రామ్నాథ్ కోవింద్
భారతీయ రాజకీయవేత్త, భారతదేశం యొక్క 14 వ అధ్యక్షుడు / From Wikipedia, the free encyclopedia
రామ్నాథ్ కోవింద్ (జ.1945, అక్టోబరు 1) భారతదేశపు 14వ రాష్ట్రపతి.[1] అతను 2017 జూలై 25 నుండి భారత రాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.[2] అంతకు పూర్వం అతను 2015 నుండి 2017 వరకు భీహార్ రాష్ట్రానికి గవర్నర్గా ఉన్నాడు.[3][4] అతను 1994 నుండి 2006 వరకు భారత పార్లమెంటు సభ్యునిగా (రాజ్యసభ) ఉన్నాడు. అతనిని రాష్ట్రపతి అభ్యర్థిగా కేంద్రం లోని ఎన్.డి.ఎ ప్రభుత్వం ఎంపిక చేసింది. 2017 రాష్ట్రపతి ఎన్నికలలో అతను భారత 14వ రాష్ట్రపతిగా ఎన్నుకోబడ్డాడు. భారత రాష్ట్రపతి పదవినలంకరించిన దళిత వ్యక్తులలో ఇతను రెండవవాడు.[5] రాజకీయాలలోనికి ప్రవేశించక పూర్వం అతను 1993 వరకు,16 సంవత్సరాలపాటు ఢిల్లీ హైకోర్టు, సుప్రీం కోర్టులలో న్యాయవాదిగా ఉన్నాడు.[6]
త్వరిత వాస్తవాలు ప్రధాన మంత్రి, ఉపరాష్ట్రపతి ...
రామ్నాథ్ కోవింద్ | |||
పదవీ కాలం 25 జూలై 2017 – 25 జూలై 2022 | |||
ప్రధాన మంత్రి | నరేంద్ర మోదీ | ||
---|---|---|---|
ఉపరాష్ట్రపతి | మహమ్మద్ హమీద్ అన్సారీ ముప్పవరపు వెంకయ్యనాయుడు | ||
ముందు | ప్రణబ్ ముఖర్జీ | ||
తరువాత | ద్రౌపది ముర్ము | ||
పదవీ కాలం 16 ఆగస్టు 2015 – 20 జూన్ 2017 | |||
ముందు | కేశరి నాథ్ త్రిపాఠి | ||
తరువాత | కేశరి నాథ్ త్రిపాఠి | ||
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | (1945-10-01) 1945 అక్టోబరు 1 (వయసు 78) పరౌంక్త్, యునైటెడ్ ప్రొవెన్సీస్, బ్రిటిష్ ఇండియా. | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
ఇతర రాజకీయ పార్టీలు | నేషనల్ డెమోక్రాటిక్ అలియన్స్ | ||
జీవిత భాగస్వామి | సావిత్రీ కోవింద్ (m. 1974) | ||
నివాసం | రాష్ట్రపతి భవన్ | ||
పూర్వ విద్యార్థి | కాన్పూర్ విశ్వవిద్యాలయం |
మూసివేయి