తెలుగు శాసనాలు
From Wikipedia, the free encyclopedia
అశోకుని శాసనాలలో కనిపించే మౌర్యలిపియే భారతీయ భాషలన్నిటికి మాతృక అనిపిస్తున్నది. అందులోనుండే తెలుగు అక్షరాలు రూపొందినా యనిపిస్తుంది.[1] కుబ్బీరకుని భట్టిప్రోలు శాసనము, అశోకుని ఎఱ్ఱగుడిపాడు (జొన్నగిరి) గుట్టమీది శాసనము ఆంధ్ర ప్రదేశ్ ప్రాంతంలో లభించే మొదటి వ్రాతలుగా భావిస్తున్నారు. వాటిలోని భాష ప్రాకృతము, లిపి బ్రాహ్మీలిపి.
తెలుగు శాసనాలు |
విష్ణుకుండినులు |
తూర్పు చాళుక్యులు |
పశ్చిమ చాళుక్యులు |
రాష్ట్రకూటులు |
ఇతర వంశములు |
సామ్రాజ్య చోళులు |
కాకతీయులు |
రెడ్డి రాజులు |
రేచర్ల రెడ్లు |
రేనాటి చోళులు |
వైడుంబులు |
చిందులు |
తూర్పు గాంగులు |
గజపతులు |
కుతుబ్షాహీలు |
మొఘల్ సామ్రాజ్యము |
సూచిక I |
సూచిక II |
తరువాత అమరావతిలోని నాగబు అనే పదము (సా.శ. 1వ శతాబ్ది), విక్రమేంద్రవర్మ చిక్కుళ్ళ సంస్కృత శాసనంలోని "విజయరాజ్య సంవత్సరంబుళ్" (సా.శ. 6వ శతాబ్ది) మనకు కనిపిస్తున్న మొదటి తెలుగు పదాలు. నాగార్జునకొండ వ్రాతలలో కూడా తెలుగు పదాలు కనిపిస్తాయి. ఇవన్నీ ప్రాకృత శాసనాలు లేదా సంస్కృత శాసనాలు. కనుక తెనుగు అప్పటికి జనసామాన్యంలో ధారాళమైన భాషగా ఉన్నదనడానికి ఆధారాలు లేవు. ఆరవ శతాబ్ది తరువాత బ్రాహ్మీలిపినే కొద్ది మార్పులతో తెలుగువారు, కన్నడంవారు వాడుకొన్నారు. అందుచేత దీనిని "తెలుగు-కన్నడ లిపి" అని పరిశోధకులు అంటారు.[1]