From Wikipedia, the free encyclopedia
బూడిదవర్ణ పాత్రాసంస్కృతి (పెయింటెడు గ్రే వేరు కల్చరు (పిజిడబ్ల్యు) ) అనేది పశ్చిమ గంగా మైదానం, భారత ఉపఖండంలోని ఘగ్గరు-హక్రా లోయ భారతీయ ఇనుప యుగం భారతీయ సంస్కృతి. ఇది సుమారుగా క్రీ.పూ 1200 నుండి క్రీ.పూ 600 వరకు ఉంటుంది. [1][2][3] ఇది ఈ ప్రాంతంలోని బ్లాకు అండు రెడ్ వేరు కల్చరు (బి.ఆర్.డబల్యూ) తరువాత సంస్కృతిగా భావించబడుతుంది. తూర్పు గంగా మైదానం, మధ్య భారతదేశంలో బి.ఆర్.డబల్యూ సంస్కృతికి సమకాలీనమైనది.[4]
నలుపు రంగులో రేఖాగణిత నమూనాలతో చిత్రీకరించబడిన చక్కటి, బూడిదవర్ణ కుండల శైలిగా వర్గీకరించబడింది.[5] పి.జి.డబల్యూ సంస్కృతి గ్రామ, పట్టణ స్థావరాలు, పెంపుడు గుర్రాలు, దంతపు కళ, ఇనుప లోహసాంకేతికత ఆగమనంతో సంబంధం కలిగి ఉంది.[6] ఇప్పటివరకు కనుగొనబడిన మొత్తం పి.జి.డబల్యూ ప్రాంతాలల సంఖ్య 1100 కంటే అధికం ఉన్నాయి. [7] చాలా పిజిడబ్ల్యు ప్రాంతాలు చిన్న వ్యవసాయ గ్రామాలు అయినప్పటికీ "అనేక డజన్ల" పిజిడబ్ల్యు ప్రాంతాలు పెద్ద స్థావరాలుగా ఉద్భవించాయి. వీటిని పట్టణాలుగా వర్గీకరించవచ్చు; వీటిలో అతి పెద్దది గుంటలు లేదా కందకాలు, చెక్క పాలిసేడ్లతో పోగు చేసిన భూమితో చేసిన కట్టలు క్రీ.పూ 600 తరువాత పెద్ద నగరాలలో ఉద్భవించిన విస్తృతమైన కోటల కంటే చిన్నవి, సరళమైనవి.[8]
పిజిడబ్ల్యు సంస్కృతి బహుశా మధ్య, చివరి వేద కాలానికి అనుగుణంగా ఉంటుంది. అంటే సింధు లోయ నాగరికత క్షీణించిన తరువాత భారత ఉపఖండంలో మొట్టమొదటి పెద్ద రాజ్యమైన కురు-పాంచాల రాజ్యం.[9][10] తరువాతి వేద సాహిత్యం ఆ కాలపు జీవితం, సంస్కృతికి సంబంధించిన సమాచారాన్ని అందిస్తుంది. ఈ సంస్కృతి తరువాత క్రీ.పూ .700-500 నుండి ఉత్తర బ్లాక్ పాలిషు పాత్రాసంస్కృతి మొదలైంది. ఇది గొప్ప మహాజనపద రాజ్యాలు, మగధ సామ్రాజ్యం పెరుగుదలతో సంబంధం కలిగి ఉంది.
పిజిడబ్ల్యు సంస్కృతి వరి, గోధుమలు, చిరుధాన్యాలు, బార్లీ పంటలు పండించడంతో పెంపుడు పశువులు, గొర్రెలు, పందులు, గుర్రాలను పెంచింది. చిన్న గుడిసెల నుండి పెద్ద గదుల వరకు అనేక గదులతో కూడిన ఇళ్ళు వాటిల్-అండ్-డౌబ్, మట్టి లేదా ఇటుకలతో నిర్మించబడ్డాయి. స్పష్టమైన స్థావరాలు ఉన్నాయి. కొన్ని చిన్న పట్టణాల మధ్య కొన్ని కేంద్ర పట్టణాలు ఉన్నాయి. ఉత్తర ప్రదేశులోని జఖేరాతో సహా కొన్ని ప్రాంతాలలో ఈ సంస్కృతి “బొత్తిగా అభివృద్ధి చెందిన, ప్రోటో-అర్బన్ లేదా సెమీ అర్బన్ స్టేజ్”ను ప్రదర్శిస్తాయి. సామాజిక సంస్థ, వాణిజ్యంలో, బంగారం, రాగి, దంతాలు, పాక్షికంగా విలువైన రాళ్ళతో సహా, మిగులు ధాన్యం, రాతి బరువులు, సుగమం చేసిన వీధులు, నీటి మార్గాలు, కాలువల నిర్మాణాలు వంటి పనులు అభివృద్ధి చేయబడ్డాయి.[11]
నాగలిని సాగుకు ఉపయోగించారు. సమాజంలో పెరుగుతున్న సంక్లిష్టత 'కులాలు' ఏర్పడిన సూచనలు కూడా ఉన్నాయి. జనాభా పెరగడం, స్థావరాల పరిమాణం, సంఖ్య పెరగడంతో పాత గిరిజన సమూహాలు కనుమరుగై ఉండాలి.
పిజిడబ్ల్యు ప్రజల కళలు, చేతిపనులని ఆభరణాలు (టెర్రకోట, రాయి, సత్తుపాత్రలు, గాజుతో పాత్రలు తయారు చేస్తారు), మానవ, జంతువుల బొమ్మలు (టెర్రకోట నుండి తయారు చేస్తారు) అలాగే "అలంకరించిన అంచులు, రేఖాగణిత మూలాంశాలతో కోసిన టెర్రకోట పళ్ళాలు" ప్రాతినిధ్యం వహిస్తాయి. "కర్మ అర్ధం" బహుశా దేవతల చిహ్నాలను సూచిస్తుంది.[12] రేఖాగణిత డిజైన్లతో కొన్ని స్టాంపు సీల్సు ఉన్నాయి. కాని శాసనం లేదు ఇది మునుపటి హరప్పా సీల్సు, నార్తరను బ్లాక్ పాలిషు పాత్రల సంస్కృతి తరువాతి బ్రాహ్మి-లిఖిత ముద్రలతో విభేదిస్తుంది.[13]
పి.గి.డబల్యూ కుండలు ప్రామాణికత గొప్ప స్థాయిని చూపుతాయి. ఇది రెండు ఆకారాల గిన్నెలు, నిస్సారమైన ట్రే, లోతైన గిన్నెలతో ఆధిపత్యం చేస్తుంది. తరచుగా గోడలు, బేసు మధ్య పదునైన కోణంతో ఉంటుంది. అలంకరణ పరిధి పరిమితం - నిలువు, వాలుగా లేదా క్రిస్-క్రాస్ లైన్లు, చుక్కల వరుసలు, మురి గొలుసులు, కేంద్రీకృత వృత్తాలు సాధారణం.[14]
హర్యానాలోని కురుక్షేత్ర జిల్లాలోని భగవాన్పురాలో, త్రవ్వకాలలో హరప్పా చిత్రీత బూడిదవర్ణ సంస్కృతుల అతివ్యాప్తి, ఉన్నత నివాసాలుగా ఉండే పెద్ద ఇళ్ళు, వేదకాల యఙయాగాదులలో ఉపయోగించిన ఇటుకలను తొలగించారు.[13]
పురావస్తు శాస్త్రవేత్త వినయ కుమారు గుప్తా చేసిన తాజా సర్వేలు మధురలో 375 హెక్టార్ల విస్తీర్ణంలో అతిపెద్ద పిజిడబ్ల్యు ప్రాంతం ఉందని అని సూచిస్తున్నాయి.[15] అతిపెద్ద ప్రదేశాలలో ఇటీవల తవ్వకాలు జరిపించిన అహిచత్రా కూడా ఉంది. పిజిడబ్ల్యు సమయాలలో కనీసం 40 హెక్టార్ల విస్తీర్ణంతో పాటు పిజిడబ్ల్యు స్థాయిలకు తిరిగి వెళ్ళే కోట ప్రారంభ నిర్మాణానికి ఆధారాలు ఉన్నాయి.[16] ఇటీవల అహిచత్రా త్రవ్వకాలలో పిజిడబ్ల్యు రెండు కాలాలు గుర్తించబడ్డాయి. ఇందులో మొదటిది క్రీ.పూ 1500 నుండి 800 వరకు, చివరిది క్రీ.పూ 800 నుండి 400 వరకు ఉనికిలో ఉందని భావిస్తున్నారు.[17] ఈ కాలం ముగిసే సమయానికి అనేక పి.గి.డబల్యూ స్థావరాలు నార్తర్ను బ్లాకు పాలిషు పాత్రల కాలంలో పెద్ద పట్టణాలు, నగరాలుగా పెరిగాయి.[18]
1950 వ దశకంలో పురావస్తు శాస్త్రవేత్త బి.బి.లాలు హస్తినాపుర, మధుర, అహిచత్ర, కంపిల్య, బర్నవ, కురుక్షేత్ర పిజిడబ్ల్యు సంస్కృతి ఇతర ప్రదేశాలను మహాభారత కాలంతో అనుసంధించారు. ఇంకా మహాభారతం వరద గురించి ప్రస్తావించిందని హస్తినాపురంలో వరద శిథిలాల పొర కనుగొనబడిందని ఆయన ఎత్తి చూపారు. అయినప్పటికీ బి.బి.లాల్ తన సిద్ధాంతాలను తాత్కాలికమైనదిగా, పరిమితమైన సాక్ష్యాల మీద ఆధారపడినట్లు భావించాడు. తరువాత ఆయన ఈ సంస్కృతి స్వభావం మీద తన ప్రకటనలను పునః పరిశీలించాడు (కెన్నెతు కెన్నెడీ 1995). ద్రౌపది ట్రస్టు నిర్వహించిన మహాభారతం మీద అంతర్జాతీయ సెమినారులో ఇటీవల 2012 ప్రదర్శనలో మహాభారతం పిజిడబ్ల్యు ప్రదేశాలతో సంబంధం కలిగి ఉందని బి.బి.లాలు ధ్రువీకరించారు. సి.క్రీ.పూ 900 యుద్ధం మహాభారతంలో వివరించబడింది.[19]
ఈ సంస్కృతి కుండల శైలి ఇరానియా పీఠభూమి, ఆఫ్ఘనిస్తాను (బ్రయంటు 2001) కుండల నుండి భిన్నంగా ఉంటుంది. కొన్ని ప్రాంతాలు పిజిడబ్ల్యు కుండలు, చివరి హరప్పా కుండలు సమకాలీనమైనవిగా భావిస్తున్నారు.[20] పురావస్తు శాస్త్రవేత్త జిమ్ షాఫరు (1984: 84-85) "ప్రస్తుతం, పురావస్తు రికార్డు పెయింటెడు గ్రే వేరును దేశీయ ప్రోటోహిస్టోరికు సంస్కృతి నుండి వేరుచేసే సాంస్కృతిక ఆధారాలను సూచించలేదు." ఏది ఏమయినప్పటికీ ఇండో-ఆర్య వలసల తరువాత కూడా కుండల శైలుల కొనసాగింపు చేస్తూ సాధారణంగా స్వదేశీ హస్తకళాకారులు కుండలను తయారు చేశారు.[21] చక్రవర్తి (1968), ఇతర పరిశోధకుల అభిప్రాయం ఆధారంగా జీవనాధార మూలాలు (ఉదా. బియ్యం వాడకం), చిత్రిత బూడిదవర్ణ పాత్రల సంస్కృతి ఇతర లక్షణాలు తూర్పు భారతదేశంలో, ఆగ్నేయాసియాలో కూడా ఉన్నాయి.[note 1]
సా.శ. 2013, కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం, బనారసు హిందూ విశ్వవిద్యాలయం ఢిల్లీకి సమీపంలో ఉన్న అలంగీర్పూరు వద్ద తవ్వకాలు జరిపారు. అక్కడ వారు హరప్పా దశ తరువాతి భాగం ("నాణ్యతలో నెమ్మదిగా క్షీణత" తో), ప్రారంభ పిజిడబ్ల్యు స్థాయిల మధ్య వ్యాప్తి చెందారు; నమూనా ఆక్సా -21882 క్రీస్తుపూర్వం 2136 నుండి 1948 వరకు క్రమాంకనం చేసిన రేడియోకార్బనును చూపించింది. అయితే డేటింగు కోసం సమర్పించిన అతివ్యాప్తి దశ నుండి ఏడు ఇతర నమూనాలు ఫలితాన్ని ఇవ్వడంలో విఫలమయ్యాయి.[22] ఆర్కియాలజికలు సర్వే ఆఫ్ ఇండియా బృందం బి.ఆర్. మణి, వినయ కుమారు గుప్తా యమునా నది మీదుగా మధురకు 6 కిలోమీటర్ల తూర్పున ఉన్న గోస్నా నుండి బొగ్గు నమూనాలను సేకరించారు. ఇక్కడ పిజిడబ్ల్యు డిపాజిట్ నుండి రెండు రేడియోకార్బను తేదీలు క్రీ.పూ. 2160 - క్రీ.పూ. 2170 గా వచ్చాయి. కాని వారు "అక్కడ ఉన్నారు సాంస్కృతిక హోరిజోను ఇప్పుడు పిజిడబ్ల్యు కాలానికి చెందినదిగా పరిగణించబడే సాదా బూడిదరంగు సామాను కలిగిన కాలానికి చెందినదిగా మారుతుంది. " అని తీర్మానించారు.[23] అయితే తరువాత కాంపిలులో ప్రారంభ పిజిడబ్ల్యు హోరిజోనును నిర్ధారించే ఇతర రెండు డేటింగులు తవ్వకాలు క్రీ.పూ 2310 - 120, క్రీ.పూ 1360 - 90 గా ఉన్నట్లు పురావస్తు శాస్త్రవేత్త డి.పి. తివారీ పేర్కొన్నాడు.[24]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.