మద్రాసు ప్రెసిడెన్సీ
బ్రిటిషు భారత దేశంలో ఒక పరిపాలనా విభాగం / From Wikipedia, the free encyclopedia
మద్రాసు ప్రెసిడెన్సీ బ్రిటిష్ ఇండియా లోని పరిపాలనా ఉపవిభాగం (ప్రెసిడెన్సీ). ప్రస్తుత భారతదేశంలోని తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, కేరళ, కర్ణాటక, లక్షద్వీప్ వంటి ప్రాంతాలతో సహా దక్షిణ భారతదేశంలో చాలా వరకూ మద్రాసు ప్రెసిడెన్సీలో భాగంగా ఉండేవి. దీన్ని ఫోర్ట్ సెయింట్ జార్జ్ ప్రెసిడెన్సీ అనీ, మద్రాసు ప్రావిన్స్ అనీ కూడా పిలుస్తారు. మద్రాసు నగరం, ప్రెసిడెన్సీకి శీతాకాల రాజధాని గాను ఊటీ వేసవి రాజధాని గానూ ఉండేవి. 1793 నుండి 1798 వరకు సిలోన్ ద్వీపం మద్రాసు ప్రెసిడెన్సీలో భాగంగా ఉండేది. మద్రాసు ప్రెసిడెన్సీకి వాయవ్య దిశలో మైసూరు రాజ్యం, నైరుతిలో కొచ్చి రాజ్యం, ఉత్తరాన హైదరాబాద్ రాజ్యం ఉన్నాయి. ప్రెసిడెన్సీ లోని కొన్ని భాగాలను ఆనుకుని బొంబాయి ప్రెసిడెన్సీ కూడా ఉంది.
మద్రాసు ప్రెసిడెన్సీ/ప్రెసిడెన్సీ ఆఫ్ ఫోర్ట్ సెంట్ జార్జి/ మద్రాసు ప్రావిన్సు | ||||||
ప్రెసిడెన్సీ of బ్రిటిషు ఇండియా | ||||||
| ||||||
| ||||||
1913 లో మద్రాసు ప్రెసిడెన్సీ | ||||||
Capital | శీతాకాలం: మద్రాసు వేసవి: ఊటీ | |||||
Historical era | నయా సామ్రాజ్యవాదం | |||||
- | Established | 1652 | ||||
- | Disestablished | 1947 | ||||
Dutch India | 1605–1825 |
---|---|
Danish India | 1620–1869 |
French India | 1668–1954 |
Portuguese India (1505–1961) | |
Casa da Índia | 1434–1833 |
Portuguese East India Company | 1628–1633 |
బ్రిటిషు ఇండియా (1612–1947) | |
ఈస్ట్ ఇండియా కంపెనీ | 1612–1757 |
భారతదేశంలో కంపెనీ పాలన | 1757–1858 |
భారతదేశంలో బ్రిటిషు పాలన | 1858–1947 |
British rule in Burma | 1824–1948 |
స్వదేశీ సంస్థానాలు | 1721–1949 |
భారత విభజన | 1947 |
1639 లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మద్రాసుపట్నం గ్రామాన్ని కొనుగోలు చేసింది. మచిలీపట్నం, ఆర్మగావ్ల వద్ద 1600 ల నాటికే కంపెనీ కర్మాగారాలు ఉన్నప్పటికీ, ఒక సంవత్సరం తరువాత మద్రాసుపట్నంలో ఫోర్ట్ సెంట్ జార్జ్ ఏజెన్సీని స్థాపించారు. ఇది మద్రాసు ప్రెసిడెన్సీకి పూర్వగామి. 1652 లో దీన్ని ప్రెసిడెన్సీగా అప్గ్రేడ్ చేసారు. 1655 లో తిరిగి ఏజెన్సీగా మునుపటి స్థితికి తీసుకొచ్చారు. మళ్ళీ 1684 లో, దీనిని తిరిగి ప్రెసిడెన్సీగా మార్చారు. ఎలిహు యాలేను ప్రెసిడెన్సీకి తొలి ప్రెసిడెంటుగా నియమించారు. 1785 లో, పిట్ ఇండియా చట్టం నిబంధనల ననుసరించి ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించిన మూడు ప్రావిన్సులలో మద్రాసు ఒకటి. అప్పటి నుండి ఈ ప్రావిన్సు అధిపతిని "ప్రెసిడెంట్" అని కాకుండా "గవర్నర్" అని పిలవడం మొదలుపెట్టారు. ఈ గవర్నరు, కలకత్తాలోని గవర్నర్ జనరల్ అధీనంలో పనిచేసేవారు. ఈ గవర్నర్ జనరల్ పదవి అప్పటి నుండి 1947 వరకూ కొనసాగింది. న్యాయ, శాసన, కార్యనిర్వాహక అధికారాలు గవర్నర్ వద్దనే ఉండేవి. ఆయనకు కౌన్సిల్ సహాయపడేది. ఈ కౌన్సిల్ రూపనిర్మాణం 1861, 1909, 1919, 1935 లలో చేసిన సంస్కరణల ద్వారా సవరించారు. 1939 లో రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమయ్యే వరకు మద్రాసులో క్రమం తప్పకుండా ఎన్నికలు జరిగుతూ వచ్చాయి. 1908 నాటికి, ఈ ప్రావిన్సులో ఇరవై రెండు జిల్లాలు ఉండేవి. ఒక్కో జిల్లా ఒక్కో జిల్లా కలెక్టరు పాలనలో ఉండేది. జిల్లాను తాలూకాలు, ఫిర్కాలుగా విభజించారు. పరిపాలన యొక్క అతిచిన్న యూనిట్, గ్రామం.
1919 నాటి మాంటేగు-చెమ్స్ఫోర్డ్ సంస్కరణలను అమలు చేసిన మొదటి ప్రావిన్సు మద్రాసు. దీని ప్రకారం ద్వంద్వ ప్రభుత్వ పద్ధతి అమల్లోకి వచ్చింది. ఈ పద్ధతిలో గవర్నరు, ముఖ్యమంత్రి కలిసి పరిపాలించేవారు. 20 వ శతాబ్దం ప్రారంభ దశాబ్దాలలో, భారత స్వాతంత్ర్య ఉద్యమకారులు చాలా మంది మద్రాసు ప్రావిన్సు నుండి వచ్చారు. 1947 ఆగస్టు 15 న స్వాతంత్ర్యం రావడంతో, మద్రాసు ప్రెసిడెన్సీ మద్రాసు ప్రావిన్సు అయింది. 1950 జనవరి 26 న భారత గణతంత్ర రాజ్యం ఏర్పడినపుడు మద్రాసు ప్రావిన్సు మద్రాసు రాష్ట్రంగా మారింది.