తమిళనాడు
భారతీయ రాష్ట్రం / From Wikipedia, the free encyclopedia
తమిళనాడు దక్షిణ భారతదేశంలో ఒక రాష్ట్రం. దీని రాజధాని, అతిపెద్ద నగరం చెన్నై. తమిళనాడు భారత ఉపఖండంలోని దక్షిణ భాగంలో ఉంది. కేంద్రంపాలిత ప్రాంతం పుదుచ్చేరి, దక్షిణ భారత రాష్ట్రాలైన కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ సరిహద్దులుగా కలిగి ఉంది. దీనికి ఉత్తరాన తూర్పు కనుమలు, నీలగిరి పర్వతాలు, మేఘమలై కొండలు, పశ్చిమాన కేరళ, తూర్పున బంగాళాఖాతం, మన్నార్ గల్ఫ్, ఆగ్నేయంలో పాక్ జలసంధి, దక్షిణాన హిందూ మహాసముద్రం సరిహద్దులుగా ఉన్నాయి. రాష్ట్రం శ్రీలంక దేశంతో సముద్ర సరిహద్దును పంచుకుంటుంది.
తమిళనాడు | |||||||
---|---|---|---|---|---|---|---|
From top, left to right: Brihadisvara Temple, Shore Temple, Ranganathaswamy Temple, Nilgiri Mountains, Hogenakkal Falls and Thiruvalluvar Statue | |||||||
Motto(s): Vāymaiyē vellum (Truth alone triumphs) | |||||||
Anthem: "Tamil Thai Valthu" (Invocation to Mother Tamil) | |||||||
Coordinates: 13.09°N 80.27°E / 13.09; 80.27 | |||||||
Country | India | ||||||
Formation | 26 జనవరి 1950 | ||||||
రాజధాని, అతిపెద్ద నగరం | మద్రాస్ | ||||||
జిల్లాలు | 38 | ||||||
Government | |||||||
• Body | తమిళనాడు ప్రభుత్వం | ||||||
• గవర్నర్ | బన్వరీలాల్ పురోహిత్ | ||||||
• ముఖ్యమంత్రి | ఎం. కె. స్టాలిన్ (DMK) | ||||||
Area | |||||||
• Total | 1,30,058 km2 (50,216 sq mi) | ||||||
• Rank | 10th | ||||||
Population (2011)[1] | |||||||
• Total | 7,21,47,030 | ||||||
• Rank | 6వ | ||||||
• Density | 550/km2 (1,400/sq mi) | ||||||
Demonyms |
| ||||||
GDP (2020–21) | |||||||
• మొత్తం | ₹21.72 trillion (US$270 billion) | ||||||
భాషలు | |||||||
• అధికారిక | తమిళంl[3] | ||||||
Time zone | UTC+05:30 (IST) | ||||||
ISO 3166 code | IN-TN | ||||||
Vehicle registration | TN | ||||||
HDI (2018) | 0.708[4] high · 11th | ||||||
అక్షరాస్యత (2017) | 82.9% | ||||||
^# Jana Gana Mana is the national anthem, while Invocation to Mother Tamil is the state song/anthem. ^† Established in 1773; Madras State was formed in 1950 and renamed as Tamil Nadu on 14 January 1969[5] |
ఈ ప్రాంతాన్ని చేరా, చోళ, పాండియన్ రాజులు పరిపాలించారు. వీటివలన వంటకాలు, సంస్కృతి, వాస్తుశిల్పాన్ని ప్రభావితమైంది. మైసూర్ రాజ్యం పతనం తరువాత, ఆధునిక కాలంలో బ్రిటిష్ వలసరాజ్యాల పాలన వలన చెన్నై (మద్రాస్) మెట్రోపాలిటన్ నగరంగా ఉద్భవించింది. భాషా పరంగా రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ తరువాత 1956 లో ఆధునిక తమిళనాడు ఏర్పడింది. ఈ రాష్ట్రం అనేక చారిత్రాత్మక భవనాలు, బహుళ-మత తీర్థయాత్రాస్థలాలు, హిల్ స్టేషన్లు, మూడు ప్రపంచ వారసత్వ ప్రదేశాలకు నిలయం.[6][7][8]
విస్తీర్ణంలో తమిళనాడు భారతదేశంలో పదవ అతిపెద్దది. జనాభా ప్రకారం ఆరవ అతిపెద్దది. తమిళనాడు ఆర్థిక వ్యవస్థ భారతదేశంలో రెండవ అతిపెద్దది, స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి (జిఎస్డిపి) ₹ 21.6 ట్రిలియన్. తలసరి జిఎస్డిపిలో ₹ 229,000 తో దేశంలో 11వ స్థానంలో వుంది మానవ అభివృద్ధి సూచికలో ఇది అన్ని భారత రాష్ట్రాలలో 11వ స్థానంలో ఉంది. తమిళనాడు భారతదేశంలో అత్యధిక పట్టణీకరణ రాష్ట్రం, అత్యంత పారిశ్రామిక రాష్ట్రాలలో ఒకటి; ఉత్పాదక రంగ రాష్ట్ర జిడిపిలో మూడోవంతు కంటే ఎక్కువ. దీని అధికారిక భాష తమిళం, ఇది ప్రపంచంలో ఎక్కువ కాలం జీవింస్తున్నప్రాచీనభాషలలో ఒకటి.