(దక్షిణభారత) తెలుగు సినిమా నటి, గాయని, తెలుగు రచయిత్రి, హాస్య రచయిత్రి, దర్శకురాలు, సంగీత దర్శకుర From Wikipedia, the free encyclopedia
భానుమతీ రామకృష్ణ (సెప్టెంబరు 7, 1926 - డిసెంబరు 24, 2005) దక్షిణ భారత సినిమా నటి, నిర్మాత, దర్శకురాలు, స్టూడియో అధినేత్రి, రచయిత్రి, గాయని, సంగీత దర్శకురాలు ఈమె బహుముఖ ప్రజ్ఞాశాలి. మల్లీశ్వరి, సారంగధర,విప్రనారాయణ, బొబ్బిలి యుధ్ధం, మంగమ్మ గారి మనవడు , పెళ్ళికానుక వంటి అనేక విజయవంతమైన చిత్రాలలో నటించారు. ఈమె ఒంగోలులో జన్మించింది. ఈమె తండ్రి బొమ్మరాజు వెంకట సుబ్బయ్య శాస్త్రీయ సంగీత కళాకారుడు. తండ్రి దగ్గర సంగీతం అభ్యసించిన ఆమె పదమూడేళ్ళ వయసులోనే వరవిక్రయం అనే సినిమాలో నటించింది. తమిళ, తెలుగు చిత్రాల నిర్మాత, దర్శకుడు, ఎడిటరు అయిన పి. ఎస్. రామకృష్ణారావును వివాహమాడింది. తర్వాత భరణి స్టూడియోస్ అనే పేరుతో పలు చిత్రాలు నిర్మించారీ దంపతులు. భానుమతి రాసిన అత్తగారి కథలు తెలుగు సాహిత్యంలో గుర్తింపు పొందాయి. కళారంగానికి ఆమె అందించిన సేవలకుగాను 1966 లో ఆమెకు భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారం 2001 లో పద్మభూషణ్ పురస్కారం అందుకుంది.[1]
భానుమతీ రామకృష్ణ | |
---|---|
జననం | భానుమతీ రామకృష్ణ సెప్టెంబరు 7, 1926 |
మరణం | డిసెంబరు 24, 2005 చెన్నై |
ఇతర పేర్లు | భానుమతి |
వృత్తి | సినిమా నటి, నిర్మాత, దర్శకురాలు, స్టూడియో అధినేత్రి, రచయిత్రి, గాయని సంగీత దర్శకురాలు. |
జీవిత భాగస్వామి | పి.యస్. రామకృష్ణారావు |
పిల్లలు | భరణి (కుమారుడు) |
తల్లిదండ్రులు |
|
భానుమతి 1926 వ సంవత్సరం సెప్టెంబరు 7 ప్రకాశం జిల్లా, ఒంగోలులో జన్మించింది. ఆమె తండ్రి బొమ్మరాజు వెంకటసుబ్బయ్య, శాస్త్రీయ సంగీత ప్రియుడు, కళావిశారదుడు.[2] భానుమతి తండ్రి వద్ద నుండే సంగీతమును అభ్యసించింది. అనేక కట్టుబాట్లు గల కుటుంబ వాతావరణంలో పెరిగినప్పటికీ ఆమె ఎంతో ధైర్యంగా పదమూడేండ్ల చిరు ప్రాయంనాడే 1939 లో విడుదలైన వరవిక్రయం అనే సినిమాలో నటించింది. ఈ సినిమా నిర్మాణ సమయములో తన కుమార్తెను తాకరాదని ఆమె తండ్రి షరతు విధించాడు. హీరో, నిర్మాతలు అలాగే నడుచుకున్నారు.
ఆమె 1943, ఆగష్టు 8 న తమిళ, తెలుగు చిత్ర నిర్మాత, డైరెక్టరు, ఎడిటర్ పి.యస్. రామకృష్ణారావును ప్రేమ వివాహమాడింది. వీరి ఏకైక సంతానం భరణి. ఈ భరణి పేరుమీదనే భరణీ స్టూడియో నిర్మించి, అనేక చిత్రాలు ఈ దంపతులు నిర్మించారు.
చదువు పై ఆసక్తి తో భానుమతి 40 సంవత్సరాల వయస్సు దాటాక మెట్రిక్, పి.యు.సి మొదటి తరగతిలో ఉత్తీర్ణురాలు అయింది. భానుమతి అభిమాని అయిన నాటి రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్] ఆమెను లోకసభకు పోటీ చేయమని సూచన చేశారు, రాజకీయాలు తమకు పడవని భానుమతి దంపతులు సున్నితంగా తిరస్కరించారు.[3].
భానుమతి కేవలము నటిగానే కాక బహుముఖ ప్రజ్ఞాశాలిగా పలువురి మన్ననలు అందుకున్నది. ఓ గాయనిగా, సంగీత దర్శకురాలిగా, స్టూడియో యజమానిగా, నిర్మాతగా, దర్శకురాలిగా, రచయిత్రిగా పలు పాత్రలు సమర్ధవంతంగా నిర్వర్తించింది. దక్షిణాది నుంచి హిందీ చిత్రసీమకు వెళ్లిన తొలి సినీతార భానుమతి. ఆ రోజుల్లోనే పాన్ ఇండియా ఘనత సాధించింది. అపూర్వ సహోదరులు, మంగళ, చండీరాణి లాంటి చిత్రాలు ఏక కాలంలో తెలుగు, తమిళ్, హిందీ భాషలలో త్రిభాషా చిత్రాలుగా రూపొంది ఘన విజయం సాధించాయి.[3]
గాయనిగా భానుమతి ఎంతో పేరుప్రతిష్టలు సంపాదించుకుంది. సినిమా పాటలే కాక రేడియోలోనూ, రికార్డుల్లోనూ ఆమె పాడిన పాటలు వినవచ్చాయి. విజయవాడ రేడియో కేంద్రం ప్రారంభమైనప్పుడు వినిపించిన ప్రారంభగీతం పసిడి మెరుంగుల తళతళలు బాలాంత్రపు రజనీకాంతరావుతో కలిసి ఆమె పాడినదే.[4] [[దస్త్రంపసిడిమెరుంగుల తళతళలు - గానం – భానుమతి , రజని గార్లు.ogg|thumb|విజయవాడ కేంద్రం ప్రారంభ గీతికగా బాలాంత్రపు రజనీకాంత రావు, భానుమతీ రామకృష్ణ పాడిన "పసిడి మెరుంగుల తళతళలు" ప్రసారం చేశారు.]] గానం అంటే భానుమతికి చాలా ఇష్టం. వీణా వాదనం లోనూ ఆమెకు ప్రావీణ్యత ఉంది. పండిట్ రవిశంకర్ సితార్ సంగీతాన్ని ఆమె ఇష్టపడేది. తమిళనాడు ప్రభుత్వం ఒక సంగీత కళాశాలకు భానుమతిని ప్రధానాచార్యులు గా నియమించింది. దాదాపు ప్రతి రోజు కళాశాలకు వెళ్లి శాస్త్రోక్తంగా సంగీతం నేర్పించేవారు. ఆమెకు తెలుగు భాష అంటే మక్కువ, తమిళ భాష మీద పట్టు వుండేది. ఆంగ్ల పదాలను అవసరమైతే తప్ప ఉపయోగించేది కాదు.[1]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.