హొయసల సామ్రాజ్యం
ఇది 10 వ మరియు 14 వ శతాబ్దాల మధ్య భారతదేశంలోని కర్నాటకలో చాలా భాగం పాలించిన ప్రముఖ కన్నడిగా సామ్ర / From Wikipedia, the free encyclopedia
హొయసల సామ్రాజ్యం భారత ఉపఖండం నుండి ఉద్భవించిన కన్నడ రాచరిక సామ్రాజ్యం. ఇది 10-14 వ శతాబ్దాల మధ్య ఆధునిక కర్ణాటక లోని చాలా ప్రాంతాన్ని పరిపాలించింది. హొయసల రాజధాని మొదట్లో బేలూరు వద్ద ఉండేది, కాని తరువాత హళేబీడుకు తరలించారు.
హొయసల సామ్రాజ్యం | |||||||||
---|---|---|---|---|---|---|---|---|---|
1026–1343 | |||||||||
సా.శ.1200లో హొయసల సామ్రాజ్య విస్తృతి | |||||||||
స్థాయి | Empire (Subordinate to the Western Chalukya Empire until 1187) | ||||||||
రాజధాని | హళేబీడు బేలూరు | ||||||||
సామాన్య భాషలు | కన్నడం, సంస్కృతం | ||||||||
మతం | హిందు, జైన | ||||||||
ప్రభుత్వం | Monarchy | ||||||||
రాజు | |||||||||
• 1026–1047 | రెండవ నృపకాముడు | ||||||||
• 1292–1343 | మూడవ వీర బల్లాలుడు | ||||||||
చరిత్ర | |||||||||
• Earliest Hoysala records | 950 | ||||||||
• స్థాపన | 1026 | ||||||||
• పతనం | 1343 | ||||||||
|
హొయసల పాలకులు మొదట పశ్చిమ కనుమలలోని ఎత్తైన ప్రాంతం మాలెనాడుకు చెందిన వారు. 12 వ శతాబ్దంలో, పశ్చిమ చాళుక్య సామ్రాజ్యం, కల్యాణికి చెందిన కాలచుర్యుల మధ్య జరుగుతూండే పరస్పర వినాశకర యుద్ధాలను సద్వినియోగం చేసుకొని, వారు ప్రస్తుత కర్ణాటక ప్రాంతాలను, ప్రస్తుత తమిళనాడులోని కావేరి డెల్టాకు ఉత్తరాన ఉన్న సారవంతమైన ప్రాంతాలనూ స్వాధీనం చేసుకున్నారు. 13 వ శతాబ్దం నాటికి, వారు కర్ణాటకలో ఎక్కువ భాగం, తమిళనాడులోని చిన్న భాగాలు, పశ్చిమ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని కొన్ని ప్రాంతాలనూ పరిపాలించారు.
దక్షిణ భారతదేశంలో కళ, వాస్తుశిల్పం, మతం అభివృద్ధిలో హొయసల శకం ఒక ముఖ్యమైన కాలం. ఈ సామ్రాజ్యం ఈ రోజు ప్రధానంగా హొయసల వాస్తుశైలికి గుర్తుండిపోతుంది. ప్రస్తుతం వందకు పైగా హొయసల కాలానికి చెందిన దేవాలయాలు కర్ణాటక వ్యాప్తంగా ఉన్నాయి.
"అద్భుత శిల్పకళను ప్రదర్శించే ప్రసిద్ధ దేవాలయాలు" చెన్నకేశవ ఆలయం, బేలూర్, హొయసలేశ్వర ఆలయం, హళేబీడు సోమనాథపురలోని చెన్నకేశవ ఆలయం.[1] హొయసల పాలకులు లలిత కళలను పోషించారు, కన్నడ, సంస్కృత భాషల్లో సాహిత్య పోషణ చేసారు.