పురపాలకసంఘం
From Wikipedia, the free encyclopedia
పురపాలక సంఘం లేదా మున్సిపాలిటీ, భారతదేశంలో పట్టణాన్ని పరిపాలించే పరిపాలనా యంత్రాంగం. ప్రజలుచేత ప్రత్యక్ష్యంగా లేదా పరోక్షంగా ఎన్నుకొనబడిన వ్యక్తి పురపాలక సంఘానికి మున్సిపల్ ఛైర్మన్గా ఉంటాడు. పరిపాలనా యంత్రాంగం కొరకు పట్టణ కౌన్సిల్ లేదా మున్సిపల్ కౌన్సిల్ నందు అధికారులు ఉంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం గ్రేటర్ కార్పొరేషన్లు 3, కార్పొరేషన్లు 13, మున్సిపాలిటీలు 74, నగర పంచాయితీలు 20 ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం గ్రేటర్ కార్పొరేషన్లు 6, మున్సిపాలిటీలు, నగర పంచాయితీలు కలిపి 59 ఉన్నాయి. వీటికి ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల కమీషన్ నిర్వహిస్తుంది. [1]