వెంకటరామన్ రామకృష్ణన్
From Wikipedia, the free encyclopedia
వెంకి రామకృష్ణన్ లేక వెంకటరామన్ రామకృష్ణన్ ప్రఖ్యాత నోబెల్ పురస్కారము పొందిన జీవరసాయన శాస్త్రజ్ఞుడు. తమిళనాడు లోని చిదంబరంలో 1952 సంవత్సరములో జన్మించాడు.[1] తండ్రి ఉద్యోగరీత్యా గుజరాత్ కు వెళ్ళడంతో బాల్యమంతా, విద్యాభ్యాసమంతా బరోడాలో గడిచింది. మహారాజా శాయాజీరావు విశ్వవిద్యాలయంలో బీయస్సీ ఫిజిక్స్ చదివాడు. తర్వాత అమెరికా వెళ్ళి భౌతికశాస్త్రంలో పీహెచ్డీ చేసి అక్కడే స్థిరపడ్డాడు; రైబోసోముల రూపము ధర్మములపై చేసిన పరిశోధనలకు గాను రసాయన శాస్త్రములో 2009 నోబెల్ పురస్కారము లభించింది[2].2010లో భారత ప్రభుత్వం వీరిని పద్మ విభూషణ్ పురస్కారంతో సత్కరించింది.
త్వరిత వాస్తవాలు వెంకటరామన్ రామకృష్ణన్, జననం ...
వెంకటరామన్ రామకృష్ణన్ | |
---|---|
జననం | 1952 (age 71–72) చిదంబరం, తమిళనాడు, భారతదేశం |
నివాసం | యునైటెడ్ కింగ్ డామ్ |
పౌరసత్వం | యునైటైడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్డం |
రంగములు | జీవ రసాయన శాస్త్రము, జీవ భౌతిక శాస్త్రము |
వృత్తిసంస్థలు |
|
చదువుకున్న సంస్థలు |
|
ప్రసిద్ధి | Structure and function of the ribosome; macromolecular crystallography |
ముఖ్యమైన పురస్కారాలు | Louis-Jeantet Prize for Medicine (2007) Nobel Prize in Chemistry (2009) Padma Vibhushan (2010) |
మూసివేయి