మైసూరు
కర్నాటకరాష్ట్రంలోని పెద్ద నగరాలలో మైసూరు. ఒకటి. ఇక్కడ ఉన్న బృందావన గార్డెన్, రాజప్రాసాదం, చాము / From Wikipedia, the free encyclopedia
మైసూరు (కన్నడ: ಮೈಸೂರು) కర్ణాటక రాష్ట్రంలో మూడవ అతిపెద్ద నగరం. మైసూరు జిల్లా ప్రధాన కార్యాలయాలు ఇక్కడే ఉంటాయి. మైసూరు డివిజన్ కర్ణాటక రాజధానియైన బెంగళూరుకు నైరుతి దిశగా 146 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.[1] మైసూరు అనే పదం మహిషూరు అనే పదం నుంచి ఉద్భవించింది. మహిషుడు అంటే హిందూ పురాణాల్లో పేర్కొన్న ఒక రాక్షసుడు. దీని వైశాల్యం సుమారు 42 చ.కి.మీ. ఉంటుంది. చాముండి హిల్స్ పర్వత పాదాలను ఆనుకుని ఉంది. మైసూరు దసరా ఉత్సవాలకు పేరుగాంచింది. ఈ ఉత్సవాలకు యాత్రికులు విశేష సంఖ్యలో హాజరవుతారు. ఈ పేరు నుంచే మైసూరు పెయింటింగ్, మైసూర్ పాక్ అనే మిఠాయి, మైసూరు పట్టు అనే వస్త్రాలు ప్రాచుర్యం పొందాయి.
?మైసూరు కర్ణాటక • భారతదేశం | |
అక్షాంశరేఖాంశాలు: 12.30°N 76.65°E / 12.30; 76.65 | |
కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
విస్తీర్ణం • ఎత్తు |
128.42 కి.మీ² (50 sq mi)[1]: p.04 • 763 మీ (2,503 అడుగులు) |
జిల్లా (లు) | మైసూరు జిల్లా జిల్లా |
జనాభా • జనసాంద్రత |
8,93,062 [2] (2011 నాటికి) • 6,223.55/కి.మీ² (16,119/చ.మై) |
మేయరు | B.L Byrappa [3] |
కోడులు • పిన్కోడ్ • ప్రాంతీయ ఫోన్ కోడ్ • UN/LOCODE • వాహనం |
• 570 0xx • +91-(0)821 • IN MYQ • KA-09, KA-55 |