ఆంధ్ర ప్రదేశ్, ఎన్టీఆర్ జిల్లా, జగ్గయ్యపేట మండల గ్రామం From Wikipedia, the free encyclopedia
వేదాద్రి, ఎన్టీఆర్ జిల్లా, జగ్గయ్యపేట మండలం లోని గ్రామం. ఇది మండల కేంద్రమైన జగ్గయ్యపేట నుండి 12 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 590 ఇళ్లతో, 2155 జనాభాతో 1339 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 1099, ఆడవారి సంఖ్య 1056. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 30 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 502. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 588856. 2022 లో చేసిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం కృష్ణా జిల్లాలో, ఇదే మండలంలో ఉండేది..[2][3]
వేదాద్రి | |
---|---|
అక్షాంశ రేఖాంశాలు: 16°48′37.368″N 80°7′50.052″E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ఎన్టీఆర్ |
మండలం | జగ్గయ్యపేట |
విస్తీర్ణం | 13.39 కి.మీ2 (5.17 చ. మై) |
జనాభా (2011) | 2,155 |
• జనసాంద్రత | 160/కి.మీ2 (420/చ. మై.) |
అదనపు జనాభాగణాంకాలు | |
• పురుషులు | 1,099 |
• స్త్రీలు | 1,056 |
• లింగ నిష్పత్తి | 961 |
• నివాసాలు | 590 |
ప్రాంతపు కోడ్ | +91 ( | )
పిన్కోడ్ | 521457 |
2011 జనగణన కోడ్ | 588856 |
ఇది విజయవాడ-హైదరాబాదు జాతీయ రహదారి నెం.9లో చిలకల్లుకు 10 కి.మీ. దూరంలో ఉంది.
జయంతిపురం 8 కి.మీ, గుడిమెట్ల 8 కి.మీ, పోచంపల్లి 9 కి.మీ, కొణకంచి 10 కి.మీ, ముక్తేశ్వరపురం 10 కి.మీ
వేదాద్రిలో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది. పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. ట్రాక్టరు సౌకర్యం గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. ప్రైవేటు బస్సు సౌకర్యం, రైల్వే స్టేషన్ మొదలైనవి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. జిల్లా రహదారి గ్రామం గుండా పోతోంది. జాతీయ రహదారి, ప్రధాన జిల్లా రహదారి గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. రాష్ట్ర రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు ఉన్నాయి. జగ్గయ్యపేట నుండి రోడ్డురవాణా సౌకర్య్హం ఉంది. విజయవాడ రైల్వేస్టేషన్ 66 కి.మీ దూరంలో ఉంది.
గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు రెండు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి ఉన్నాయి. బాలబడి, మాధ్యమిక పాఠశాలలు జగ్గయ్యపేటలో ఉన్నాయి. సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల జగ్గయ్యపేటలో ఉన్నాయి. సమీప వైద్య కళాశాల విజయవాడలోను, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్లు జగ్గయ్యపేటలోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం జగ్గయ్యపేటలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల విజయవాడ లోనూ ఉన్నాయి.
ఒక సంచార వైద్య శాలలో డాక్టర్లు లేరు. ముగ్గురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, పశు వైద్యశాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.
గ్రామంలో ఒక ప్రైవేటు వైద్య సౌకర్యం ఉంది. డిగ్రీ లేని డాక్టరు ఒకరు ఉన్నారు.
గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. కుళాయిల ద్వారా శుద్ధి చేయని నీరు కూడా సరఫరా అవుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. కాలువ/వాగు/నది ద్వారా గ్రామానికి తాగునీరు లభిస్తుంది.
ఎ.పి.ఐ.డి.సి. పరిధిలోని ఈ పథకం ద్వారా, నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల పరిధిలోని 37 గ్రామాలలోని 17,500 ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ పథకం మొదటిదశ 2004 లోనూ, రెండవదశ ఆ తరువాతా ప్రారంభించారు. నందిగామ నియోజకవర్గంలో 35 గ్రామాలుండగా, ఈ పథకం ద్వారా కంచల గ్రామం దాకా సాగునీరు అందించవలసియున్నది. రెండు సంవత్సరాల క్రితం, ఈ పథకాన్ని పరిపాలనా సౌలభ్యం కోసం, ఎన్.ఎస్.పి. పరిధిలోనికి మార్చారు. ప్రస్తుతం ఈ పథకం పనిచేయుటలేదు. [1]
మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.
2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ జగజ్జీవనరావు, సర్పంచిగా ఎన్నికైనారు. నూతనంగా పంచాయతీ పాలకవర్గం ఏర్పడగానే, తొలి సమావేశంలోనే, గ్రామంలో అంతర్గత రహదారులను అభివృద్ధి చేయాలని తీర్మానం చేసి అమలుపరచారు. ఇప్పటి వరకు, రు.40 లక్షలతో ఎస్.సి., బి.సి., ఒ.సి. కాలనీలలో అంతర్గత రహదారుల నిర్మాణం పూర్తిచేసారు. గ్రామంలో అంగన్ వాడీ కేంద్రానికి నూతన భవనాన్ని నిర్మించారు. గ్రామానికి మంజూరైన 72 వ్యక్తిగత మరుగుదొడ్లలో, 55 పూర్తిచేసి, మిగిలినవాటి నిర్మాణం కొనసాగించుచున్నారు. విద్యాధికుడైన గ్రామ సర్పంచ్, గ్రామాభివృద్ధికోసం ఉన్న వనరులను పరిశీలించుచూ, వాటిని ప్రజోపయోగంగా మలచుచున్నారు. గ్రామానికి మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా ముందుకు సాగుచున్నారు. కొన్ని ప్రాంతాలలో పైపులైనుల మరమ్మత్తులు, పునరుద్ధరణ గూడా నిర్వహించారు. [2]
వేదాద్రి క్షేత్ర మహాత్మ్యాన్ని గురించిన ప్రస్తావన శ్రీనాథుడి 'కాశీ ఖండం' లో కనిపిస్తుంది. ఇక ఎర్రా ప్రగడ, నారాయణ తీర్థులు కూడా ఈ క్షేత్రాన్ని దర్శించినట్టు తెలుస్తోంది. సోమకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మ దేవుడి దగ్గర నుంచి వేదాలను అపహరించి వాటిని సముద్ర గర్భంలో దాచేశాడు. అప్పుడు శ్రీ మహా విష్ణువు మత్స్యావతారమెత్తి సోమకాసురుడిని సంహరించి వేదాలను రక్షించాడు. అప్పుడు వేదాలు స్వామివారి సన్నిధిలో తరించే భాగ్యాన్ని కలిగించమని కోరడంతో, నరసింహవతారంలో హిరణ్య కశిపుడిని సంహరించిన అనంతరం ఆ కోరిక తీరుతుందని స్వామి చెప్పాడు. తనని అభిషేకించాలని కృష్ణవేణి కూడా ఆరాట పడుతుందనీ, అందువలన తాను వచ్చేంత వరకూ ఆ నదిలో సాలగ్రామ శిలలుగా వుండమంటూ అనుగ్రహించాడు. ఆ తరువాత హిరణ్య కశిపుడిని సంహరించిన అనంతరం, స్వామి అక్కడే అయిదు అంశలతో ఆవిర్భవించాడు.
ఇక్కడ కృష్ణానదీ తీరంలో ప్రసిద్ధి చెందిన శ్రీలక్ష్మీనరసింహస్వామి మందిరం ఉంది. ఇక్కడ పంచ నారసింహ ప్రతిమలు ఉన్నాయి. అవి వీర, యోగ, జ్వాల, సాలగ్రామ, లక్ష్మీ నృసింహస్వామి. ముఖ్య దేవాలయములో యోగానంద, లక్ష్మీ నృసింహస్వామి, కొండపైన జ్వాలా నృసింహస్వామి (నిజానికి కొండ గర్భములో దేదీప్యమానమైన వెలుగులతో అనగా జ్వాలలతో ఉన్నాడని ఆ కొండకు గల బిలము ద్వారా లోనికి వెళ్ళిన వారు అంటారు), కృష్ణానది గర్భములో స్నాన ఘట్టమునకు సమీపములో బయటకు కనిపించే రూపం సాలగ్రామం, వేదాద్రికి సమీపములోని గరుడాచల కొండపై వీర నృసింహస్వామి ఉన్నారు. ప్రతి సంవత్సరం వైశాఖ పౌర్ణమికి స్వామి వారి కళ్యాణం వైభవంగా జరుగుతుంది. యోగానంద నృసింహస్వామి వారి మూల రూపము ఈ ప్రపంచములో ఎక్కడా లేనంత సుందరముగా సాలిగ్రామ శిలతో చేయబడి త్రేతాయుగములో ఋష్యశృంగ మహర్షిచే ప్రతిష్ఠింపబడింది. 'విశ్వేశ్వరుడు' క్షేత్ర పాలకుడిగా వ్యవహరించే ఈ క్షేత్రాన్ని దర్శించడం వలన సకల పుణ్య ఫలాలు ప్రాప్తిస్తాయని భక్తుల విశ్వాసం. విశేషమైనటు వంటి పర్వదినాల్లో భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు.
గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. వ్యవసాయ పరపతి సంఘం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. రోజువారీ మార్కెట్, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.
గ్రామంలో అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. సమీకృత బాలల అభివృద్ధి పథకం, ఆటల మైదానం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.
గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 16 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.
వేదాద్రిలో భూ వినియోగం కింది విధంగా ఉంది:
వేదాద్రిలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.
వేదాద్రిలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.
సిమెంటు, వ్యవసాయ ఉత్పత్తులు
వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 538 ఇళ్లతో, 2251 జనాభాతో 133 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 1161, ఆడవారి సంఖ్య 1090.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.