కట్టమంచి రామలింగారెడ్డి
తెలుగు రచయిత, కవి, ఉపకులపతి / From Wikipedia, the free encyclopedia
సి.ఆర్.రెడ్డిగా ప్రసిద్ధుడైన డాక్టర్ కట్టమంచి రామలింగారెడ్డి (డిసెంబర్ 10, 1880 - ఫిబ్రవరి 24, 1951) ప్రతిభావంతుడైన సాహితీవేత్త, విద్యావేత్త, పండితుడు, వక్త, రచయిత, హేతువాది. ఆదర్శవాది, రాజనీతిజ్ఞుడు. ఆంధ్రభాషాభిరంజని సంఘంలో చురుకైన పాత్ర పోషించాడు. గైక్వాడ్ స్ఫూర్తితో అమెరికాలో విద్యాభ్యాసం చేశాడు. అక్కడినుంచి తిరిగి వచ్చిన తర్వాత బరోడా కళాశాల వైస్ప్రిన్సిపాల్గా చేరాడు. 1909లో మైసూరులో విద్యాశాఖలో చేరి 1918 నుంచి 1921 వరకు విద్యాశాఖ ఇన్స్పెక్టర్ జనరల్గా వ్యవహరించాడు. 1951లో అనారోగ్యంతో ఆయన మరణించాడు. ఇతడు ఆజన్మాంతం బ్రహ్మచారిగా జీవించాడు. కవిత్వతత్వవిచారం, అర్థశాస్త్రం, ముసలమ్మ మరణము ఆయన రాసిన గ్రంథాల్లో పేరు గాంచినవి. ముసలమ్మ మరణము ఆంధ్రభాషాభిరంజని సంస్థ నిర్వహించిన పోటీలో బహుమాన కావ్యంగా నిలిచింది. అర్థ శాస్త్రంపై ఆయన రాసిన పుస్తకాలు ఆంధ్ర విజ్ఞానచంద్రికా గ్రంథమండలి వారు ప్రచురించారు.
కట్టమంచి రామలింగారెడ్డి | |
---|---|
జననం | కట్టమంచి రామలింగారెడ్డి (1880-12-10)1880 డిసెంబరు 10 [1] |
మరణం | 1951 ఫిబ్రవరి 24(1951-02-24) (వయసు 70) మద్రాసు |
మరణ కారణం | వృద్ధాప్యం |
వృత్తి | ఉపకులపతి, కవి, పండితుడు, విద్యావేత్త |
తల్లిదండ్రులు |
|