తిమ్మమ్మ మర్రిమాను
From Wikipedia, the free encyclopedia
తిమ్మమ్మ మర్రిమాను శ్రీ సత్యసాయి జిల్లా, నంబులపూలకుంట మండలం, గూటిబయలు గ్రామంలో ఉంది. ఇది కదిరి పట్టణానికి 26 కి.మీ, అనంతపురం నగరానికి 100 కి.మీ దూరం లో వుంది. ఇది దక్షిణ భారత దేశంలో అతి పెద్ద వృక్షంగా పేరు పొందింది. ఈ మర్రి చెట్టు దాదాపు 5 చదరపు ఎకరములు కన్న ఎక్కువ విస్తీర్ణంలో వ్యాపించి ఉంది. ఈ చెట్టుకు తిమ్మమ్మ అను ఆవిడ గుర్తుగా పేరు పెట్టారు.[1][2] 1989 లో తిమ్మమ్మ మర్రిమాను గిన్నీసు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం పొందింది.