అక్బర్
3 వ మొఘల్ చక్రవర్తి / From Wikipedia, the free encyclopedia
జలాలుద్దీన్ ముహమ్మద్ అక్బర్ ('అక్బర్ ద టెరరస్ట్ గా కూడా ప్రసిద్దుడు) (జననం-1542 అక్టోబరు 15:మరణం- 1605 అక్టోబర్ 27).[1][2] అక్బరు 1556 నుండి తాను మరణించినంతవరకు మొఘల్ సామ్రాజ్యానికి చక్రవర్తిగా ఉన్నాడు. ఆయన బాల్యనామం బద్రుద్దీన్ ముహమ్మదు అక్బరు. తరువాత అతని పేరు జలాలుద్దీన్ మొహమ్మదు అక్బరుగా మార్చబడింది. అతను పుట్టిన తేదీ ఆధికారికంగా 1542 అక్టోబర్ 15 కి మార్చబడింది. నాసీరుద్దీన్ హుమాయున్ కుమారుడు అయిన ఇతడు తన తండ్రి తదనంతరం మొఘల్ సామ్రాజ్యాన్ని 1556 నుండి 1605 వరకు పాలించాడు. మొఘల్ రాజవంశం స్థాపకుడైన బాబర్ మనుమడు. 1605 లో అతను మరణించే సమయానికి మొఘల్ సామ్రాజ్యం దాదాపుగా 35 లక్షల చదరపు కిలోమీటర్లు వరకు వ్యాపించి ఉంది.[ఆధారం చూపాలి]
అక్బర్ - اکبر | |
---|---|
మొఘల్ చక్రవర్తి | |
పరిపాలన | 1556 నుండి 1605 |
పూర్తి పేరు | అబుల్-ఫతెహ్ జలాలుద్దీన్ ముహమ్మద్ అక్బర్ I |
మకుటాలు | అల్-సుల్తానల్-ఆజం వల్ ఖాఖాన్ అల్ ముకర్రం, ఇమామ్-ఎ-ఆదిల్, సుల్తానుల్-ఇస్లాం కప్ఫతుల్-అనాం, అమీరుల్-మూమినీన్, ఖలీఫతుల్-ముతాఅలి సాహిబ్-ఎ-జమన్, పాద్షాహ్ గాజి జిల్లుల్లాహ్ [అర్ష్-ఆష్యానీ] భారత చక్రవర్తి.[1][2] |
జననం | (1542-10-15)1542 అక్టోబరు 15 |
జన్మస్థలం | ఉమర్ కోట్ కోట, సింధ్ |
మరణం | 1605 అక్టోబరు 27(1605-10-27) (వయసు 63) |
మరణస్థలం | ఫతేపూర్ సిక్రీ, ఆగ్రా |
సమాధి | బిహిష్తాబాద్ సికంద్రా , ఆగ్రా |
ఇంతకు ముందున్నవారు | నాసిరుద్దీన్ హుమయూన్ |
తరువాతి వారు | నూరుద్దీన్ సలీం జహాంగీర్ |
Consort to | రుకాయా సుల్తానా బేగం [3][4][5] |
సంతానము | జహాంగీర్, 5 కుమారులు, 6 కుమార్తెలు |
రాజకుటుంబము | తైమూర్ రాజసౌధం |
వంశము | మొఘల్ సామ్రాజ్యము |
తండ్రి | నాసిరుద్దీన్ హుమాయూన్ |
తల్లి | నవాబ్ హమీదా బాను బేగంసాహిబా |
Religious beliefs | ఇస్లాందీన్ ఎ ఇలాహి |
అక్బరు తన తండ్రి హుమాయూన్ మరణానంతరం 14 సంవత్సరాల వయస్సులోనే ఢిల్లీసింహాసనాన్ని అధిరోహించినప్పటికీ మొఘల్ చక్రవర్తులలో చాలా గొప్పవాడిగా ఖ్యాతి గడించాడు.[6] ఆ కాలంలో ఉత్తర భారతదేశంలో రాజకీయ సంభంధిత విషయాలలో ప్రబల్యత సంతరించుకున్న ఉండే టర్కీయులు, మంగోలీయులు, ఇరానీయులు అను మూడు జాతుల వారు ఇతని పూర్వీకులుగా ఉన్నారు.[7] తన సామర్థతను ప్రదర్శించి ఉత్తర, మధ్య భారతదేశాన్ని తన ఆధీనంలోకి తీసుకుని రావడానికి ఆయనకు రెండు దశాబ్దాల కాలం పట్టింది. అతని పాలనలో ఆఫ్ఘానిస్తాన్ జాతులపై యుద్దాలను ప్రకటించటం ద్వారా షేర్షా పష్తూన్ సంతతి వారి నుండి వస్తున్న బాహ్య సైనిక బెదిరింపులను అరికట్టాడు. రెండవ పానిపట్ యుద్దంలో హేము అని కూడా పిలువబడే హిందూ రాజు సామ్రాట్ హేము చంద్ర విక్రమాదిత్యను ఓడించాడు.[8][9] శక్తివంతమైన రాజపుత్ర కులం వారితో రాయబారాలు నడపటం ద్వారా, రాజపుత్ర యువరాణులను తన సంస్థానానికి రాణులుగా తీసుకురావటం ద్వారా చక్రవర్తిగా తన పాలనను స్థిరపరుచుకున్నాడు.
అక్బరు ఒక శిల్పకారుడు, యుద్ధ వీరుడు, కళాకారుడు, ఆయుధ తయారీ నిపుణుడు, కమ్మరివాడు, వడ్రంగి, చక్రవర్తి, సేనానాయకుడు, నూతన వస్తువులను కనిపెట్టేవాడు, జంతు శిక్షకుడు (అతని పరిపాలనా కాలంలో వేల కొద్దీ వేట చిరుతలను ఉంచి తనే శిక్షణ ఇచ్చేవాడని ప్రసిద్ధి), జరీ తయారీదారుడు, సాంకేతిక నిపుణుడు, వేదాంతిగా బహుళ నైపుణ్యం ప్రదర్శించాడు.[10] ఆయన కళలకు హద్దులు లేని సేవలు చేసాడు. అతను అక్బరు నామా, ఐన్-ఎ-అక్బరి లతో పాటు చాలా పెద్ద సాహిత్య సేకరణకు నాంది పలికాడు. మొఘల్ సేకరణలలోకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న కళను చొప్పించాడు. ఆయన నిర్మించిన భవనాలు చాలా మందిచే ఆరాధించబడుతున్నాయి. అక్బరు భవంతుల నిర్మాణానికి శ్రీకారం చుట్టాడు.[10] అక్బరు ధారావాహంగా మతపరమైన చర్చలను మొదలుపెట్టాడు. అందులో ముస్లిం పండితులు సిక్కులు, హిందువులు, చార్వాక నాస్తికులు, పోర్చుగల్ నుండి వచ్చే యేసుక్రీస్తు సంఘానికి చెందినవారితో చర్చించేవాడు. అతను దీన్ ఎ ఇలాహి ("ప్రాకృతిక ధర్మం") మతాన్ని స్థాపించాడు. ఏది ఎమైనప్పటికీ అది అక్బరు వ్యక్తిత్వ సంస్థాపనకు మాత్రమే ఉపయోగపడింది. అతని మరణాంతరం త్వరగా అంతరించిపోయింది.[8]
భారతదేశ మొఘలు సాంరాజ్యం ఒక బలమైన స్థిరమైన ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేసింది. ఇది వ్యాపార విస్తరణకు దారితీసి సరికొత్త సంస్కృతిక పోషణకు అవకాశం ఇచ్చింది. అక్బరు స్వయంగా కళ, సంస్కృతికి పోషకుడు. ఆయన్ సాహిత్య అభిలాషతో పలువురు పండితులు, అనువాదకులు, కళాకారులు, కాల్గీస్టర్లు, లేఖకులు, బుక్ బైడర్ల సిబ్బంది సాయంతో సంస్కృత, ఉర్దూ, పర్షియా, గ్రీకు, లాటిన్, అరబిక్, కాశ్మీరీ భాషలలో వ్రాసిన 24,000 సంపుటాల గ్రంథాలను రూపొందించారు. మూడు తనకు తానుగా జాబితా తయారు చేసి గ్రంధాలను మూడు ప్రధాన విభాగాలుగా చేశాడు.[11] అక్బరు ఫతేపూర్ సిక్రీ గ్రంధాలయంలో మహిళలకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయించాడు.[12] అతను ముస్లింలకు, హిందువులకు విద్యాభివృద్ధి కొరకు పాఠశాలలను స్థాపించాచని ఆదేశించాడు. ఆయన పుస్తక ముఖచిత్రాలను కూడా అధిక కళాత్మకంగా తయారుచేయడాన్ని ప్రోత్సహించాడు.[11] ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు మతాలకు చెందిన పవిత్ర వ్యక్తులు, కవులు, వాస్తుశిల్పుల, కళాకారులు అక్బరు సభను అలకరించి శాస్త్రాధ్యయనం, చర్చలు సాగించేవారు. ఢిల్లీ, ఆగ్రా, ఫతేపూర్ సిక్రీలలోని అక్బరు సభలు కళలకు, అధ్యయనాలకు అభ్యాస కేంద్రాలుగా మారాయి. పెర్సో-ఇస్లామిక్ సంస్కృతి దేశీయ భారతీయ సాంస్కృతిక అంశాలతో విలీనం చేయడం ప్రారంభమైంది. ప్రత్యేకమైన ఇండో-పర్షియన్ సంస్కృతిగా మొఘల్ శైలి కళలు, చిత్రలేఖనం, వాస్తుశిల్పం రూపొందించబడింది. ఆయన తన సామ్రాజ్యంలో మతపరమైన ఐక్యతను తీసుకురావాలనే ఆశతో ఇస్లాం, హిందూమతం విశ్వాసాల సమ్మిశ్రమంగా అక్బర్ దిన్-ఇ-ఇలాహి (హిందూ, క్రైస్తవ విశ్వాసాల సమ్మిశ్రమంగా జొరాస్ట్రియనిజం రూపొందినట్లు) మతం స్థాపించాడు. ఒక సరళమైన సంస్కృతి, దృక్పథంలో అక్బరును ప్రవక్తగా కేంద్రీకృతం చేసింది. అందు కొరకు ఆయన ఉలేమా, సాంప్రదాయ ముస్లింల ఆగ్రహాన్ని ఎదుర్కొన్నాడు. అక్బరు ఒక ప్రవక్త అని చాలామంది నమ్మేవారు. అక్బరు అభిమానపాత్రుడైన బీర్బలు ఈ మిశ్రమమైన మతాన్ని అనుసరించాడు.[ఆధారం చూపాలి]
అక్బరు పాలన భారత చరిత్రను గణనియంగా ప్రభావితం చేసింది. అతని పాలనలో మొఘల్ సామ్రాజ్యం పరిమాణంలో, సంపదలో మూడు రెట్లు పెరిగింది. అతను శక్తివంతమైన సైనిక వ్యవస్థను సృష్టించాడు, సమర్థవంతమైన రాజకీయ, సామాజిక సంస్కరణలను ప్రవేశపెట్టాడు. ముస్లిమేతరుల మీద మతపరమైన పన్నును రద్దు చేసి అధిక సివిల్, సైనిక పదవులలో వారిని నియమించడం ద్వారా ఆయన స్థానిక ప్రజల విశ్వసనీయతను గెలుచుకున్న మొదటి మొఘల్ పాలకుడయ్యాడు. అతను స్థానిక సంస్కృతులలో పాల్గొని సంస్కృత సాహిత్య అనువాదం చేసి ఒక ప్రజల సహకారంతో స్థిరమైన సామ్రాజ్యం ఏర్పరిచాడు. అందువలన అక్బరు కాలంలో మొఘల్ పాలనలో బహుళ సాంస్కృతిక సామ్రాజ్యపునాదులు నిర్మించబడ్డాయి. అక్బరు చక్రవర్తి కుమారుడైన రాజకుమారుడు సలీం మొఘల్ సాంరాజ్యానికి వారసుడయ్యాడు. సలీమ్ తరువాత జహంగీరుగా పిలవబడ్డాడు.