కోవెలకుంట్ల
ఆంధ్రప్రదేశ్, నంద్యాల జిల్లా, కోయిలకుంట్ల మండల గ్రామం / From Wikipedia, the free encyclopedia
కోవెలకుంట్ల,(కోయిలకుంట్ల, కోయలకుంట్ల అని కూడా అంటారు కానీ కోవెలకుంట్ల సరైన పేరు.)ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లా, కోవెలకుంట్ల మండలం లోని పట్టణం. కోవెలకుంట్ల పట్టణంపెన్నానది ఉపనదైన కుందూ నది ఒడ్డున, కర్నూలు నుండి 85 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది జిల్లా కేంద్రం నంద్యాల నుండి 38 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 5810 ఇళ్లతో, 23859 జనాభాతో 2097 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 11606, ఆడవారి సంఖ్య 12253. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 3874 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 754. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 594507[1].పిన్ కోడ్: 518134.కోయిలకుంట్లకు చాల చరిత్ర ఉంది ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అనే స్వాతత్ర్య సమర యోధుడిని కోవెలకుంట్ల జుర్రీరు నది ఒడ్డున వురి తీసారు బ్రిటీష్ పాలకులు. ఇక్కడ బస్ డిపొ ఉంది. ఈ బస్టాండ్ జిల్లాలో 3వ పెద్ద బస్టాండు. సి.కెనాల్ నీరు వల్ల వరి పంట బాగా పండుతుంది.
కోవెలకుంట్ల | |
— పట్టణం — | |
కోవెలకుంట్ల రైల్వే స్టేషన్ సైన్ బోర్డు | |
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 15.2333°N 78.3167°E / 15.2333; 78.3167 | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | నంద్యాల |
మండలం | కోవెలకుంట్ల |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
జనాభా (2001) | |
- మొత్తం | 19,735 |
- పురుషుల సంఖ్య | 9,717 |
- స్త్రీల సంఖ్య | 10,018 |
- గృహాల సంఖ్య | 4,230 |
పిన్ కోడ్ | 518134 |
ఎస్.టి.డి కోడ్ |