ఆగ్రా
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని నగరం / From Wikipedia, the free encyclopedia
ఆగ్రా (ఆంగ్లం : Agra) (హిందీ : आगरा, ఉర్దూ : آگرا ) నగరం ఉత్తర ప్రదేశ్ లో, యమునా నది ఒడ్డున గలదు. మహాభారత కాలంలో దీని పేరు 'అగ్రబనా' లేదా స్వర్గం. టోలెమీ ప్రాచీన భౌగోళశాస్త్రజ్ఞుడు, తన ప్రపంచ పటంలో దీనిని ఆగ్రాగా గుర్తించాడు. ఈ నగరాన్ని నిర్మించిన వారి గురించి పలు కథనాలున్నాయి, కానీ ఎవరి ఆధీనంలో ఈ నగరముండినదో, ఈ విషయం మాత్రం చెప్పగలుగుతున్నారు. ఈ నగరం రాజా బాదల్ సింగ్ (1475) ఆధీనంలోనుండేది. పర్షియన్ కవి సల్మాన్ ప్రకారం రాజా జైపాల్ అనే రాజు ఆధీనంలో వుండేది, ఇతడికి మహమూద్ గజనీ నుండి సంక్రమించింది.[1] 1506లో సికందర్ లోఢీ పాలించాడు, తరువాత ఇది, మొఘల్ చక్రవర్తుల ఆధీనంలోకి వచ్చింది. ఇందులోని తాజ్ మహల్, ఆగ్రా కోట, ఫతేపూర్ సిక్రీ మూడునూ యునెస్కో వారిచే ప్రపంచ వారసత్వ ప్రదేశాలు గా, గుర్తింపబడ్డాయి.
?ఆగ్రా ఉత్తర ప్రదేశ్ • భారతదేశం | |
అక్షాంశరేఖాంశాలు: 27.18°N 78.02°E / 27.18; 78.02 | |
కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
విస్తీర్ణం • ఎత్తు |
• 171 మీ (561 అడుగులు) |
జిల్లా (లు) | ఆగ్రా జిల్లా |
జనాభా | 14,00,000 (2001 నాటికి) |
కోడులు • పిన్కోడ్ • ప్రాంతీయ ఫోన్ కోడ్ • వాహనం |
• 282 XXX • +0562 • UP-80 |