వరంగల్
తెలంగాణ, వరంగల్ జిల్లా లోని నగరం / From Wikipedia, the free encyclopedia
వరంగల్, తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లా లోని ఒక నగరం.[1] ఇది రాష్ట్ర రాజధాని హైదరాబాదుకు ఉత్తర దిశలో 157 కి.మీ. దూరంలో ఉంది. వరంగల్ తెలంగాణ రాష్ట్రంలో రెండో అతిపెద్ద నగరం. 2014 2008 జనవరిన మహా నగరంగా మారింది. వరంగల్ కి మరోపేరు ఓరుగల్లు. ఇది 2011 భారత జనాభా లెక్కల ప్రకారం 830,281 జనాభాతో తెలంగాణలో రెండవ అతిపెద్ద నగరంగా ఉంది. ఈ నగరం 406 km2 (157 sq mi) విస్తీర్ణంలో ఉంది. 1163లో స్థాపించబడిన కాకతీయ సామ్రాజ్యానికి వరంగల్ రాజధానిగా ఉండేది. కాకతీయులు నిర్మించిన స్మారక కట్టడాల్లో కోటలు, సరస్సులు, దేవాలయాలు, రాతి ద్వారాలు ప్రస్తుతం నగరం ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణగా మారడానికి దోహదపడ్డాయి. వరంగల్ లో కాకతీయులు నిర్మించిన కాకతీయ కళా తోరణం అధికారికంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ చిహ్నంలో చేర్చబడింది. తెలంగాణ సాంస్కృతిక రాజధానిగా కూడా వరంగల్ కు స్థానం కలిపించబడింది.[2][3]
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
వరంగల్ | |
---|---|
Coordinates: 18.0°N 79.58°E / 18.0; 79.58 | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | వరంగల్ జిల్లా |
Government | |
• Body | వరంగల్ మహానగర పాలక సంస్థ |
Area | |
• Total | 407.77 km2 (157.44 sq mi) |
Population (2011)[1] | |
• Total | 8,11,844 |
• Density | 2,000/km2 (5,200/sq mi) |
భాషలు | |
• అధికారిక | తెలుగు |
భారత ప్రభుత్వం హెరిటేజ్ సిటీ డెవలప్మెంట్ అండ్ ఆగ్మెంటేషన్ యోజన పథకానికి ఎంపిక చేసిన దేశంలోని పదకొండు నగరాల్లో వరంగల్ ఒకటి.[4] వరంగల్ స్మార్ట్ సిటీస్ మిషన్ కింద పట్టణ మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక అవకాశాలను మెరుగుపరచడానికి అదనపు పెట్టుబడులకు అర్హత సాధించే "ఫాస్ట్ ట్రాక్ పోటీ"లో స్మార్ట్ సిటీగా ఎంపిక చేయబడింది.[5]
మూడు పట్టణ నగరాలు కాజీపేట, హన్మకొండ, వరంగల్లు కలిసి వరంగల్ ట్రై-సిటీ అని పిలుస్తారు. మూడు నగరాలు 163వ జాతీయ రహదారికి (హైదరాబాద్ - భువనగిరి - వరంగల్ - భూపాలపట్నం) కలుపబడ్డాయి. ప్రధాన స్టేషన్లు కాజీపేట జంక్షన్ రైల్వే స్టేషన్, వరంగల్ రైల్వే స్టేషన్.