గోవా
భారతీయ రాష్ట్రం / From Wikipedia, the free encyclopedia
గోవా (गोवा, Goa ) భారతదేశంలో పశ్చిమతీరాన అరేబియా సముద్రం అంచున ఉంది. ఈ ప్రాంతాన్ని కొంకణ తీరమని కూడా అంటారు. గోవాకు ఉత్తరాన మహారాష్ట్ర, తూర్పు, దక్షిణాన కర్ణాటక రాష్ట్రాలు ఉన్నాయి. ఇది దేశంలో వైశాల్యపరంగా రెండవ అతిచిన్న రాష్ట్రం.[2] జనాభా పరంగా నాలుగవ అతిచిన్న రాష్ట్రం. సిక్కిం, మిజోరామ్, అరుణాచల్ ప్రదేశ్లు గోవా కంటే తక్కువ జనాభా కలిగి ఉన్నాయి.[3] దీనిని పోర్చుగీస్ భారతదేశం అని అంటారు
?గోవా • భారతదేశం | |
అక్షాంశరేఖాంశాలు: 15.493°N 73.818°E / 15.493; 73.818 | |
కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
విస్తీర్ణం | 3,702 కి.మీ² (1,429 sq mi) |
రాజధాని | పనజి |
పెద్ద నగరం | వాస్కోడిగామా |
జిల్లా (లు) | 2 |
జనాభా • జనసాంద్రత |
14,00,000 (25th) • 363/కి.మీ² (940/చ.మై) |
అధికార భాష | కొంకణిಕನ್ನಡ, ↑ |
గవర్నరు | ఎస్.సి.జమీర్ |
ముఖ్యమంత్రి | లక్ష్మికాంత్ పర్సెకర్ |
Established | 1987-05-30 |
Legislature (seats) | ఒకే సభ (40) |
ISO abbreviation | IN-GA |
వెబ్సైటు: goagovt.nic.in | |
"↑"కొంకణి ఏకైక అధికారిక భాష కానీ మరాఠీని అధికారికావసరాలకు వాడుకోగలెగే సౌలభ్యం కల్పించారు.[1]. | |
Seal of గోవా |
గోవా రాజధాని పనజీ. 16వ శతాబ్దంలో పోర్చుగీసు వర్తకులు గోవాలో స్థావరం ఏర్పరచుకొన్నారు. కొద్దికాలంలోనే అధికారాన్ని బలవంతంగా హస్తగతం చేసుకొన్నారు. 450 ఏండ్ల తరువాత, 1961లో భారత ప్రభుత్వం సైనికచర్య ద్వారా గోవాను తన అధీనంలోకి తీసుకొన్నది.[4][5]
చక్కని బీచ్ లు, ప్రత్యేకమైన కట్టడాలు, విశిష్టమైన వన సంపద, అగ్వాడ కోట - ఇవన్నీ కలిపి గోవా మంచి పర్యాటక కేంద్రంగా కావడానికి తోడ్పడ్డాయి.