్రముఖ నాయకులలో ఒకరైన నితీష్ కుమార్ జనతా పార్టీ టికెట్ పై పోటీ చేసి భారతీయ జనతా పార్టీ కూటమి మద్దతుతో బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు.[1][2]
జనతాదళ్ | |
---|---|
లోకసభ నాయకుడు | లలన్ సింగ్ |
రాజ్యసభ నాయకుడు | రామచంద్ర ప్రసాద్ సింగ్ |
స్థాపకులు |
|
స్థాపన తేదీ | 30 అక్టోబరు 2003 (20 సంవత్సరాల క్రితం) (2003-10-30) |
ప్రధాన కార్యాలయం | 7, జనతా మందిర్ రోడ్డు, ఢిల్లీ |
రాజకీయ విధానం | సోషలిజం, లౌకికవాదం |
ఈసిఐ హోదా |
|
కూటమి | |
లోక్సభలో సీట్లు | 16 / 543 |
రాజ్యసభలో సీట్లు | 5 / 245 |
Election symbol | |
జెడి (యు) బీహార్, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో రాష్ట్ర స్థాయి పార్టీగా గుర్తించబడింది అలాగే బీహార్ రాష్ట్రంలో అధికార పార్టీగా ఉంది. అరుణాచల్ ప్రదేశ్లో ప్రతిపక్ష పాటి హోదాలో ఉంది. 2019 భారత సార్వత్రిక ఎన్నికల్లో జెడి (యు) 16 సీట్లు గెలుచుకుని, లోక్సభలో ఏడవ అతిపెద్ద పార్టీగా నిలిచింది. పార్టీ సోషలిజం, లౌకికవాదం అలాగే సమగ్ర మానవతావాదం సిద్ధాంతాలపై పనిచేస్తుంది.