యాదాద్రి జిల్లా
తెలంగాణ రాష్ట్ర జిల్లా / From Wikipedia, the free encyclopedia
యాదాద్రి జిల్లా, తెలంగాణ లోని 33 జిల్లాలలో ఒకటి.[3] ఈ జిల్లా 2016 అక్టోబరు 11న, అవతరించింది. ఈ జిల్లాలో 17 మండలాలు, 2 రెవెన్యూ డివిజన్లు, ఉన్నాయి. జిల్లా పరిపాలన కేంద్రం భువనగిరి.
త్వరిత వాస్తవాలు యాదాద్రి జిల్లా, దేశం ...
యాదాద్రి జిల్లా | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
ముఖ్య పట్టణం | భువనగిరి |
మండలాలు | 17 |
Government | |
• జిల్లా కలెక్టరు | టి. వినయ్ కృష్ణారెడ్డి (ఐఏఎస్)[1] |
• లోకసభ నియోజకవర్గాలు | భువనగిరి |
• శాసనసభ నియోజకవర్గాలు | భువనగిరి |
Area | |
• మొత్తం | 3,091.48 km2 (1,193.63 sq mi) |
Population (2011) | |
• మొత్తం | 7,26,465 |
• Density | 230/km2 (610/sq mi) |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 68 శాతం |
Vehicle registration | టిఎస్-30[2] |
అక్షాంశ రేఖాంశాలు | 17°30'36"N, 78°53'24"E |
మూసివేయి
ఇంతకుపూర్వం భువనగిరి, యాదగిరిగుట్ట రెండు వేరువేరు మండలాలుగా ఉండేవి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కెసిఆర్, చిన్నజీయర్ స్వామి సూచనల మేరకు యాదగిరిగుట్టను యాదాద్రిగా మార్చారు. దీనియొక్క ముఖ్య ఉద్దేశం యాదగిరిగుట్ట అనగా "గిరి" అనేది "గుట్ట" అనేవి రెండు కూడా పర్యాయ పదాలుగా చెప్పాడుతున్నవి కావున రెండు ఒకే అర్థాన్ని ఇస్తునందునా సంస్కృత పదమైన "ఆద్రి" అనగా కొండ అనే అర్థంతో యాదగిరిగుట్టను యాదాద్రిగా మార్చారు.
తెలంగాణలోని ముఖ్యమైన అధ్యాత్మికక్షేత్రం యాదాద్రి పేరిట జిల్లాకు నామకరణం చేయబడింది. ఇందులోని అన్ని మండలాలు మునుపటి నల్గొండ జిల్లా లోనివే.[4]