ప్రణబ్ ముఖర్జీ
భారత 13వ రాష్ట్రపతి / From Wikipedia, the free encyclopedia
ప్రణబ్ కుమార్ ముఖర్జీ (1935 డిసెంబరు 11 - 2020 ఆగస్టు 31) భారతదేశ రాజకీయ నాయకుడు. అతను భారతదేశానికి 2012 నుండి 2017 వరకు 13వ రాష్ట్రపతిగా బాధ్యతలను నిర్వర్తించాడు. తన ఆరు దశాబ్దాల రాజకీయ జీవితంలో అతను భారత జాతీయ కాంగ్రెస్లో సీనియర్ నాయకునిగా ఉన్నాడు. కేంద్రప్రభుత్వంలో అనేక మంత్రిత్వ పదవులను నిర్వహించాడు.[1] రాష్ట్రపతిగా ఎన్నిక కాకముందు అతను కేంద్ర ఆర్థిక మంత్రిగా 2009 నుండి 2012 వరకు తన సేవలనందించాడు. పార్టీలతో సంబంధం లేకుండా రాజకీయ వర్గాల్లో ప్రణబ్కు ప్రత్యేక స్థానం ఉంది. మేధావిగా, సంక్షోభ పరిష్కర్తగా అతనుకెవరూ సాటి రారని రాజకీయ పక్షాలు అంటూంటాయి.
హిజ్ ఎక్సెలెన్సీ ప్రణబ్ ముఖర్జీ | |
---|---|
প্রণব মুখোপাধ্যায় | |
13వ భారత రాష్ట్రపతి | |
In office 25 జూలై 2012 – 25 జూలై 2017 | |
ప్రధాన మంత్రి | మన్మోహన్ సింగ్ నరేంద్ర మోదీ |
Vice President | ముహమ్మద్ హమీద్ అన్సారి |
అంతకు ముందు వారు | ప్రతిభా పాటిల్ |
తరువాత వారు | రామ్నాథ్ కోవింద్ |
ఆర్థిక మంత్రి | |
In office 24 జనవరి 2009 – 24 జూలై 2012 | |
ప్రధాన మంత్రి | మన్మోహన్ సింగ్ |
అంతకు ముందు వారు | మన్మోహన్ సింగ్ (ఏక్టింగ్) |
తరువాత వారు | మన్మోహన్ సింగ్ (ఏక్టింగ్) |
In office 5 జనవరి 1982 – 31 డిసెంబరు 1984 | |
ప్రధాన మంత్రి | ఇందిరా గాంధీ |
అంతకు ముందు వారు | రామస్వామి వెంకట్రామన్ |
తరువాత వారు | విశ్వనాధ్ ప్రతాప్ సింగ్ |
రక్షణ మంత్రి | |
In office 22 మే 2004 – 27 అక్టోబరు 2006 | |
ప్రధాన మంత్రి | మన్మోహన్ సింగ్ |
అంతకు ముందు వారు | జార్జి ఫెర్నాండెజ్ |
తరువాత వారు | ఎ.కె.ఆంటోనీ |
విదేశీ వ్యవహారాల శాఖామంత్రి | |
In office 24 అక్టోబరు 2006 – 22 మే 2009 | |
ప్రధాన మంత్రి | మన్మోహన్ సింగ్ |
అంతకు ముందు వారు | మన్మోహన్ సింగ్ (తాత్కాలిక) |
తరువాత వారు | ఎస్.ఎం.కృష్ణ |
In office 10 ఫిబ్రవరి 1995 – 16 మే 1996 | |
ప్రధాన మంత్రి | పి.వి.నరసింహరావు |
అంతకు ముందు వారు | దినేష్ సింగ్ |
తరువాత వారు | సికందర్ భక్త్ |
లోక్సభ నాయకుడు | |
In office 22 మే 2004 – 26 జూన్ 2012 | |
అంతకు ముందు వారు | అటల్ బిహారీ వాజపేయి |
తరువాత వారు | సుశీల్కుమార్ షిండే |
ప్లానింగ్ కమీషన్ డిప్యూటీ చైర్మన్ | |
In office 24 జూన్ 1991 – 15 మే 1996 | |
ప్రధాన మంత్రి | పి.వి.నరసింహరావు |
అంతకు ముందు వారు | మోహన్ ధరియా |
తరువాత వారు | మధు దండావతే |
రాజ్యసభా నాయకుడు | |
In office జనవరి 1980 – 31 డిసెంబరు 1984 | |
అంతకు ముందు వారు | కె.సి.పంత్ |
తరువాత వారు | వి.పి.సింగ్ |
లోక్సభ సభ్యుడు జంగిపూర్ లోక్సభ నియోజకవర్గం నుండి | |
In office 10 మే 2004 – 26 జూన్ 2012 | |
అంతకు ముందు వారు | అబుల్ హస్నాట్ ఖాన్ |
తరువాత వారు | అభిజిత్ ముఖర్జీ |
వ్యక్తిగత వివరాలు | |
జననం | ప్రణబ్ కుమార్ ముఖర్జీ (1935-12-11)1935 డిసెంబరు 11 మిరాటీ, బెంగాల్ ప్రెసిడెన్సి,బ్రిటిష్ ఇండియా. |
మరణం | 2020 ఆగస్టు 31(2020-08-31) (వయసు 84) న్యూఢిల్లీ, భారతదేశం |
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ (1969–1986; 1989–ప్రస్తుతం) రాష్ట్రీయ సమాజ్ వాదీ కాంగ్రెస్ (1986–1989) |
ఇతర రాజకీయ పదవులు | యునైటెడ్ ప్రొగ్రెస్సివ్ అలయన్స్ (2004–ప్రస్తుతం) |
జీవిత భాగస్వామి | సువ్రా ముఖర్జీ
(m. 1957; మరణం 2015) |
సంతానం | 3, శర్మిష్టా ముఖర్జీ, అభిజిత్ ముఖర్జీ లతో పాటు. |
కళాశాల | కలకత్తా విశ్వవిద్యాలయం |
1969లో జరిగిన కాంగ్రెస్ సభలో అతను బంగ్లా కాంగ్రెస్ ప్రతినిధిగా ప్రసంగించాడు. ఆ ప్రసంగం విన్న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ముగ్ధురాలైపోయింది. అతని తండ్రి స్వాతంత్ర్య సమరయోధుడని, కాంగ్రెస్ పార్టీలో అనేక హోదాల్లో పనిచేశాడని తెలుసుకున్న ఆమె ఒక ఏడాది ముగిసే లోపే అతనికి కాంగ్రెస్ తరఫున రాజ్యసభ సభ్యుడయ్యే అవకాశం కల్పించింది. ఇందిరాగాంధీకి అత్యంత విశ్వసనీయమైన వ్యక్తులలో ఒకడైనందున అతను 1973 లో కేంద్ర ప్రభుత్వంలో స్థానం పొందాడు. 1976 –77 లో వివాదస్పదమైన అంతర్గత అత్యవసర పరిస్థితిలో జరిగిన దురాగతాల విషయంలో కాంగ్రెస్ పార్టీలోను మిగతా కాంగ్రెసు నాయకుల వలెనే అతను కూడా విమర్శలు ఎదుర్కొన్నాడు. అనేక మంత్రి స్థాయి పదవులు నిర్వర్తించిన ముఖర్జీ సేవలు 1982–84 లో తొలిసారిగా ఆర్థిక మంత్రిగా పనిచెయ్యడంతోముగిసాయి. 1980–85 లో రాజ్యసభ నాయకునిగా పనిచేసాడు.
1973లో కేంద్ర కేబినెట్లో అడుగు పెట్టిన ప్రణబ్ నెహ్రూ కుటుంబంలోని మూడు తరాల నేతలకు సన్నిహితుడు. ఇందిరాగాంధీ హయాంలో ఓ వెలుగు వెలిగినా రాజీవ్ గాంధీ హయాంలో కొద్దికాలం పార్టీకి దూరమయ్యాడు. 1984 లో ఇందిరా గాంధీ హత్య తరువాత భారత ప్రధానిగా ఏ మాత్రం రాజకీయ అనుభవం లేని రాజీవ్ గాంధీని సూచించడం సరికాదని భావించాడు. ప్రధానమంత్రి పదవి పోరాటంలో ముఖర్జీ ఓడిపోయాడు. రాష్ట్రీయ సమాజ్ వాది కాంగ్రెస్ పేరిట సొంత పార్టీ పెట్టుకున్నాడు. 1989లో తిరిగి రాజీవ్గాంధీతో రాజీ కుదరడంతో తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశాడు. 1991లో రాజీవ్ గాంధీ హత్య జరిగిన తరువాత అనూహ్య రాజకీయ పరిణామాలతో పి.వి.నరసింహారావు ప్రధాని కావడంతోనే ప్రణబ్కు పూర్వ వైభవం వచ్చింది. 1991లో ప్రణాళికా సంఘం డిప్యూటీ ఛైర్మన్గా ప్రణబ్ను నియమించిన పి.వి.నరసింహారావు 1995లో విదేశీ వ్యవహారాల శాఖను కట్టబెట్టాడు. అంతకు ముందు పరిశ్రమల శాఖా మంత్రిగా పనిచేసిన ప్రణబ్ అప్పటి నుంచీ కేబినెట్లోని అన్ని కీలక శాఖల్లో సమర్ధవంతంగా పనిచేశాడు. సోనియా రాజకీయ రంగప్రవేశానికి సంబంధించిన ప్రకటన వెలువడగానే ఆమె విదేశీయత గురించి కొందరు వేలెత్తి చూపగా ప్రణబ్ మాత్రం సోనియాకు అండగా నిలిచాడు. కాంగ్రెస్ సీనియర్ నాయకునిగా అతను 1998 లో సోనియా గాంధీ పార్టీ అధ్యక్షురాలిగా కావడానికి ప్రధాన పాత్ర పోషించాడు.
అందుకే 2004లో కాంగ్రెస్ పార్టీ నేతృత్వం వహిస్తున్న యునైటెడ్ ప్రొగ్రెసివ్ అలయన్స్ కూటమి అధికారంలోకి రాగానే, అతను మొదటి సారి లోక్సభకు ఎన్నికైనాడు. ప్రభుత్వంలో కీలకమైన రక్షణశాఖకు మంత్రిగా సేవలనందించాడు. అప్పటి నుండి అతను 2012లో తాను రాజీనామా చేసేవరకు మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో రెండవ స్థానంలో ఉన్నాడు.
అతను అనేక కీలకమైన కేబినెట్ మత్రిత్వ పదవులను చేపట్టాడు. రక్షణ శాఖా మంత్రి (2004–06), విదేశీ వ్యవహారాల మంత్రి (2006–09), ఆర్థిక మంత్రి (2009–12) గా తన సేవలనంచించాడు. అతను లోక్సభకు నాయకునిగా కూడా పనిచేసాడు. జూలై 2012 న యునైటెడ్ ప్రొగ్రెసివ్ అలయన్స్ (యు. పి. ఎ) అతనిని రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించింది. అతను రాష్ట్రపతి ఎన్నికలలో 70 శాతం ఎలక్టోరల్ కాలేజి వోట్లను పొంది ప్రత్యర్థి పి.ఎ.సంగ్మాను ఓడించాడు.
2017లో ముఖర్జీ రాష్ట్రపతి ఎన్నికలలో మరలా పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నాడు. వయసు పైబడినందున ఆరోగ్య సమస్యలరీత్యా రాజకీయాల నుండి పదవీ విరమణ చేయాలని భావించాడు. అతని రాష్ట్రపతి పదవీ కాలం 2017 జూలై 25 న ముగిసింది.[2][3][4] అతని తరువాత రాష్ట్రపతిగా రామ్నాథ్ కోవింద్ ఎన్నికయ్యాడు.