బిపిన్ చంద్ర పాల్
From Wikipedia, the free encyclopedia
బిపిన్ చంద్ర పాల్ (నవంబరు 7, 1858 – మే 20, 1932) సుప్రసిద్ధ స్వాతంత్ర్య సమర యోధుడు. లాల్, బాల్, పాల్ త్రయంలో మూడవ వాడు. 1905 లో బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా పోరాడాడు. జాతీయోద్యమ పత్రిక బందే మాతరంను మొదలు పెట్టాడు. ఆ పత్రికలో అరబిందో వ్రాసిన వ్యాసానికి సంబంధించిన కేసులో వ్యతిరేకంగా సాక్ష్యం ఇవ్వనందున ఆరు మాసాలు జైలు శిక్ష అనుభవించాడు. తెలుగువారితో సహా ఎందరో భారతీయులను స్వాతంత్ర్య సమరమందు ఉత్తేజితులను చేసాడు. ఆ పై గాంధీ సారథ్యాన్ని, ఆయన సిద్ధాంతాలను, ముఖ్యంగా ఖిలాఫత్ వంటి పోరాటాలలో ఆధ్యాత్మికత, మతము, స్వాతంత్ర్య పోరాటములకు లంకె పెట్టడాన్ని వ్యతిరేకించాడు. బ్రహ్మ సమాజంలో సభ్యుడైన పాల్ ఒక వితంతువును వివాహమాడాడు.[1]
త్వరిత వాస్తవాలు బిపిన్ చంద్ర పాల్, జననం ...
బిపిన్ చంద్ర పాల్ | |
---|---|
జననం | (1858-11-07)1858 నవంబరు 7 పోయిల్, హబిగని, సైలెట్ జిల్లా, బెంగాల్ ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియా. |
మరణం | 1932 మే 20(1932-05-20) (వయసు 73) కలకత్తా |
జాతీయత | బ్రిటిష్ ఇండియన్ |
విద్యాసంస్థ | కలకత్తా విశ్వవిద్యాలయం |
వృత్తి | రాజకీయనాయకుడు రచయిత భారత స్వాతంత్ర్యోద్యమ ఉద్యమకారుడు సంఘసంస్కర్త |
బ్రహ్మ సమాజం | |
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ |
ఉద్యమం | భారత స్వాతంత్ర్యోద్యమం |
సంతకం | |
మూసివేయి