దేవి మహాత్మ్యం
From Wikipedia, the free encyclopedia
దేవి మహాత్మ్యం అమ్మవారిని ఈ సృష్టి మూలకర్త గానూ పరమోత్కృష్టమైన శక్తి స్వరూపిణి గానూ కీర్తించే హిందువుల పవిత్ర గ్రంథం.[1][2] ఇది మార్కండేయ పురాణంలో ఉంది. ఇది సా.శ 400-600 మధ్యలో సంస్కృతంలో రాయబడింది. దేవి మహాత్మ్యమునే దుర్గ సప్తశతి అని కూడా వ్యవహరిస్తారు. ఇందులో పదమూడు అధ్యాయాలు, ఏడు వందల శ్లోకాలు ఉన్నాయి. దేవి భాగవత పురాణం, దేవి ఉపనిషత్తుల లాంటి శాక్తేయ ఉపనిషత్తులతో పాటు దేవి మహాత్మ్యం కూడా శాక్తేయ సాంప్రదాయంలో ముఖ్యమైన గ్రంథం.[3][4][5]