బద్రీనాథ్
From Wikipedia, the free encyclopedia
బద్రీనాథ్ హిందువుల ఒక పుణ్యక్షేత్రం. ఇది భారతదేశంలో ఉత్తరాఖండ్ లోని చమోలి జిల్లాలో ఉన్న పంచాయితీ.[1] చార్ ధామ్ (నాలుగు పట్టణాలు) లలో ఇది ఒకటి. చార్ ధామ్ యాత్ర హిందువుల ముఖ్యమైన యాత్ర. బద్రీనాథ్ గర్వాల్ కొండలలో అలకనందానదీ తీరంలో 3133 మీటర్ల ఎత్తులో ఉంది. నర నారాయణ కొండల వరసలమధ్య నీలఖంఠ (6,560 మీటర్లు8 శిఖరానికి దిగువభాగంలో ఉంది. బద్రీనాథ్ ఋషికేశ్కు ఉత్తరంలో 301 కిలోమీటర్ల దూరంలో ఉంది. కేథార్నాధ్కు సమీపంలో ఉన్న గౌరీ కుండ్కు 233 కిలోమీటర్ల దూరంలో ఉంది.
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |