దేవులపల్లి కృష్ణశాస్త్రి
భారత రచయిత / From Wikipedia, the free encyclopedia
దేవులపల్లి కృష్ణశాస్త్రి (నవంబర్ 1, 1897 - ఫిబ్రవరి 24, 1980) తెలుగు కవి. తెలుగు భావ కవితా రంగంలో కృష్ణశాస్త్రి ఒక ముఖ్య అధ్యాయం. ఆయన రేడియాలో లలితగీతాలు, నాటికలు, సినిమాల్లో పాటలు రాయడం ద్వారా ప్రఖ్యాతి పొందారు. చిన్న వయసునుండే రచనలు ఆరంభించారు. 1929 లో రవీంద్రనాధ టాగూరును కలసిన తరువాత ఆయన కవిత్వంలో భావుకత వెల్లివిరిసింది. 1945లో ఆకాశవాణిలో చేరి అనేక పాటలు, నాటికలు రచించారు.
త్వరిత వాస్తవాలు దేవులపల్లి వేంకట కృష్ణశాస్త్రి, జననం ...
దేవులపల్లి వేంకట కృష్ణశాస్త్రి | |
---|---|
జననం | దేవులపల్లి వేంకట కృష్ణశాస్త్రి నవంబర్ 1, 1897 రావు వారి చంద్రంపాలెం , పిఠాపురం దగ్గర |
మరణం | ఫిబ్రవరి 24, 1980 |
నివాస ప్రాంతం | రావు వారి చంద్రంపాలెం , పిఠాపురం దగ్గర , తూర్పు గోదావరి జిల్లా |
వృత్తి | పెద్దాపురం మిషన్ ఉన్నత పాఠశాల లో ఉపాధ్యాయుడు |
ప్రసిద్ధి | తెలుగు సినిమా పాటల రచయిత |
మతం | హిందూ |
భార్య / భర్త | రాజహంస(మ.2002)[1] |
పిల్లలు | కొడుకు - దేవులపల్లి సుబ్బరాయ శాస్త్రి (బుజ్జాయి), కూతురు -సీత |
మూసివేయి