జావేద్ అక్తర్
కవి, గాయకుడు, గీత రచయిత / From Wikipedia, the free encyclopedia
జావేద్ అక్తర్ భారతదేశానికి చెందిన సినిమా గీత రచయిత, స్క్రీన్ ప్లే రైటర్, మాజీ రాజ్యసభ సభ్యుడు. ఆయన ఐదు జాతీయ అవార్డులు,, భారత ప్రభుత్వ అత్యున్నత పురస్కారాలు 1999లో పద్మశ్రీ, 2007లో పద్మ భూషణ్ పురస్కారాలను అందుకున్నాడు.[1] జావెద్ అక్తర్ జీవితంపై రచయిత అరవింద్ మాండ్లోయ్ ముద్రించిన ‘జాదూనామా’ పుస్తకాన్ని ఢిల్లీలో 2022 డిసెంబరు 4న ఉర్దూ ఫెయిర్ ‘జష్న్-ఎ-రేఖ్తా’లో ఆవిష్కరించారు.[2] ఆయన 2023 జూలై 29న హైదరాబాద్లోని రవీంద్రభారతిలో శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో విశ్వంభర-సినారె జాతీయ సాహిత్య పురస్కారాన్ని (నగదు బహుమతిగా రూ.5 లక్షల చెక్కు) అందుకున్నాడు.[3]
త్వరిత వాస్తవాలు వ్యక్తిగత వివరాలు, జననం ...
జావేద్ అక్తర్ | |||
రాజ్యసభ సభ్యుడు | |||
పదవీ కాలం 22 మార్చి 2010 – 21 మార్చి 2016 | |||
వ్యక్తిగత వివరాలు |
|||
---|---|---|---|
జననం | (1945-01-17) 1945 జనవరి 17 (వయసు 79) గ్వాలియర్, మధ్యప్రదేశ్, భారతదేశం | ||
జాతీయత | భారతదేశం | ||
తల్లిదండ్రులు |
| ||
జీవిత భాగస్వామి |
| ||
సంతానం |
| ||
వృత్తి |
| ||
సంతకం |
మూసివేయి