From Wikipedia, the free encyclopedia
తెలంగాణ ప్రెస్ అకాడమీ, తెలంగాణ రాష్ట్రంలో జర్నలిజాన్ని ప్రోత్సమించడంకోసం తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటుచేసిన సంస్థ. 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం చారిత్రాత్మకంగా ఏర్పడిన వెంటనే మీడియా అకాడమీ ఆఫ్ తెలంగాణ (ఆంగ్లం: Media Academy Of Telangana) స్థాపించబడింది. తెలంగాణ రాష్ట్ర ప్రెస్ అకాడమీ “ఆంధ్రప్రదేశ్ సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్, 2001 కింద రిజిస్ట్రేషన్ నంబర్: 570/2014 కింద రిజిస్టర్ చేయబడింది. దీనికి ప్రఖ్యాత జర్నలిస్ట్ అల్లం నారాయణను ప్రభుత్వం చైర్మన్గా నియమించింది.
ముందువారు | అల్లం నారాయణ |
---|---|
స్థాపన | 2014 |
రకం | తెలంగాణ ప్రభుత్వ సంస్థ |
కేంద్రీకరణ | జర్నలిస్టుల సంక్షేమం |
కార్యస్థానం | |
ముఖ్యమైన వ్యక్తులు | కే.శ్రీనివాస్ రెడ్డి (చైర్మన్) |
అయితే, 2024 ఫిబ్రవరిలో రాష్ట్రప్రభుత్వం తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్గా సీనియర్ పాత్రికేయుడు కె.శ్రీనివాస్ రెడ్డిని నియమించింది. కేబినెట్ హోదా కలిగిన ఆ పదవిలో ఆయన రెండేళ్ల పాటు కొనసాగుతాడు.[1]
జర్నలిజంలో అత్యున్నతమైన ప్రమాణాలను ప్రోత్సహించడం దీని ప్రధాన లక్ష్యం. కమ్యూనికేషన్ మీడియా ద్వారా సమాజానికి సహాయపడే విలువలను పెంపొందించడం కూడా దీని ఉద్దేశం. ఈ రంగంలో తెలంగాణ నుండి తెలుగు, ఆంగ్లం, ఉర్దూ భాషలలో అనేక వార్తాపత్రికలు, పత్రికలు, మీడియా సంస్థలు దేశవ్యాప్తంగా ఖ్యాతిని పొందాయి. ఈ ప్రాంతానికి చెందిన జర్నలిస్టులు జాతీయ పత్రికలలో సంపాదకులుగా పనిచేశారు. విదేశాలలో కూడా అవార్డులు గెలుచుకున్నారు.
2014 జూలై 14న తెలంగాణ ప్రెస్ అకాడమీ తొలి చైర్మన్ గా అల్లం నారాయణ నియమితులయ్యారు.[2] జర్నలిస్టులకు ఇండ్లు, హెల్త్కార్డులు, అక్రెడిటేషన్ల మంజూరు విషయమై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు వినతిపత్రం అందించారు. ముఖ్యమంత్రి నుండి ప్రెస్ అకాడమీకి వచ్చిన రూ.20 కోట్ల నిధులతో జర్నలిస్టుల సంక్షేమనిధిని ఏర్పాటుచేసారు. తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ పదవికాలం 2016 జూలై 13తో ముగియడంతో, అతని పదవీకాలాన్ని 2019 జూన్ 30 వరకు ప్రభుత్వం పొడిగించింది.[3] ఆ తరువాత తిరిగి ప్రెస్ అకాడమీ చైర్మన్గా అల్లం నారాయణ పదవీకాలాన్ని పొడిగిస్తూ ముఖ్యమంత్రి కేసిఆర్ నిర్ణయం తీసుకున్నారు.[4] 2022 జూన్ 30వ తేదీతో ముగిసిన ఈ పదవీ కాలాన్ని రాష్ట్ర ప్రభుత్వం మరో రెండేళ్లు పొడిగించింది. 2022, జూలై 1 నుంచి 2024 జూన్ 30 వరకు మీడియా అకాడమీ చైర్మన్గా పదవిలో కొనసాగుతారు. చైర్మన్ పదవిని పొడిగించడం ఇది మూడోసారి.[5] అయితే, 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికలలో నెగ్గిన భారత జాతీయ కాంగ్రెస్ ప్రభుత్వం 2024 ఫిబ్రవరిలో తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్గా సీనియర్ పాత్రికేయుడు కె.శ్రీనివాస్ రెడ్డిని నియమించింది. కేబినెట్ హోదా కలిగిన ఆ పదవిలో ఆయన రెండేళ్ల పాటు కొనసాగుతాడు.[1]
చైర్మన్ అల్లం నారాయణ అధ్యక్షతన తెలంగాణ ప్రెస్ అకాడమీ ఆధ్వర్యంలో మహిళా పాత్రికేయులకు 2022 ఏప్రిల్ 23, 24 తేదీలలో రెండ్రోజుల వర్క్ షాప్ నిర్వహించారు.
ఈ కార్యక్రమం ప్రారంబోత్సవంలో రాష్ట్ర మం త్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత పాల్గొన్నారు. రాష్ట్రంలో మహిళా జర్నలిస్టుల సంక్షేమానికి వారు కృషి చేస్తామన్నారు.[6] ముగింపు కార్యక్రమానికి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఫోర్త్ ఎస్టేట్ అయిన మీడియా రంగంలో మహిళల భాగస్వామ్యం పెరగడం హర్షణీయమని కవిత వెల్లడించారు. జర్నలిస్టులు విశ్వసనీయతకు కట్టుబడి వార్తలు రాయాలన్నారు.[7]
2015 ఫిబ్రవరిలో నాంపల్లి చాపల్ రోడ్డులోని పాత అకాడమీ భవనంలో జరిగిన అకాడమీ మొదటి సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి కేసీఆర్, పాత ప్రెస్ అకాడమీ స్థానంలో కొత్త భవనం నిర్మించాలని సూచించాడు. భవన నిర్మాణంకోసం 2017లో 15 కోట్ల రూపాయలు విడుదల చేయబడ్డాయి. వేయి గజాల స్థలంలో నాలుగు అంతస్తుల్లో 29,548 చదరపు అడుగుల్లో కార్పొరేట్ భవనంలా నిర్మించబడిన ఈ భవనంలో 250 మంది కూర్చునే సామర్థ్యం గల ఆడిటోరియం, గ్రంథాలయం, చైర్మన్, తదితరులకు ప్రత్యేక గదులు ఉన్నాయి.[8][9]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.