శ్రీశైలం ప్రాజెక్టు
ఆనకట్ట / From Wikipedia, the free encyclopedia
శ్రీశైలం ప్రాజెక్టు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణా నదిపై నిర్మించిన భారీ బహుళార్థసాధక ప్రాజెక్టు. కేవలం జలవిద్యుత్తు ప్రాజెక్టుగానే ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టు, తరువాత కాలంలో నీటిపారుదల అవసరాలను కూడా చేర్చడంతో బహుళార్థసాధక ప్రాజెక్టుగా మారింది. తరువాత కాలంలో ప్రాజెక్టు పేరును నీలం సంజీవరెడ్డి సాగర్ ప్రాజెక్టుగా మార్చారు. 2009 అక్టోబరు 2న ప్రాజెక్టు చరిత్రలోనే అత్యధికంగా 26 లక్షల క్యూసెక్కుల వరద జలాశయంలోకి ప్రవేశించింది.[3] భారీ వరదనీటితో ప్రాజెక్టు సామర్థ్యం కంటే 10 అడుగులపై నుంచి నీరు ప్రవహించింది.
త్వరిత వాస్తవాలు శ్రీశైలం దేవస్థానం, ప్రదేశం ...
శ్రీశైలం దేవస్థానం | |
---|---|
ప్రదేశం | శ్రీశైలం, నంద్యాల జిల్లా, ఆంధ్ర ప్రదేశ్, భారతదేశము |
నిర్మాణం ప్రారంభం | 1960 |
ప్రారంభ తేదీ | 1981 |
ఆనకట్ట - స్రావణ మార్గాలు | |
నిర్మించిన జలవనరు | కృష్ణా నది |
Height | 145.10 m (476 ft)[1][2] |
పొడవు | 512 m (1,680 ft) |
జలాశయం | |
సృష్టించేది | శ్రీశైలం రిజర్వాయరు (తెలంగాణ) |
పరీవాహక ప్రాంతం | 206,040 km2 (79,550 sq mi) |
ఉపరితల వైశాల్యం | 800 km2 (310 sq mi) |
విద్యుత్ కేంద్రం | |
టర్బైన్లు | 6 × 150MW reversible Francis-type (left bank) 7 × 110MW Francis type(right bank) |
Installed capacity | 1,670 MW |
మూసివేయి