మిశ్రమ లోహము
From Wikipedia, the free encyclopedia
మిశ్రమ లోహము (ఆంగ్లం: alloy) అంటే పలు రకాలైన రసాయనిక మూలకాల మిశ్రమం. ఇందులో తప్పనిసరిగా ఒక లోహం ఉంటుంది. ఇతర రసాయనిక సమ్మేళనాలతో పోలిస్తే మిశ్రమ లోహంలో అందులో కలుపబడిన లోహం విద్యుత్ వాహకత, మృదుత్వం, అపారదర్శకత, ప్రకాశం లాంటి గుణగణాలన్నీ అట్టే ఉంటాయి.
మిశ్రమ లోహాలను లోహ బంధాల పై ఆధారపడి నిర్వచించవచ్చు.[1] ఎర్ర బంగారం (బంగారం, రాగి మిశ్రమం), తెల్ల బంగారం (వెండి, బంగారం మిశ్రమం), ఇత్తడి, కంచు లాంటివి మిశ్రమ లోహాలకు కొన్ని ఉదాహరణలు.
మిశ్రమ లోహాలను రోజువారీ వాడకంలో వివిధ రంగాల్లో ఉపయోగిస్తారు. ఉక్కు మిశ్రమాలను భవనాల్లో, వాహనాల్లో, శస్త్రచికిత్స పరికరాల్లో వాడతారు. టైటానియం మిశ్రమ లోహాలను విమాన పరిశ్రమలో ఉపయోగిస్తారు.